రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అసోంలో ఎన్‌హెచ్‌ 715కెపై మజులి-జోర్హాట్‌ను కలుపుతూ కొత్త 2 వరుసల హైవే నిర్మాణానికి రూ. 382.10 కోట్లు మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 13 FEB 2024 4:22PM by PIB Hyderabad

అసోంలోని ఎన్‌హెచ్‌ 715కెపై మజులి-జోర్హాట్‌లను కలుపుతూ కొత్త 2 వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.382.10 కోట్లను కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మంజూరు చేశారు. దీనికి అదనంగా, అప్రోచ్‌ రోడ్లు, సర్వీస్ రోడ్లతో కూడిన ఎన్‌హెచ్‌-715లో ఒక పైవంతెన నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో ఉంటుంది. దీని మొత్తం పొడవు 20.479 కిలోమీటర్లు.

ప్రస్తుతం, జోర్హాట్-మజులి మధ్య ప్రత్యక్ష రహదారి అనుసంధానం లేదు. అక్కడి ప్రజలు బ్రహ్మపుత్ర నది మీదుగా పడవలపై ప్రయాణం చేస్తున్నారు. వరదలు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రాణనష్ట సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు, ఆ రెండు ప్రాంతాల మధ్య రహదారి అనుసంధానం ఏర్పాటు చేయడం ప్రాజెక్టు లక్ష్యమని శ్రీ గడ్కరీ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

అప్రోచ్ రోడ్లు, మజులి వంతెన వల్ల అనుసంధానం సాధ్యమవుతుంది, స్థానికుల సామాజిక-ఆర్థిక పరిస్థితులను గణనీయంగా మెరుగుపడతాయి, పర్యాటకం వృద్ధి చెందుతుందని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు. పైగా, ప్రజల ప్రయాణ సమయం, వాహన నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని వెల్లడించారు.

***


(Release ID: 2005746)
Read this release in: English , Urdu , Hindi , Assamese