నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూదిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతున్న 'ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024'లో పాల్గొన్న 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్'

Posted On: 04 JAN 2024 3:21PM by PIB Hyderabad

కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఆధ్వర్యంలో పని చేసే మినీరత్న విభాగం-I సంస్థ 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎస్‌ఈసీఐ), న్యూదిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతున్న 'ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024'లో పాల్గొంది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో), డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) సంయుక్తంగా జనవరి 3 - 10 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

ఎస్‌ఈసీఐ స్టాల్‌లో రోహిత్ చౌబే, మేనేజర్ (వ్యాపార అభివృద్ధి), ఎస్‌ఈసీఐ

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, డీపీఐఐటీ చేపట్టిన కార్యక్రమాలు, ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

‘ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024’ను, జనవరి 3న, కేంద్ర విదేశాంగ మంత్రి డా.సుబ్రహ్మణ్యం జైశంకర్, కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రారంభించారు. [మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి] 

ఎస్‌ఈసీఐ వివిధ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహం, అభివృద్ధిలో పాల్గొంటోంది. ముఖ్యంగా, సౌర, పవన, పునరుత్పాదక శక్తి-ఆధారిత ఇంధన నిల్వ వ్యవస్థలు, విద్యుత్‌ వ్యాపారం, ఆర్‌&డీ, గ్రీన్ హైడ్రోజన్, హరిత అమ్మోనియా, ఆర్‌ఈ-ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వాటిని అభివృద్ధి చేస్తోంది.

కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన శాఖకు చెందిన అనేక పథకాల అమలు కోసం ఉన్న నోడల్ ఏజెన్సీల్లో ఎస్‌ఈసీఐ ఒకటి. దీనికి కేటగిరీ 1 విద్యుత్‌ వ్యాపార అనుమతి కూడా ఉంది. సౌర/పవన/హైబ్రిడ్/ఆర్‌టీసీ/బీఎస్‌ఈఎస్ విద్యుత్‌ వ్యాపారంలో ఈ కంపెనీ చురుగ్గా ఉంది.

***


(Release ID: 1993172)