సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

రామ్‌ల‌ల్లా ప్రాణ ప్ర‌తిష్ఠ సంద‌ర్భంగా 22 జ‌న‌వ‌రి 2024న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌వ‌ర‌కు ఒక‌/ ఒంటి పూట శ‌ల‌వు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

Posted On: 18 JAN 2024 4:47PM by PIB Hyderabad

రామ్‌ల‌ల్లా ప్ర‌తిష్ఠ సంద‌ర్భంగా భార‌త‌దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, కేంద్ర సంస్థ‌లు & కేంద్ర పారిశ్రామిక సంస్థ‌లకు 22 జ‌న‌వ‌రి 2024న మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల వ‌ర‌కు, అంటే ఒక‌పూట శ‌ల‌వును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
అయోధ్య‌లో రామ్‌ల‌ల్లా ప్రాణ ప్ర‌తిష్ఠ జ‌రుగుతున్న సంద‌ర్భంగా ఆ వేడుక‌ల‌ను 22 జ‌న‌వ‌రి 2024న భార‌త‌దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతాయ‌ని ఉత్త‌ర్వు పేర్కొంది. ఉద్యోగులు ఆ వేడుక‌ల‌లో పాల్గొనే అవ‌కాశం క‌ల్పించేందుకు, భార‌త‌దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, కేంద్ర సంస్థ‌లు, కేంద్ర పారిశ్రామిక సంస్థ‌ల‌ను 22 జ‌న‌వ‌రి 2024న 2.30 గంట‌ల‌వ‌ర‌కు అంటే ఒక పూట‌ మూసివేస్తారు. 
భార‌త ప్ర‌భుత్వానికి చెందిన అన్ని మంత్రిత్వ శాఖ‌లు/   విభాగాల‌పై నిర్ణ‌యాన్ని సంబంధిత వారంద‌రి దృష్టికీ తీసుకురావ‌చ్చ‌ని కూడా సూచించ‌డం జ‌రిగింది. 

 

***
 



(Release ID: 1997634) Visitor Counter : 204