వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కొత్త మార్కెట్‌లకు వ్యవసాయ ఎగుమతులను సులభతరం చేస్తోన్న అపెడ..తాజా పండ్లు, కూరగాయలు, శ్రీ అన్నపై దృష్టి పెట్టింది


ఇరాక్, వియత్నాం, సౌదీ అరేబియాలకు ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేసిన ఎగుమతులు

Posted On: 06 MAR 2024 1:17PM by PIB Hyderabad

అగ్రికల్చర్‌ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడ) భారతదేశం నుండి వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా కొన్ని ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు విలువ గొలుసును పెంచడానికి తాజా పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జంతు ఉత్పత్తుల వంటి ప్రాధాన్యత ఉత్పత్తులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఐరోపా, లాటిన్ అమెరికా మరియు ఆసియా వంటి కీలక మార్కెట్‌లలోకి విస్తరించడంపై దృష్టి సారించిన అపెడ తన ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ప్రపంచ సూపర్ మార్కెట్‌లతో చిన్న భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా పరిశోధనా సంస్థల సహకారంతో సముద్ర ప్రోటోకాల్‌లను ఏర్పాటు చేయడం ద్వారా లాజిస్టికల్ ఖర్చులను తగ్గించేందుకు సంస్థ కృషి చేస్తోంది. ఈ వ్యూహాత్మక కార్యక్రమాలు పోటీతత్వాన్ని పెంపొందించడం మరియు స్థిరమైన వృద్ధిని నడపడం ద్వారా భారతదేశ వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి అపెడ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

శ్రీ అన్న అంటే మిల్లెట్స్‌ను ప్రోత్సహించడానికి అపెడ సమిష్టి ప్రయత్నాలు ఆరోగ్యకరమైన మరియు మరింత వైవిధ్యభరితమైన ఆహార ఉత్పత్తులను పెంపొందించాలనే ప్రభుత్వ దృష్టితో ప్రతిధ్వనిస్తున్నాయి. గత సంవత్సరంలో అంతర్జాతీయ మిల్లెట్స్-2023 సంవత్సరంలో ప్రత్యేక దృష్టి సారించిన అపెడ శ్రీ అన్నా బ్రాండ్ క్రింద విస్తృత శ్రేణి విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి మరియు ఏకీకరణ కోసం కృషి చేసింది.

ఈ వ్యూహాత్మక ఆలోచన  పాస్తా, నూడుల్స్, అల్పాహార తృణధాన్యాలు, ఐస్ క్రీం, బిస్కెట్లు, ఎనర్జీ బార్‌లు మరియు స్నాక్స్‌తో సహా వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులను రూపొందించడానికి మరియు ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి దారితీసింది. శ్రీ అన్నా ఉత్పత్తి శ్రేణిని వైవిధ్యపరచడం ద్వారా అపెడా కేవలం ఆవిష్కరణలను ప్రేరేపించడమే కాకుండా  ఆ ఉత్పత్తులను ఎగుమతి విలువ గొలుసుకు సజావుగా అనుసంధానించింది. ఈ ప్రయత్నాల ద్వారా అపెడ శ్రీ అన్న మిల్లెట్స్ ప్రొఫైల్‌ను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రోత్సహించడం మరియు భారతదేశ వ్యవసాయ ఎగుమతి పోర్ట్‌ఫోలియో విస్తరణను సులభతరం చేయడం వంటి ప్రభుత్వ విస్తృతమైన ఎజెండాకు దోహదం చేస్తుంది.

2023లోని ఏప్రిల్-నవంబర్ నెలల్లో ఇరాక్, వియత్నాం, సౌదీ అరేబియా మరియు యూకే వంటి ప్రధాన మార్కెట్‌లకు ఎగుమతులను అపెడ సులభతరం చేసింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన వృద్ధిని సాధించింది. వృద్ధి వరుసగా 110%, 46%, 18% మరియు 47% పెరగడం ఈ అద్భుతమైన విస్తరణ కీలక మార్కెట్లలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను నొక్కి చెబుతుంది.

ఉత్పత్తుల చేరికను పెంపొందించే లక్ష్యంలో భాగంగా అపెడ స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు మరియు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓలు/ఎఫ్‌పిసిలు) గ్లోబల్ ఈవెంట్‌లలో వారి భాగస్వామ్యాన్ని ప్రారంభించడం ద్వారా వారికి మద్దతునిస్తోంది.

ఎగుమతిదారుల నుండి ఫీడ్‌బ్యాక్‌కు ప్రతిస్పందనగా అపెడ టర్కీ, దక్షిణ కొరియా, కెన్యా, దక్షిణాఫ్రికా మరియు జపాన్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో కొత్త ఫెయిర్‌లలో పాల్గొనే ప్రారంభానికి నాయకత్వం వహిస్తోంది. ఈ చురుకైన విధానం భారతీయ ఎగుమతిదారులకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేయడం మరియు స్థిరమైన వృద్ధి అవకాశాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

 
****


(Release ID: 2011972) Visitor Counter : 105