నీతి ఆయోగ్

నీతి ఆయోగ్ యొక్క ‘నీతి ఫర్ స్టేట్స్’ ప్లాట్‌ఫారమ్‌ను కమ్యూనికేషన్స్, రైల్వేలు మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నారు


నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్‌ఫారమ్ అనేది విధానాలు మరియు సుపరిపాలన కోసం ప్రభుత్వ డిజిటల్మౌలిక సదుపాయం (డీ పీ ఐ)గా మారడానికి రూపొందించబడిన బహురంగ విజ్ఞాన వేదిక.

ఇది 10 రంగాలలో విస్తరించి ఉన్న విజ్ఞాన ఉత్పత్తులు

7,500 ఉత్తమ విధానాలు, 5,000 విధాన పత్రాలు, 900+ సమాచార సెట్‌లు, 1,400 సమాచార ప్రొఫైల్‌లు మరియు 350 నీతి ప్రచురణల లైవ్ సమాహారం.

Posted On: 06 MAR 2024 12:58PM by PIB Hyderabad

కమ్యూనికేషన్లు, రైల్వేలు మరియు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ రేపు ఉదయం న్యూఢిల్లీలోని ఆకాశవాణిలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో నీతి ఆయోగ్ యొక్క రాష్ట్రాల కోసం నీతి (నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్‌ఫారమ్‌)ను ప్రారంభించనున్నారు. ‘నీతి ఫర్ స్టేట్స్’ అనేది పాలసీ మరియు సుపరిపాలన కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీ పీ ఐ)గా మారడానికి రూపొందించబడిన బహురంగ విజ్ఞాన వేదిక. వేదికను ప్రారంభించే ముందు శ్రీ అశ్విని వైష్ణవ్ నీతి ఆయోగ్‌లో ‘వికసిత్ భారత్ వ్యూహ గది’ని కూడా ప్రారంభిస్తారు. ‘వికసిత్ భారత్ వ్యూహ గది’’ అనేది ప్రభావవంతమైన వ్యక్తి నిర్ణయానికి  ఉపకరించడానికి  అంతర్దృష్టులు, సమాచారం మరియు విజ్ఞానంతో గొప్ప సదృశ్యత ను మరియు సంభాషణని అనుమతిస్తుంది.

 

ప్లాట్‌ఫారమ్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో విజ్ఞాన ఉత్పత్తులు 7,500 ఉత్తమ విధానాలు, 5,000 విధాన పత్రాలు, 900+ సమాచార సెట్‌లు, 1,400 సమాచార ప్రొఫైల్‌లు మరియు 350 నీతి ప్రచురణల లైవ్ సమాహారం. ప్లాట్‌ఫారమ్‌లోని విజ్ఞాన ఉత్పత్తులు వ్యవసాయం, విద్య, శక్తి, ఆరోగ్యం, జీవనోపాధి మరియు నైపుణ్యం, తయారీ, ఎం ఎస్ ఎం ఈ, పర్యాటకం, పట్టణ, నీటి వనరులు పారిశుధ్యం అనే రెండు ఉభయ-సమ్మిళిత థీమ్‌లలో - లింగం మరియు వాతావరణ మార్పులతో సహా 10 రంగాలకు విస్తరించాయి. ఈ ప్లాట్‌ఫారమ్  సహజమైన మరియు వినియోగదారు-స్నేహపూర్వక ఇంటర్‌ఫేస్. ఇది వినియోగదారులను సులభంగా అధ్యయనం చేయడానికి అనుమతిస్తుంది. ఇది మొబైల్ ఫోన్‌లతో సహా పలు పరికరాల ద్వారా అందుబాటులో ఉంటుంది.

 

‘నీతి ఫర్ స్టేట్స్’ ప్లాట్‌ఫారమ్ ప్రభుత్వ అధికారులను దృఢమైన, సందర్భోచిత సంబంధితమైన మరియు చర్య తీసుకోగల జ్ఞానం మరియు అంతర్దృష్టులతో సన్నద్ధం చేయడం ద్వారా పాలన యొక్క డిజిటల్ పరివర్తనను సులభతరం చేస్తుంది, తద్వారా వారి నిర్ణయాత్మక నాణ్యతను పెంచుతుంది. ఇది వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో వినూత్నమైన ఉత్తమ పద్ధతులకు ప్రాప్యతను అందించడం ద్వారా జిల్లా కలెక్టర్లు మరియు బ్లాక్-స్థాయి కార్యనిర్వాహకుల వంటి అత్యాధునిక స్థాయి ఉద్యోగులకు మద్దతు ఇస్తుంది.

 

 ‘వికసిత్ భారత్ వ్యూహ గది’ అనేది ఒక సమాలోచన భవనం, ఇక్కడ వినియోగదారుల సమాచారం, ధోరణులు, ఉత్తమ పద్ధతులు మరియు విధానాలను అర్థమయ్యే రీతిలో సదృశ్యం చేయగలరు, తద్వారా ఏదైనా సమస్య ప్రకటనను సమగ్రంగా అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది వినియోగదారునికి మాట ఏ ఐ ద్వారా సంభాషించడానికి  మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బహుళ వాటాదారులకు అనుసంధానం   అవ్వడానికి కూడా అనుమతిస్తుంది. రాష్ట్రాలు, జిల్లాలు మరియు బ్లాక్‌ల వారీగా ప్రతిరూపణను ప్రారంభించడానికి ఇది ప్లగ్-అండ్-ప్లే మోడల్‌గా రూపొందించబడింది.

 

నీతి ఆయోగ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ సంస్థలు సహకరించాయి. ఇందులో ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుకోగల  “సమర్థ్”  ఆన్‌లైన్ శిక్షణా మాడ్యూళ్లను ఇస్తుంది. నీతి ఆయోగ్ యొక్క నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్ (ఎన్ డీ ఏ పీ) ప్రభుత్వ డేటా సెట్‌లను పొందడానికి  ఏకీకృతం చేయబడింది. జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (ఎన్ ఈ జీ డీ) తొలి వికసిత్ భారత్ వ్యూహాత్మక గదిని అభివృద్ధి చేయడానికి మద్దతును అందించింది. అయితే భాషిణి ద్వారా బహుభాషా మద్దతు అందించబడింది. డిపిఐఐటి మద్దతుతో పీ ఎం గతిశక్తి బిసాగ్ - ఎన్ బృందం కూడా వైమానిక ఆధారిత  ప్రణాళిక కోసం జియోస్పేషియల్ టూల్‌ను ఏకీకృతం చేసింది.

***



(Release ID: 2012081) Visitor Counter : 201