వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి గతిశక్తిపై సెమినార్: సమగ్ర అభివృద్ధి కోసం సరైన నిర్ణయం తీసుకోవడం గురించి 10వ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌.

Posted On: 10 JAN 2024 8:18PM by PIB Hyderabad

జ్ఞానాన్ని పంచుకోవడం, నెట్‌వర్కింగ్ మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం వ్యూహాత్మక ప్రపంచ వేదిక “గేట్‌వే టు ఫ్యూచర్” అనే థీమ్‌తో 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు 2024, జనవరి10వ తేదీ-12 తేదీ వరకు గుజరాత్‌లో కొనసాగుతోంది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ సదస్సును ప్రారంభించారు.  భాగస్వామ్య దేశాలు మరియు సంస్థల నుండి 1000పైగా  ప్రతినిధులు ఈ సదస్సులో  పాల్గొన్నారు, పరిశ్రమలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మరియు మీడియా నుండి అనేక మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. భారతదేశం యొక్క మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం,  రీజినల్ ఇండియా -మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ (ఐఎంఈఈసీ) అభివృద్ధి ప్రణాళికలతో పాటు పరిశ్రమ మరియు ప్రపంచ భాగస్వాములకు అనేక పెట్టుబడి అవకాశాలను తెరుస్తున్నాయని గౌరవప్రదమైన ప్రధాన మంత్రి తన ప్రసంగంలో నొక్కిచెప్పారు.

"పీఎం గతిశక్తి: సమగ్రాభివృద్ధికి సరైన నిర్ణయం తీసుకోవడం" అనే అంశంపై జరిగిన సెమినార్ సందర్భంగా, పీఎం గతిశక్తి జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఎలా విప్లవాత్మకంగా మారుస్తోంది అనే అంశంపై చర్చలు జరిగాయి. ప్రధానమంత్రి గతిశక్తి గుజరాత్ చొరవ కింద గుజరాత్ రాష్ట్రం అవలంబించిన ఉత్తమ పద్ధతులపై సంకలనాన్ని కేంద్ర వాణిజ్యం & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ, మరియు జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ మరియు ముఖ్యమంత్రి శ్రీ. భూపేంద్ర భాయ్ పటేల్ ప్రారంభించారు.

 మంత్రి పీయూష్ గోయల్ తన ప్రసంగం సందర్భంగా మాట్లాడుతూ.. పీఎం గతిశక్తి  కార్యక్రమం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మౌలిక సదుపాయాల ప్రణాళిక దృక్కోణాన్ని ఎలా మారుస్తుందో ప్రస్తావించారు, ఇది  మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లలో సమయం మరియు ఖర్చును గణనీయంగా తగ్గించడంలో దోహదపడింది. ప్రధానమంత్రి గతిశక్తిని విజయవంతంగా స్వీకరించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి మరియు గుజరాత్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ, గుజరాత్ అనుకూలమైన విధానం ఇతర రాష్ట్రాలు అనుసరించడానికి ఒక ఉదాహరణగా నిలిచిందని ఉద్ఘాటించారు. పీఎం గతిశక్తి కార్యక్రమం యొక్క అధిక ప్రయోజనం మరియు సాధారణ సూత్రాలు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు సులభంగా స్వీకరించడాన్ని ప్రారంభించాయి. అంతేకాకుండా సహకార సమాఖ్య సూత్రాలలో పాతుకుపోయిన డబుల్- ఇంజన్ వృద్ధి దృష్టికి దోహదం చేస్తున్నాయి. పీఎం గతిశక్తి భారత్‌కు ప్రణాళికా సాధనంగా ఉండటమే కాకుండా ప్రపంచం మొత్తం దానిని ప్రణాళికా సాధనంగా స్వీకరిస్తుంది అని ఆయన నిర్ధారించారు.

 గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ మాట్లాడుతూ.. సమర్ధవంతమైన ప్రణాళిక మరియు పటిష్టమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల అమలుతో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అమృత్‌కాల్‌ను స్వర్ణయుగంగా మార్చాలనే గౌరవప్రదమైన ప్రధానమంత్రి దార్శనికతను సమలేఖనం చేయడం ముఖ్యమని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పౌర సేవలు, పరిశ్రమలు, వ్యాపారాలు, తయారీదారులు, వ్యవసాయం మరియు రైతులు మరియు గ్రామీణ వ్యవస్థలను కవర్ చేస్తూ రూపొందించబడింది. జీఐఎస్ ప్లాట్‌ఫారమ్  నిరంతరాయంగా ఎటువంటి జాప్యంలేని సమన్వయం, భౌతిక మరియు ఆర్థిక పర్యవేక్షణ మరియు ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. అందువల్ల పీఎం గతిశక్తి ద్వారా సమీకృత మౌలిక సదుపాయాల ప్రణాళిక నుండి అమలు వరకు ఒక సమగ్ర దృష్టిని సాధించవచ్చని నిర్ధారించవచ్చు.


సదస్సులో భాగంగా జరిగిన ఓ సెషన్ లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రత్యేక  కార్యదర్శి సుమితా దావ్రా  సమీకృత ప్రణాళిక మరియు తదుపరి తరం మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజల-కేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహించడంలో పీఎం గతిశక్తి కార్యక్రమం యొక్క సహకారాన్ని ప్రదర్శించారు. టెలికాం, పెట్రోలియం మరియు సహజ వాయువు, పునరుత్పాదక శక్తి, ప్రాంత ఆధారిత ప్రణాళిక మొదలైన రంగాలలో పీఎం గతిశక్తి యొక్క కొన్ని ఉత్తమ వినియోగ సందర్భాలను ప్రదర్శించడానికి ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మరియు గుజరాత్ రాష్ట్రం నుండి ఇతర ప్యానెలిస్ట్‌లు భాగస్వామ్యం చేసిన విజయగాథలతో కూడా ఈ ప్రయోజనాలు ప్రతిధ్వనించాయి.

"రెసిలెంట్ సప్లై చైన్‌లు మరియు స్మార్ట్ లాజిస్టిక్స్"పై ప్యానెల్ చర్చ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్‌లో అనేక అవకాశాలు మరియు అభివృద్ధిని అందించింది, ఇవి క్రాస్ సెక్టోరల్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. పోర్ట్ ఆధారిత అభివృద్ధి నమూనాపై ఉపయోగకరమైన అంతర్దృష్టులు, సుపరిపాలన కోసం కన్వర్జెన్స్ విధానం, సులభతర వాణిజ్యం వలె మౌలిక సదుపాయాలు, పరిసర ప్రాంతంలో లాజిస్టిక్స్ ఉద్యమంపై అటల్ సేతు - ముంబై ట్రాన్స్-హార్బర్ లింక్ యొక్క సానుకూల ప్రభావం, జీఎస్టీ, యూఎల్ఐపీ లాజిస్టిక్స్ డేటా వంటి దేశీయ ఆవిష్కరణలు బ్యాంక్, డిజిటల్ ట్విన్ మరియు లాజిస్టిక్స్‌లో ఏఐ, లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్‌లో వివిధ వాటాదారుల మధ్య సహకారాన్ని సులభతరం చేయడంలో ప్యానెలిస్ట్‌లు చర్చించారు. పీఎం గతిశక్తిపై డిమాండ్ ఆధారిత ప్రణాళిక, మరియు సులభమైన క్రాస్-బోర్డర్ ప్రవాహాల కోసం ప్రామాణీకరణ అవసరం, సమర్థవంతమైన లాజిస్టిక్స్ పర్యావరణ వ్యవస్థ కోసం సాంకేతికతను ఉపయోగించడం వంటివి 2030 నాటికి సంబంధించిన రోడ్ మ్యాప్‌లో భాగమైన కొన్ని పారామీటర్స్ .



(i) గ్లోబల్ వ్యాల్యూ చైన్స్పై ఢిల్లీ డిక్లరేషన్, (ii)  సప్లై చైన్ ఏర్పాట్లపై సప్లై చైన్ రెసిలెన్స్ ఇనిషియేటివ్ (ఎస్సీఆర్ఐ) 2021, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పిరిటీ (ఐపీఈఎఫ్), మరియు సౌత్ ఏషియా సబ్-రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఎస్ఏఎస్ఈసీ) వంటివి  స్థితిస్థాపకంగా మరియు స్థిరమైన సరఫరా గొలుసుల కోసం భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం యొక్క చురుకైన చొరవగా ఉద్దేశించబడ్డాయి.  



 అంతేకాకుండా  భారత ప్రభుత్వం యొక్క సంస్కరణలు మరియు పీఎల్ఐ, మేక్ ఇన్ ఇండియా, పీఎం గతిశక్తి, భారతమాల, సాగరమాల, ఎఫ్డీఐ  యొక్క సరళీకరణ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మొదలైన పథకాలు  దేశంలోని సరఫరా గొలుసులను క్రమంగా ఏకీకృతం చేయడానికి మరియు వాటిని మరింత స్థితిస్థాపకంగా మార్చడానికి పెట్టుబడి ప్రవాహాలను మరియు తయారీని బలోపేతం చేస్తున్నాయి.

వివిధ రంగాలలో పురోగతిని నడిపించడంలో పీఎం గతిశక్తి యొక్క కీలక పాత్రను గుర్తిస్తూ, ఈ సెమినార్ వ్యూహాలను అన్వేషించడానికి మరియు సమగ్ర మరియు స్థిరమైన వృద్ధి కోసం సమాచార, డేటా-ఆధారిత నిర్ణయాధికారం యొక్క సంస్కృతిని పెంపొందించడానికి,  జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంతోపాటు వ్యాపారం చేయడం , కీలకమైన వాటాదారులను ఒకచోట చేర్చిందిఈ పరివర్తన చొరవ యొక్క ప్రభావాన్ని పెంచడానికి విలువైన అంతర్దృష్టులు మరియు సిఫార్సులను రూపొందించడంలో ఇది సహాయపడింది.

***



(Release ID: 1995372) Visitor Counter : 81