రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మియావాకి ప్లాంటేషన్ పద్ధతితో జాతీయ రహదారుల వెంబడి పచ్చదనాన్ని పెంపొందించనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ ఏ ఐ)
प्रविष्टि तिथि:
18 JUN 2024 3:42PM by PIB Hyderabad
జాతీయ రహదారులను పచ్చదనంతో నింపాలనే దార్శనికతను సాకారం చేయడానికి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ప్రదేశాలలో జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న భూములలో మియావాకి మొక్కల పెంపకాన్ని చేపట్టడానికి ప్రత్యేక చొరవ తీసుకోనుంది. మియావాకి ప్లాంటేషన్ ఏర్పాటు కోసం ఢిల్లీ-ఎన్సీఆర్ చుట్టుపక్కల వివిధ ప్రాంతాల్లో మొత్తం 53 ఎకరాలకు పైగా భూమిని గుర్తించారు.
ద్వారకా ఎక్స్ ప్రెస్ వేలోని హర్యానా సెక్షన్ లో 4.7 ఎకరాలు, ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలోని ఢిల్లీ-వడోదర సెక్షన్ లోని సోహ్నా సమీపంలో 4.1 ఎకరాల భూమి, హర్యానాలోని అంబాలా-కోట్ పుత్లీ కారిడార్ లోని ఎన్ హెచ్ 152డిలోని చాబ్రీ, ఖర్ఖారా ఇంటర్ చేంజ్ పై సుమారు 5 ఎకరాల భూమి, ఎన్ హెచ్ 7 బైపాస్ పై 12 ఎకరాలకు పైగా భూమిని జాతీయ రహదారుల వెంట మియావాకి తోటల పెంపకానికి ప్రతిపాదించారు. ఇందులో ఘజియాబాద్ సమీపంలోని ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేపై దుహై ఇంటర్ చేంజ్ సమీపంలో 9.2 ఎకరాలు, ఉత్తరప్రదేశ్ లోని ఎన్ హెచ్ -34లోని మీరట్ -నజీబాబాద్ సెక్షన్ వద్ద 5.6 ఎకరాలు ఉన్నాయి.
ఎంపిక చేసిన స్థలాల్లో ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి, 2024 ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తయ్యే వర్షాకాల సీజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
మియావాకి తోటలను మియావాకి పద్ధతి అని కూడా అంటారు. ఈ ప్రత్యేకమైన జపనీస్ విధానం పర్యావరణ పునరుద్ధరణ మరియు అడవుల పెంపకం అభివృద్ధి కి అవలంభించే ఓ పద్ధతి. తక్కువ సమయంలో దట్టమైన, స్థానిక మరియు జీవవైవిధ్య అడవులను సృష్టించడం ఈ పద్ధతి యొక్క లక్ష్యం. ఈ అడవులు భూగర్భజలాలను నిలుపుకుని ఉంటాయి మరియు భూగర్భ జల మట్టాన్ని రీఛార్జ్ చేయడానికి సహాయపడతాయి. ఈ పద్ధతి ద్వారా చెట్లు పదిరెట్లు వేగంగా పెరిగి, తోటలు ధ్వని మరియు ధూళి అవరోధంగా పనిచేస్తాయి. మియావాకి ప్లాంటేషన్ పద్ధతిని విజయవంతంగా అమలు చేయడానికి, స్థానిక వాతావరణం మరియు నేల పరిస్థితులలో మనుగడ సాగించే దేశీయ జాతుల మొక్కలను నాటడంపై దృష్టి పెట్టనున్నారు.
మియావాకి అడవుల అభివృద్ధి స్థితిస్థాపక పర్యావరణ వ్యవస్థ సృష్టికి దోహదం చేస్తుంది, పర్యావరణానికి మరియు స్థానిక సమాజానికి వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మెరుగైన గాలి మరియు నేల నాణ్యత వంటి సూక్ష్మ-వాతావరణ పరిస్థితులలో మెరుగుదలలతో సహా ఇది బహుళ దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఇది జీవవైవిధ్య పరిరక్షణ, పచ్చదనాన్ని వేగంగా అభివృద్ధి చేయడం, సమర్థవంతమైన కర్బన శోషణ, నేల పునరుద్ధరణ మరియు స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలం కోసం ఆవాస సృష్టికి కూడా సహాయపడుతుంది. ఢిల్లీ/ఎన్సీఆర్లో మియావాకి ప్లాంటేషన్ సాధించిన విజయం ఆధారంగా దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి పునరావృతమవుతుంది.
మియావాకి పద్ధతిని ఉపయోగించి, పచ్చదనాన్ని పెంచడం వల్ల జాతీయ రహదారుల వెంట నివసించే పౌరుల ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడమే కాకుండా, ఎన్సిఆర్లోని జాతీయ రహదారుల అందాన్ని పెంచుతుంది మరియు ప్రయాణ సమయంలో ఆనందాన్ని పెంచుతుంది.
***
(रिलीज़ आईडी: 2026387)
आगंतुक पटल : 134