మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

65 జిల్లా మరియు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు విద్యా పరిపాలనలో ఆవిష్కరణలు మరియు మంచి అభ్యాసాలను అందించినందుకు గాను జాతీయ అవార్డును ప్రదానం చేసిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

प्रविष्टि तिथि: 05 DEC 2023 8:37PM by PIB Hyderabad

కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు దేశవ్యాప్తంగా 65 మంది అత్యుత్తమ జిల్లా మరియు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులకు విద్యా పరిపాలనలో (2020-21 & 2021-22) ఆవిష్కరణలు మరియు మంచి అభ్యాసాలకు గాను జాతీయ అవార్డును ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఈపిఏ) ఛాన్సలర్ శ్రీ మహేష్ చంద్ర పంత్;  పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ సెక్రటరీ శ్రీ సంజయ్ కుమార్;ఎన్‌ఐఈపిఏ  వైస్ ఛాన్సలర్ ప్రొ. శశికళ వంజరి; మరియు విద్యా మంత్రిత్వ శాఖ  ఇతర అధికారులు మరియు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్) మరియు హెడ్, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఎన్‌ఐఈపిఏ ప్రొఫెసర్ కుమార్ సురేష్ ఈ కార్యక్రమం గురించి క్లుప్తంగా వివరణను అందించారు.

కార్యక్రమంలో ప్రసంగిస్తూ అవార్డులు పొందిన వారందరికీ శ్రీ ప్రధాన్ అభినందనలు తెలిపారు. విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేయడం పట్ల వారి అభిరుచిని మరియు పాఠశాలల్లో అభ్యాసాన్ని మరింత చైతన్యవంతం చేసేందుకు వినూత్న ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న వినూత్న విద్యా కార్యక్రమాలు మరియు ఉత్తమ అభ్యాసాలను భాగస్వామ్యం చేయడానికి మరియు గుర్తించడానికి ఒక వేదికను సృష్టించినందుకుగాను ఎన్‌ఐఈపిఏని అభినందించారు. ఎన్‌ఐఈపిఏ అట్టడుగు స్థాయిలో  స్ఫూర్తితో ఎన్‌ఈపి అమలును వేగవంతం చేయడానికి అలాగే పాఠశాల నిర్వాహకుల సామర్థ్యాలను పెంపొందించడానికి కూడా ప్రయత్నాలు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎన్‌ఈపి 2020  సారాంశానికి అనుగుణంగా మన అమృత్ పీఠిని ప్రపంచ పౌరులుగా మార్చడానికి అలాగే 2047 నాటికి విక్షిత్ భారత్  దార్శనికతను సాకారం చేయడానికి లక్ష్యం మరియు ఉద్దేశ్యంతో కలిసి పనిచేయాలని శ్రీ ప్రధాన్ అందరినీ ప్రోత్సహించారు.

10 మిలియన్ల ఉపాధ్యాయులు మరియు 260 మిలియన్ల మంది విద్యార్థులను కలిగి ఉన్న భారతీయ విద్యా వ్యవస్థ  విస్తారతను  శ్రీ ప్రధాన్ వివరిస్తూ..ఈ వ్యవస్థలో నాయకత్వం, ఆవిష్కరణ, మంచి అభ్యాసాల పరిచయం మొదలైన వాటి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. విద్యా నిర్వాహకులు మానవ వనరులను నిర్వహించే బాధ్యతను కలిగి ఉన్నందున వారు పోషించే ముఖ్యమైన పాత్రలను ఆయన హైలైట్ చేశారు అలాగే వారి వినూత్న పద్ధతులను విజయవంతంగా అమలు చేయడానికి వారిపై కొన్ని ప్రవర్తనా నియమావళిని విధించుకోవాలని సూచించారు.

ఎన్‌ఐఈపిఏ జిల్లా మరియు బ్లాక్-స్థాయి విద్యా అధికారుల కోసం విద్యా నిర్వహణలో ఆవిష్కరణలు & మంచి అభ్యాసాలకు జాతీయ అవార్డును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం కోసం అట్టడుగు స్థాయిలో విద్యా పరిపాలనలో ఆవిష్కరణలు మరియు మంచి అభ్యాసాలను ప్రోత్సహించడానికి ఈ పథకం 2014లో ప్రారంభించబడింది. విద్యా పరిపాలన యొక్క క్షేత్ర స్థాయిలో విద్యా పరిపాలనలో ఆవిష్కరణలు మరియు మంచి అభ్యాసాల సంస్కృతి మరియు పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

అవార్డుల లక్ష్యాలలో జిల్లా మరియు బ్లాక్ స్థాయిలలో విద్యా పరిపాలనలో ఆవిష్కరణలు మరియు మంచి అభ్యాసాలను డాక్యుమెంట్ చేయడం మరియు వ్యాప్తి చేయడం కూడా ఉన్నాయి. ఎంపికైన అధికారులకు న్యూ ఢిల్లీలో ఎన్‌ఐఈపిఏ నిర్వహించిన విద్యా పరిపాలనలో ఆవిష్కరణలు మరియు మంచి అభ్యాసాలపై రెండు రోజుల జాతీయ కాన్ఫరెన్స్‌తో పాటు జాతీయ అవార్డు ప్రెజెంటేషన్ ఫంక్షన్‌లో అవార్డు/ ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి మరియు వారి ఆవిష్కరణలను ప్రదర్శించడానికి అభ్యర్థులను ఆహ్వానిస్తారు.

 

image.png

image.png

 


 

* * * 


(रिलीज़ आईडी: 1983163) आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी