ప్రధాన మంత్రి కార్యాలయం
వేమన జయంతి సందర్భంగా మహాయోగి వేమనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 JAN 2024 6:42PM by PIB Hyderabad
వేమన జయంతి సందర్భంగా మహాయోగి వేమనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో తెలుగులో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.
“వేమన జయంతి సందర్భంగా ఈ రోజు మహాయోగి వేమన గారు పంచిన అపూర్వమైన జ్ఞానాన్ని స్మరించుకుందాం. అతని పద్యాలు, లోతైన బోధనలు మనలను సత్యం, సరళత, మనశ్శాంతితో కూడిన జీవితం వైపు నడిపిస్తూ జ్ఞానోదయాన్నీ స్ఫూర్తిననీ కలిగిస్తూ ఉన్నాయి. అతని సునిశితమైన రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ, అతని బోధనలు మెరుగైన ప్రపంచం కోసం సాగే అన్వేషణలో మార్గదర్శనం చేస్తాయి.”
***
(रिलीज़ आईडी: 1998040)
आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam