గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రూర్కెలాలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహించిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జుయెల్ ఓరాం
భౌతిక సంక్షేమానికి, మానసిక శాంతికి, ఆధ్యాత్మిక వృద్ధికి యోగాను ఆచరించాలి : శ్రీ జుయెల్ ఓరాం
Posted On:
21 JUN 2024 5:29PM by PIB Hyderabad
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జుయెల్ ఓరాం ‘‘సొంతం కోసం, సమాజం కోసం యోగా’’ అనే థీమ్ తో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. రూర్కెలాలోని బిర్సా ముందా హాకీ స్టేడియంలో జూన్ 21వ తేదీన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా సెషన్ లో ఆయన పాల్గొనడంతో పాటు భౌతిక సంక్షేమానికి, మానసిక శాంతికి, ఆధ్యాత్మిక వృద్ధికి ప్రతీ ఒక్కరూ యోగాను ఆచరించాలని ప్రోత్సహించారు.
మధ్యప్రదేశ్ లోని బెతుల్ లో జరిగిన ఐవైడి కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ డి.డి.ఉయికీ పాల్గొన్నారు. యోగాచరణ అందరినీ ఐక్యం చేస్తుందని, ప్రధానమంత్రి యోగా ద్వారా ప్రపంచం యావత్తును ఐక్యం చేస్తున్నారని ఆయన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు న్యూఢిల్లీలో జరిగిన ఐవైడి 2024 కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
***
(Release ID: 2028149)