వ్యవసాయ మంత్రిత్వ శాఖ

అధిక దిగుబడినిచ్చే పప్పుధాన్యాల విత్తనాలు

Posted On: 05 DEC 2023 3:28PM by PIB Hyderabad

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సహకారంతో నిర్దిష్ట వాతావరణ పరిస్థితులు తట్టుకుని అధిక దిగుబడినిచ్చే వివిధ పప్పు ధాన్యాల విత్తనాలను నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సిస్టం (ఎన్ఏఆర్ఎస్) అభివృద్ధి చేసింది. 

 2014 నుంచి 2023 సెప్టెంబర్ వరకు ఏడు రకాల  పప్పు ధాన్యాల విత్తనాలను ఎన్ఏఆర్ఎస్ అభివృద్ధి చేసింది. బీహార్ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా  ఎన్ఏఆర్ఎస్   శనగ (6),బఠానీ   (6), పావురం బఠానీ (5), చిక్కుడు  (3), పెసలు  (2), మినుములు  (1), పప్పుధాన్యాలు (1) సహా మొత్తం 14 పప్పుధాన్యాల పంటలకు చెందిన 369 రకాల విత్తనాలను అభివృద్ధి చేసి  విడుదల చేసింది. 

కొత్త మెరుగుపరిచిన  విత్తనాలను త్వరితగతిన సాగుకు రైతులకు అందుబాటులోకి తీసుకు రావడానికి అనేక చర్యలు అమలు జరుగుతున్నాయి. 

(i) మెరుగైన  విత్తన ఉత్పత్తి మరియు సరఫరా. గత ఐదేళ్లలో 15.60 లక్షల క్యూ బ్రీడర్ పప్పుధాన్యాల విత్తనాన్ని ఐసీఏఆర్ ఉత్పత్తి చేసి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ విత్తనోత్పత్తి సంస్థలకు సరఫరా చేసింది.

(ii) 2016-17 నుంచి 2022-23 వరకు 7.09 లక్షల నాణ్యమైన విత్తనం, 21713 క్యూ బ్రీడర్ విత్తనాలు  ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి 150 పప్పుధాన్యాల విత్తన కేంద్రాలు, 2016లో బ్రీడర్ విత్తనోత్పత్తి పెంచేందుకు 12 కేంద్రాలు 2016 లో ఏర్పాటు అయ్యాయి.  వీటి ద్వారా 2016-17 నుంచి 2022-23 వరకు 7.09 లక్షల నాణ్యమైన విత్తనం, 21713 క్యూ బ్రీడర్ విత్తనాలు సరఫరా అయ్యాయి. 

(iii) 6.39 లక్షల గ్రామాల కోసం  మొత్తం 1587.74 లక్షల క్యూ నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి 

(iv) నాణ్యమైన విత్తనాలను  గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు సీడ్ విలేజ్ పథకం కింద 2014-23లో 98.07 లక్షల మంది రైతులకు శిక్షణ 

(v) 2018-19 నుంచి 2022-23 వరకు క్షేత్ర స్థాయిలో  6000 ప్రదర్శనలు,, 151873 క్లస్టర్ ఫ్రంట్ లైన్ ప్రదర్శనల  ద్వారా కొత్త అధిక దిగుబడినిచ్చే వంగడాలు పంపిణీ.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వకంగా ఒక ప్రశ్నకు ఇచ్చిన  సమాధానంలో ఈ వివరాలు అందించారు. 

 

***



(Release ID: 1983036) Visitor Counter : 74


Read this release in: English , Urdu , Hindi