మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఒడిశాలోని భద్రక్లో జరిగిన సాగర్ పరిక్రమ యాత్ర ఫేస్XI మూడవరోజు కార్యక్రమాలకు కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా నేతృత్వం వహించారు.
జనవరి 7 నుండి 9 వరకు ఒడిశాలోని గంజాం, పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపారా, భద్రక్ మరియు బాలాసోర్ వంటి వివిధ తీరప్రాంత జిల్లాల్లో సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-XI కొనసాగింది.
Posted On:
09 JAN 2024 8:00PM by PIB Hyderabad
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల నేతృత్వంలో సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-XI మూడవ రోజు ఒడిశాలోని భద్రక్ జిల్లా, చాందినిపాల్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారులు, మత్స్యకార మహిళలు, పిఎఫ్సిఎస్ సభ్యులు తదితర లబ్ధిదారులతో ఆయన సంభాషించారు. మత్స్యకారులు మరియు పీఎంఎంఎస్వై పథకం కింద లబ్ధిపొందినవారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయడంతోపాటు వారి పరిష్కారమార్గాలపై చర్చించారు. ఇక్కడి ఎండు చేపలకు భారతదేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. కాగా చాందినీపాల్ ఫిష్ల్యాండ్ పై దాదాపు 10వేల మంది మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు.
ఈ సందర్భంగా చాందినిపాల్ మత్స్యకారులు తమ సమస్యలను కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలాకు విన్నవించారు. పరిశుభ్రత అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్కెట్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటం వంటి సవాళ్లతోపాటు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. బంగాళాఖాతంలో ధమరా నది కలిసే భద్రక్లోని ధమర ఫిషింగ్ హార్బర్ వద్ద సాగర్ పరిక్రమ యాత్ర కొనసాగింది.
శ్రీ పర్షోత్తం రూపాలా PMMSY కింద లబ్ధిదారులతో సంభాషించారు మరియు వారికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC)తో సత్కరించారు. పిఎంఎంఎస్వై పథకం కింద ఆయన ఆస్తులను (ఐస్బాక్స్తో కూడిన మోటార్సైకిల్) లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
పీఎంఎంఎస్వై పథకం కార్యకలాపాలను నిర్వహించడం భారతదేశంలోని మత్స్య రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని శ్రీ రూపాలా అన్నారు. పీఎంఎంఎస్వై చేపల పెంపకం మరియు ఆక్వాకల్చర్ యొక్క ఆధునిక మరియు శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా చేపల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మత్స్యకారులు మరియు చేపల ఆదాయాన్ని పెంచడమే కాకుండా మార్కెట్లో చేపల లభ్యతను పెంచుతుంది. ఇది ఆహార భద్రత మరియు పోషకాహారంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ సందర్భంగా, ఆధునిక చేపల రిటైల్ మార్కెట్ నిర్మాణం, ఇప్పటికే ఉన్న ఐస్ ప్లాంట్ను ఆధునీకరించడం కోసం గో-అహెడ్ లెటర్లు జారీ చేయబడ్డాయి.
ఫిష్ల్యాండ్ అభివృద్ధికి తీసుకున్న ప్రధాన కార్యక్రమాలు మరియు ప్రాజెక్టుల గురించి ఫిషరీస్ సెక్రెటరీ డాక్టర్ అభిలాక్ష్ లిఖి తెలియజేశారు. ఆక్వా పార్క్, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్ లతోపాటు మత్స్యకారుల సంక్షేమం మరియు జీవనోపాధి కోసం రూ.1071 కోట్లు మంజూరు చేయబడ్డాయి. అనంతరం మంత్రి పర్షోత్తం రూపాలా భద్రక్లోని ధమర ఫిషింగ్ హార్బర్ను సందర్శించి పరిశీలించారు మరియు క్షేత్రంలో మత్స్యకారులతో సంభాషించారు మరియు వారి ఇన్సులేట్ వ్యాన్ గురించి చర్చించారు. చేపల క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించేందుకు ఆయన మత్స్యకార నౌకను కూడా సందర్శించారు.
భద్రక్ జిల్లా చూడామణి మరియు ఒడిషాలోని బాలాసోర్ జిల్లా చండీపూర్ ఫిషింగ్ హార్బర్లో ఈ కార్యక్రమం కొనసాగింది. ఆ తర్వాత మత్స్యకారులు, మత్స్యకార మహిళలు మరియు చేపల పెంపకందారులతో క్షేత్రస్థాయి సంభాషణ జరిగింది. లబ్ధిదారులకు కేసీసీ, ఆస్తుల పంపిణీ (ఐస్ బాక్స్తో ఆటో-రిక్షా) వంటి ప్రయోజనాలను అందజేశారు. అంతేకాకుండా పీఎంఎంఎస్వై పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులతో ఆందోళనలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. పీఎంఎంఎస్వై కార్యక్రమం భారతీయ మత్స్య రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని మంత్రి పర్షోత్తం రూపాలా ఆశాభావం వ్యక్తంచేశారు. మత్స్యకారులు, మత్స్యకారమహిళలు తమ అనుభవాన్ని పంచుకుని, మత్స్య రంగం అభివృద్ధిని పెంపొందించేందుకు యంత్రాంగాలను సూచించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి మంజులత మండల్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ బిష్ణుబ్రత, మత్స్సశాఖ కార్యదర్శి డాక్టర్అభిలాక్ష్ లిఖి, మత్స్యశాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీమతి నీతూకుమారి ప్రసాద్, ఇతర విభాగాల అధికారులు కూడా ఒడిశాలోని భద్రక్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 14,700 మంది ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యూట్యూబ్, ఎక్స్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో సైతం ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. విశేష స్పందన లభించిన సాగర్ పరిక్రమ ఫేజ్-XI కార్యక్రమం అద్భుతమైన ముగింపుతో సానుకూల ప్రభావం చూపింది.
సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-XI 2024 జనవరి 7వ తేదీన ప్రారంభమైంది, మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు మరియు వాటాదారులతో పరస్పర చర్యను సులభతరం చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్య సంబంధిత పథకాలు మరియు కార్యక్రమాల సమాచారాన్ని ప్రచారం చేయడం, ఉత్తమ పద్ధతులను హైలైట్ చేయడం, బాధ్యతాయుతమైన మత్స్య సంపదను ప్రోత్సహించడం మరియు అన్ని మత్స్యకారులు మరియు సంబంధిత వాటాదారులతో సంఘీభావాన్ని ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను ఈ యాత్రలో భాగంగా చేపట్టారు. 9 జనవరి 2024 వరకు ఒడిశాలోని గంజాం, పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపారా, భద్రక్ మరియు బాలాసోర్ వంటి వివిధ తీరప్రాంత జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగింది.
సాగర్ పరిక్రమ ఫేజ్-XI యాత్ర శ్రీ పర్షోత్తం రూపాల నేతృత్వంలో ఇతర గౌరవనీయ ప్రజా అధికారుల సమక్షంలో జరిగింది. సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-XI సందర్భంగా, మత్స్యకార మహిళా గ్రూపు ప్రతినిధులు, మెకనైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్ యజమానుల సంఘం ప్రతినిధులు, ఆక్వా రైతులు, ఎండు చేపల విక్రయదారుల సంఘం ప్రతినిధులు, ఇతర పీఎంఎంఎస్వై మరియు కేసీసీ లబ్ధిదారులతో కేంద్ర మంత్రి, సహాయ మంత్రి మరియు ఇతర ప్రముఖులు సంభాషించారు. యాత్ర జరిగిన ప్రతిచోటా లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి సమస్యలను, విజయగాథలను పంచుకున్నారు. మత్స్యకారులకు పీఎంఎంఎస్వై మరియు కేసీసీ వంటి పథకాల కింద మత్య్సకారులు, లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, సర్టిఫికెట్లు, ఇతర ప్రయోజనాలను అందజేశారు.
***
(Release ID: 1994722)