మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం లింగ న్యాయం మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది.

నవభారత దార్శనికతకు సాక్ష్యంగా భారతదేశం మహిళా-అభివృద్ధి నుండి మహిళా-నేతృత్వ అభివృద్ధి వైపు పరివర్తన చెందుతోంది.

Posted On: 20 DEC 2023 2:28PM by PIB Hyderabad

లింగ న్యాయం అనేది భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రభుత్వం యొక్క ముఖ్యమైన నిబద్ధత. లింగ న్యాయమైన సమాజాన్ని ప్రోత్సహించడానికి మరియు వివిధ డొమైన్‌లలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి   ప్రభుత్వం సంవత్సరాలుగా అనేక చర్యలు చేపట్టింది. వీటిలో క్రిమినల్ చట్టాలు మరియు 'గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005', 'వరకట్న నిషేధ చట్టం, 1961', 'బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006' వంటి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.  'మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) చట్టం, 1986'; 'మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిహారం) చట్టం, 2013', 'అనైతిక రవాణా (నివారణ) చట్టం, 1956', 'సతి నిరోధక చట్టం, 1987', 'లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం , 2012', 'జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015, పంచాయతీ రాజ్ సంస్థల్లో (పీఆర్ఐలు) మహిళలకు కనీస 1/3వ వంతు రిజర్వేషన్లు, కేంద్ర/రాష్ట్ర పోలీసు బలగాలలో మహిళలకు రిజర్వేషన్లు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) మరియు సైనిక్ స్కూల్స్, కమాండో ఫోర్సెస్ మొదలైనవి మహిళల ప్రవేశానికి సంబంధించిన నిబంధనలను అనుమతిస్తుంది.

గత కొన్ని సంవత్సరాలుగా నవభారత దార్శనికతకు సాక్ష్యంగా భారతదేశం మహిళా-అభివృద్ధి నుండి మహిళా-నేతృత్వ అభివృద్ధి వైపు పరివర్తన చెందుతోంది. ఈ క్రమంలో..  విద్యా, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సాధికారతతో కూడిన జీవిత-చక్ర నిరంతర ప్రాతిపదికన మహిళల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అవలంబించింది.  తద్వారా వారు వేగవంతమైన మరియు స్థిరమైన జాతీయ అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు.

ప్రస్తుతం ప్రపంచంలో మహిళా దేశాధిపతి ఉన్న 15 దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా..  స్థానిక ప్రభుత్వాలలో అత్యధిక సంఖ్యలో ఎన్నుకోబడిన మహిళా ప్రతినిధులను భారతదేశం కలిగి ఉంది. ప్రపంచ సగటు కంటే భారతదేశంలో 10% ఎక్కువ మంది మహిళా పైలట్లు ఉన్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్ ప్రకారం..  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పైలట్‌లలో 5 శాతం మంది మహిళలు. కాగా.. భారతదేశంలో మహిళా పైలట్ల వాటా 15 శాతం కంటే ఎక్కువగా ఉంది.-

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) 2025 నాటికి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీ) 25 లో పాల్గొనేందుకు అన్ని షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ మరియు భారతదేశ ప్రధాన విమానాశ్రయ ఆపరేటర్‌లకు ఒక సలహా జారీ చేసింది.. దీని ప్రకారం..  విమానయానరంగం  వైవిధ్యం మరియు చేరిక ప్రాజెక్ట్ ప్రస్తుతం నివేదించబడిన కొలమానాలకు వ్యతిరేకంగా సీనియర్ స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్యను 25% పెంచాలి.  లేదా 2025 నాటికి కనీస ప్రాతినిధ్యాన్ని 25%కి పెంచాలి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సంస్థ.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఫైర్ సర్వీసెస్, ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలవంటి  ప్రాథమికమైన సున్నితమైన డొమైన్‌లలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రారంభించింది.  ఏఏఐ నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లో మహిళా అభ్యర్థులకు ఫీజులో మరింత మినహాయింపు ఇవ్వబడుతుంది.

ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యలో బాలికల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) దాదాపు అబ్బాయిలతో సమానంగా ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ (స్టెమ్)లో బాలికలు/మహిళల  సంఖ్య 43% ఉంది.  ఇది ప్రపంచంలోనే అత్యధికం. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ (స్టెమ్)లలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. 9 నుండి 12వ తరగతి వరకు వివిధ రకాల సైన్స్ అండ్ టెక్నాలజీలో బాలికల ప్రాతినిధ్యం తక్కువ ఉన్నందున 2020లో విజ్ఞానజ్యోతి  ప్రారంభించబడింది. 2017–-18లో ప్రారంభమైన ఓవర్సీస్ ఫెలోషిప్ స్కీమ్, భారతీయ మహిళా శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులకు స్టెమ్లో అంతర్జాతీయ సహకార పరిశోధనలను చేపట్టడానికి అవకాశాలను అందిస్తుంది. భారతదేశపు తొలి మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం), లేదా మంగళయాన్‌లో అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు ముఖ్యమైన పాత్రలు పోషించారు.  ఇందులో స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో శాస్త్రీయ పరికరాలను నిర్మించడం మరియు పరీక్షించడం కూడా ఉంది.

అంతేకాకుండా వివిధ రకాల పథకాల ద్వారా, శాసన వ్యవహారాల ద్వారా భారత ప్రభుత్వం వివిధ వివిధ వృత్తులలో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి వీలు కల్పించే నిబంధనలను రూపొందించింది. మహిళా కార్మికుల ఉపాధిని పెంపొందించడానికి స్కిల్ ఇండియా మిషన్ కింద  ప్రభుత్వ మహిళా పారిశ్రామిక శిక్షణా సంస్థలు, జాతీయ వృత్తి శిక్షణా సంస్థలు మరియు ప్రాంతీయ వృత్తి శిక్షణా సంస్థల నెట్‌వర్క్ ద్వారా మహిళలకు శిక్షణను అందిస్తోంది.

మహిళల ఉపాధిని ప్రోత్సహించడానికి.. ఇటీవల అమలులోకి వచ్చిన లేబర్ కోడ్‌లలో అనేక అనుకూలమైన నిబంధనలు చేర్చబడ్డాయి. వేతనాలపై కోడ్, 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్, 2020 మరియు మహిళా కార్మికులకు అనుకూలమైన పని వాతావరణాన్ని సృష్టించడం కోసం సామాజిక భద్రతపై కోడ్ 2020 వంటివి చేర్చారు.

నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ లేదా ఇ–నామ్ అనేది వ్యవసాయ వస్తువుల కోసం ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్. ఈ పథకంలో భాగంగా "కిసాన్ కాల్ సెంటర్లు" రైతుల సందేహాలకు వారి స్వంత మాండలికంలో టెలిఫోన్ కాల్‌లో సమాధానం ఇస్తుంది. కిసాన్‌సువిధ, అగ్రి మార్కెట్, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్, ఉమంగ్ (యూనిఫైడ్ మొబైల్) వంటి మొబైల్ అప్లికేషన్‌ల వంటి డిజిటల్ ఆవిష్కరణలు మహిళలు మార్కెట్‌లను యాక్సెస్ చేయడంలో ఎదుర్కొనే అడ్డంకులను అధిగమించడంలో లేదా భర్తీ చేయడంలో సహాయపడుతున్నాయి.

భారత ప్రభుత్వం "మిషన్ శక్తి"ని అమలు చేస్తుంది.  ఇందులో సంబల్ మరియు సామర్థ్య అనే రెండు భాగాలు ఉన్నాయి. “సంబల్” కింద, బేటీ బచావో బేటీ పడావో, వన్ స్టాప్ సెంటర్, ఉమెన్ హెల్ప్ లైన్ మరియు నారీ అదాలత్ వంటి భాగాలు పనిచేస్తున్నాయి. "సామర్థ్య" కింద ఉప పథకాలుగా..ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, శక్తి సదన్, మహిళల సాధికారత కోసం  సఖి నివాస్ కేంద అంటే... వర్కింగ్ ఉమెన్ హాస్టల్, పల్నా, అంగన్‌వాడీ కమ్ క్రీచెస్ వంటి పథకాలు అమలు చేయబడుతున్నాయి.

మహిళా రైతులకు అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన, పారంపరాగత్ కృషి వికాస్ యోజన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన మొదలైన రైతుల సంక్షేమ పథకాలు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ విస్తరణ సేవలతో సహా ఉత్పాదక వనరులకు వ్యవసాయ మహిళల ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. తద్వారా గ్రామీణ మహిళల జీవితాల్లో మొత్తం మెరుగుదలను తీసుకువస్తుంది.

ఆహార ధాన్యాల ప్రాసెసింగ్, తోటల పంటలు, నూనెగింజల ప్రాసెసింగ్, ఫిషరీస్, డైరీ మరియు పశువులు, స్పిన్నింగ్ మిల్లులు, చేనేత మరియు పవర్ లూమ్ నేయడం, సమగ్ర సహకార అభివృద్ధి ప్రాజెక్టులు మొదలైన వాటికి సంబంధించిన కార్యకలాపాలలో పెద్ద సంఖ్యలో మహిళలు నిమగ్నమై, సహకార సంఘాలలో నిమగ్నమై ఉన్నందున జాతీయ సహకార అభివృద్ధి సంస్థ మహిళా సహకార సంఘాల అభివృద్ధికి గణనీయమైన పాత్ర పోషిస్తోంది.

ప్రభుత్వ ప్రధాన పథకం దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవైఎన్ఆర్ఎల్ఏఎం), దాదాపు 10 కోట్ల మంది మహిళా సభ్యులను కలిగి ఉన్న సుమారు 90 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీలు) మహిళల ఆర్థిక సాధికారతకు సంబంధించి గ్రామీణ దృశ్యాన్ని మారుస్తున్నాయి.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేదా ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకం కింద మంజూరైన దాదాపు 40 మిలియన్ల ఇళ్లలో ఎక్కువ భాగం మహిళల పేరు మీదనే ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాయి. ‘వోకల్ ఫర్ లోకల్’ మహిళా సాధికారతతో చాలా సంబంధాన్ని కలిగి ఉంది. ఎందుకంటే చాలా స్థానిక ఉత్పత్తుల శక్తి మహిళల చేతుల్లోనే ఉంటుంది.

సాయుధ దళాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించడానికి ఫైటర్ పైలట్లు వంటి పోరాట పాత్రలతో సహా మహిళలకు శాశ్వత కమిషన్ మంజూరు చేయడం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మహిళల ప్రవేశాన్ని అనుమతించడం, సైనిక్ పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించడం వంటి నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది.  భారత వైమానిక దళంలో (ఐఏఎఫ్), మహిళా అధికారులు అన్ని శాఖలు మరియు స్ట్రీమ్‌లలో చేర్చబడ్డారు. ఐఏఎఫ్ మొదటిసారిగా అగ్నిపథ్ పథకం కింద ఇతర ర్యాంక్‌లలో మహిళలను అగ్నివీర్వాయుగా చేర్చింది. ప్రస్తుతం 154 మంది మహిళా అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు.

ప్రభుత్వ సేవలో ఎక్కువ మంది మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అనేక మహిళా కేంద్రీకృత కార్యక్రమాలను కూడా చేపట్టింది. వీటిలో, చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్), ప్రధాన కార్యాలయాన్ని విడిచిపెట్టడం మరియు సీసీఎల్ సమయంలో విదేశీ ప్రయాణంలో కొనసాగడం, పిల్లల సంరక్షణ కోసం వికలాంగ మహిళా ఉద్యోగులకు నెలకు  ప్రత్యేక భత్యంగా నెలకు రూ.3000 అందజేస్తున్నారు.   ఈశాన్య కేడర్‌ల అఖిల భారత సర్వీసు మహిళా అధికారులకు ప్రత్యేక పంపిణీ, లైంగిక వేధింపులకు గురైన మహిళా ప్రభుత్వోద్యోగులకు 90 రోజుల వరకు సెలవు, మహిళలకు పోటీ పరీక్షల నుంచి ఫీజు మినహాయింపు , ఒకే స్టేషన్‌లో భార్యాభర్తల పోస్టింగ్ మొదలైన చర్యలు తీసుకుంటున్నారు.

మహిళా బస్సు డ్రైవర్లు, కండక్టర్లు మరియు టూరిస్ట్ గైడ్‌ల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది.  అంతేకాకుండా, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలోని మొత్తం పోలీసు సిబ్బందిలో మహిళల ప్రాతినిధ్యాన్ని 33 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రజా జీవితంలో మహిళల ఉనికి పెరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో 81 మంది మహిళలు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. పంచాయతీ రాజ్ సంస్థలలో 1.45 మిలియన్లు లేదా 46% మంది మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు (తప్పనిసరి ప్రాతినిధ్యం 33%కి వ్యతిరేకంగా). భారత రాజ్యాంగానికి 73వ మరియు 74వ సవరణలు (1992) పంచాయతీలు మరియు మున్సిపాలిటీలలో మహిళలకు 1/3 సీట్లు రిజర్వేషన్లు కల్పించాయి.


 హౌస్ ఆఫ్ పీపుల్ (లోక్‌సభ) మరియు ఢిల్లీలోని ఎన్‌సిటి శాసనసభతో సహా రాష్ట్ర శాసనసభలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్ల రిజర్వేషన్ కోసం మహిళా సాధికారత మరియు దేశంలోని అత్యున్నత రాజకీయ కార్యాలయాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం అతిపెద్ద ముందడుగు నారీ శక్తి వందన్ అధినియం, 2023 (రాజ్యాంగం నూట ఆరవ సవరణ) చట్టం 2023 ప్రభుత్వం ద్వారా, 28 సెప్టెంబర్ 2023న నోటిఫికేషన్ చేయబడింది.

కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఈ సమాచారం అందజేశారు.

 

***



(Release ID: 1989146) Visitor Counter : 276


Read this release in: English , Urdu , Hindi , Tamil