రైల్వే మంత్రిత్వ శాఖ

ఆపరేషన్ ‘నన్హే ఫారిస్టే’ కింద జనవరి 2024లో 549 మంది పిల్లలను తిరిగి కలిపిన ఆర్‌పిఎఫ్‌


13,615 రైళ్లలో మహిళా ప్రయాణికులకు భద్రత కల్పించిన 229 "మేరీ సహేలీ" బృందాలు

జనవరి 2024లో 76 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారినుండి రూ.4.13 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న ఆర్పీఎఫ్

Posted On: 16 FEB 2024 1:54PM by PIB Hyderabad

రైల్వే ఆస్తులు, ప్రయాణీకుల ప్రాంతాలు మరియు ప్రయాణికుల శ్రేయస్సును పరిరక్షించడంలో  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్‌) నిబద్ధతతో పనిచేస్తోంది. 2024  జనవరి నెలలో ఆర్‌పిఎఫ్‌ ప్రయాణీకుల భద్రత మరియు సౌకర్యాన్ని అందించడం కొనసాగించింది. అదే సమయంలో భారతీయ రైల్వే తన వినియోగదారులకు నమ్మకమైన సరుకు రవాణా సేవలను అందించడంలో సహాయం చేస్తుంది.

2024 జనవరి నెలలో ఆర్‌పిఎఫ్‌ తను చేపట్టిన అనేక కార్యకలాపాలలో కొన్ని ప్రశంసనీయ విజయాలను సాధించింది: -

ఆపరేషన్ "నాన్హే ఫారిస్టే"- తప్పిపోయిన పిల్లలను రక్షించడం: మిషన్ "నాన్హే ఫారిస్టే" కింద సంరక్షణ మరియు రక్షణ అవసరమైన 549 కంటే ఎక్కువ మంది పిల్లలను వారి కుటుంబాలతో తిరిగి కలపడంలో ఆర్‌పిఎఫ్‌ కీలక పాత్ర పోషించింది. ఈ పిల్లలు వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి వేరు చేయబడ్డారు మరియు వారు సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లడానికి ఆర్‌పిఎఫ్‌ అవిశ్రాంతంగా పనిచేసింది.

ఆపరేషన్ "జీవన్ రక్ష"- ప్రాణాలను కాపాడటం: ఆర్‌పిఎఫ్‌ యొక్క అప్రమత్తమైన మరియు వేగవంతమైన చర్య 233 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. వారు కదులుతున్న రైళ్లను ఎక్కినప్పుడు లేదా దిగుతున్నప్పుడు ప్రమాదవశాత్తు పడిపోయారు. అయితే జనవరి 2024లో ఆపరేషన్ 'జీవన్ రక్ష'లో ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది అప్రమత్తతతో చక్రాల క్రింద, ప్లాట్‌ఫారమ్‌లు మరియు రైల్వే ట్రాక్‌ల వద్ద చిక్కుకోకుండా తృటిలో తప్పించుకున్నారు.

మహిళా ప్రయాణీకులకు సాధికారత - "మేరీ సహేలి" చొరవ: ఆర్‌పిఎఫ్‌ మహిళా ప్రయాణీకుల భద్రతను ప్రధానంగా పరిగణిస్తుంది. మరియు "మేరీ సహేలి" చొరవను ప్రారంభించింది. జనవరి 2024 నెలలో 229 "మేరీ సహేలి" బృందాలు 13,615 రైళ్లలో ప్రయాణిస్తూ 4.1 లక్షల మంది మహిళా ప్రయాణీకులకు భద్రతా హామీని అందించారు. మహిళా ప్రయాణికుల కోసం కేటాయించిన కోచ్‌లలో ఇతర ప్రయాణికులను గుర్తించి 7402 మందిపై ఆర్‌పిఎఫ్‌ చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది.

టౌట్స్‌పై క్రాకింగ్ డౌన్ (ఆపరేషన్ "ఉప్లబ్ద్"): టౌట్‌లకు వ్యతిరేకంగా పోరాటంలో ఆర్‌పిఎఫ్‌ జనవరి 2024 నెలలో 379 మంది వ్యక్తులను అరెస్టు చేసింది మరియు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. అంతే కాకుండా వారు  రిజర్వు చేసిన రైల్వే టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 44.46 లక్షలు.

ఆపరేషన్ "నార్కోస్" - మాదకద్రవ్యాల నేరాలను ఎదుర్కోవడం: ప్రశంసనీయమైన ప్రయత్నంలో ఆర్‌పిఎఫ్‌  2024 జనవరి నెలలో  76 మంది వ్యక్తులను అరెస్టు చేసింది మరియు వారినుండి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. వాటి విలువ రూ. 4.13 కోట్లు. ఈ నేరస్థులు తదుపరి చట్టపరమైన చర్యల కోసం ప్రభుత్వ ఏజెన్సీలకు అధికారం అప్పగించారు.

ప్రయాణీకుల సమస్యలకు సత్వర స్పందన: రైల్ మదద్ పోర్టల్ మరియు హెల్ప్‌లైన్ (నెం. 139 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ నం. 112తో అనుసంధానం చేయబడింది) ద్వారా భద్రతకు సంబంధించిన ప్రయాణీకుల ఫిర్యాదులను ఆర్‌పిఎఫ్‌ వెంటనే పరిష్కరించింది. జనవరి 2024 నెలలో 19,738 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు ఆర్‌పిఎఫ్ తీసుకుంది.

ఆపరేషన్ "యాత్రి సురక్ష" - ప్రయాణీకులను రక్షించడం: రైల్వే ప్రయాణీకులపై నేరాలను నిరోధించడంలో మరియు గుర్తించడంలో పోలీసుల ప్రయత్నాలకు ఆర్‌పిఎఫ్‌ అనుబంధంగా ఉంటుంది. జనవరి 2024లో ప్రయాణీకులపై నేరాలకు పాల్పడిన 225 మంది నేరస్థులను ఆర్‌పిఎఫ్‌ అరెస్టు చేసింది. వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వారిని సంబంధిత జీఆర్‌పి/పోలీసులకు అందించింది.

"ఆపరేషన్ సంరక్ష" ద్వారా భద్రతను నిర్ధారించడం: ప్రయాణీకుల భద్రతను నిర్వహించడానికి మరియు రైల్వే సేవలను రక్షించడానికి ఒక దృఢమైన ప్రయత్నంలో 2024 జనవరిలో నడుస్తున్న రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 53 మంది వ్యక్తులను ఆర్‌పిఎఫ్‌ అరెస్టు చేసింది.

అవసరమైన వారికి సహాయం చేయడం (ఆపరేషన్ సేవ): మానవతా దృక్పథంతో జనవరి 2024 నెలలో రైలు ప్రయాణాల్లో 227 మంది వృద్ధులు, అనారోగ్యం లేదా గాయపడిన ప్రయాణికులకు ఆర్‌పిఎఫ్‌ సహాయం అందించింది.

అక్రమ వస్తువుల రవాణాను అరికట్టడం (ఆపరేషన్ సటార్క్): "ఆపరేషన్ సటార్క్" కింద జనవరి 2024 నెలలో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్‌) అక్రమ పొగాకు ఉత్పత్తులను మరియు రూ.30.15 లక్షల  విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. 86 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తులను తదనంతరం సంబంధిత ప్రభుత్వ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఆపరేషన్‌ సమయంలో అదనంగా లెక్కల్లో చూపని నగదు రూ. 1.53 కోట్లు, బంగారం విలువ రూ. 37.18 లక్షలు, వెండి విలువ రూ.11.67 లక్షలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తన అంకితభావంతో కూడిన సిబ్బంది మరియు ప్రయాణీకులందరికీ సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడానికి దాని లక్ష్యం, సమగ్రత, మరియు బాధ్యత విలువలను సమర్థిస్తూ రైల్వే భద్రతలో ముందంజలో ఉంది.

 

***



(Release ID: 2006711) Visitor Counter : 88