సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ ను జెండా ఊపి ప్రారంభించిన గౌరవ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ. ఎస్.అబ్దుల్ నజీర్


3వ ‘జనజాతీయ గౌరవ్ దివస్’ సందర్భంగా‘హమారా సంకల్ప్ వికసిత్ భారత్’ ఉద్యమం లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ విభాగపు ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’

प्रविष्टि तिथि: 15 NOV 2023 7:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన బృహత్ ప్రజా  కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రప్రారంభోత్సవానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, శ్రీ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదలబుడు పంచాయతీ పరిధిలోని అరకులోయ రవ్వలగూడలో బుధవారం విక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’ (ఐఈసీ) ప్రచారవాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

 

  

అరకులోయలో IEC ప్రాచార వాహనాలు (వ్యాన్లను) జెండా ఊపి ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్, శ్రీ. S. అబ్దుల్ నజీర్,

 

ఆదివాసీల దుస్థితి, వారిపై జరిగే  దోపిడీని గుర్తించేలా బ్రిటిష్ ప్రభుత్వాన్నిఎదిరిస్తూ  భగవాన్ బిర్సా ముండా జరిపిన  స్ఫూర్తిదాయక పోరాటానికి కు ఘనంగా నివాళులర్పించిన గవర్నర్, భగవాన్ బిర్సా ముండా గిరిజనులను వారి సాంస్కృతిక మూలాలను అర్థం చేసుకోవడానికి ఐక్యతను పాటించమని ప్రోత్సహించారని అన్నారు. ఆదివాసీల వాదాన్ని చేపట్టమే కాకుండా  గిరిజన ఆత్మాభిమానాన్ని పునరుద్ధరించడానికి కృషి చేసిన మహానీయుడు బిర్సాముండా అని కొనియాడారు. ఈ సందర్భంగా  బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అలుపెరగని సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి పోరాడిన  విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు 'మన్యం వీరుడు' అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని కూడా గవర్నర్  గుర్తు చేసుకున్నారు.

 

భగవాన్ బిర్సా ముండా జన్మస్థలమైన జార్ఖండ్‌లోని ఖుంటి నుండి 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర'ను ప్రధాని ప్రారంభించడంతో పాటు గణనీయమైన గిరిజన జనాభాతో దేశవ్యాప్త వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనేక ప్రాంతాలలో ప్రారంభించారు.

 

ప్రారంభంలో, యాత్ర -అల్లూరి సీతారాం రాజు జిల్లా, పార్వతీపురం మన్యం - గణనీయమైన గిరిజన జనాభాను కలిగి ఉన్న ఈ రెండు జిల్లాలలో  సాగనుంది. వివిధ పథకాలకు అర్హులైనప్పటికీ ఇంతవరకు  సరైన లబ్ధి పొందని బలహీన వర్గాలకు ప్రభుత్వ పతకాలు  చేరువ చేయడమే ఈ యాత్ర లక్ష్యం.

 

ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలో, జిల్లా కలెక్టర్, శ్రీ నిశాంత్ కుమార్ ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించారు, భారత ప్రభుత్వ డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ శోబిత్ గుప్తా కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

  

 

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభం సందర్భంగా, పిఎం ముద్ర, పిఎం  ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP), ఉజ్వల పథకం ఇంకా మహిళా సాధికారతకు ఆర్థిక సహాయం కింద అర్హులైన వ్యక్తులకు ప్రయోజనాలు అందుతాయి.

 

  

 

ఈ సందర్భంగా అధికారులు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రతిజ్ఞ చేయించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్‌పేట, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఐఈసీ ప్రచార వాహనాన్ని తరలించనున్నారు.

 

IEC (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్) వ్యాన్‌లు, దేశం వృద్ధి ఇంకా శ్రేయస్సు కోసం భాగస్వామ్య నిబద్ధతతో, మరింత సమగ్రమైన, అభివృద్ధి చెందిన భారతదేశ దిశగ ప్రముఖ కేంద్ర పథకాలను అభివృద్ధి పదాన ా ఒక ముఖ్యమైన అడుగుగా ప్రచారం చేస్తాయి.

 

 

  

హిందీ భాషతో పాటు  అన్ని రాష్ట్రాల అధికారిక  భాషలలో ఆడియో విజువల్స్,   కరపత్రాలు, సమాచార పుస్తకాలు ఇంకా ఫ్లాగ్‌షిప్ స్టాండీల ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి IEC వ్యాన్‌లు రూపొందించారు.

 

పథకాల లబ్ధిదారుల అనుభవాన్ని పంచుకోవడం, ప్రగతిశీల రైతులతో పరస్పర చర్య, ఆయుష్మాన్ కార్డ్, జల్ జీవన్ మిషన్, జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఓడిఎఫ్ ప్లస్ హోదా వంటి పథకాలలో 100% సంతృప్తిని సాధించిన గ్రామ పంచాయతీల విజయాల వేడుకలు వంటి ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు. , అక్కడికక్కడే క్విజ్ పోటీలు, డ్రోన్ ప్రదర్శన, ఆరోగ్య శిబిరాలు, మేరా యువ భారత్ వాలంటీర్ నమోదు మొదలైనవి క్షేత్ర కార్యక్రమాల భాగంగా ఉంటాయి.

 

దేశవ్యాప్త ప్రచారం, హమారా సంకల్ప్ వికసిత్ భారత్, బృహత్ ప్రజా సంపర్క కార్యక్రమాల్లో  ఒకటి, కేంద్రీకృత కార్యక్రమాలతో ప్రజలను చేరుకోవడం, వారికి  అవగాహన కల్పించడం, ఇంకా పారిశుద్ధ్య సౌకర్యాలు, అవసరమైన ఆర్థిక సేవలు, విద్యుత్ కనెక్షన్ల అందుబాటు వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడం ద్వారా 2 నెలల పాటు ఈ ప్రచారం  కొనసాగుతుంది. వంటగ్యాస్  సిలిండర్లు, పేదలకు గృహాలు, ఆహార భద్రత, సరైన పోషకాహారం, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన తాగునీరు మొదలైనవి ఇతర ప్రచార అంశాలు.

 

ఇది చివరికి 25 జనవరి 2024 నాటికి దేశంలోని ప్రతి జిల్లాను చుట్టి రావడం ద్వారా 2.55 లక్షల గ్రామ పంచాయతీలు ఇంకా 3,600 కంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థలను ప్రభావితం చేయడం    లక్ష్యంగా పెట్టుకుంది.

 

మొత్తం ప్రచారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా ఇంకా స్థానిక అధికారుల చొరవతో, తత్సంబంధ  బాధ్యతలతో మొత్తం ప్రభుత్వ  ప్రతిష్టాత్మక విధానంగా  అమలు అవుతుంది.

 

<><><><>


(रिलीज़ आईडी: 1977228) आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी