సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక న్యాయం మరియు సాధికారత విభాగం అక్టోబర్ 2, 2023 నుండి అక్టోబర్ 31, 2023 వరకు ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0 నిర్వహించింది


కార్యక్రమ వ్యవధిలో 817 ప్రజా ఫిర్యాదులు మరియు 50 ఎంపీ సూచనలు పరిష్కరించబడ్డాయి. 2500 ఫైల్‌లు సమీక్షించబడ్డాయి మరియు 2445 ఫైల్‌లు తొలగించబడ్డాయి

స్క్రాప్ డిస్పోజల్ ద్వారా రూ. 1,12,000 ఆదాయం మరియు స్క్రాప్ చేయదగిన వస్తువులను తొలగించడం ద్వారా 1800 చదరపు అడుగుల స్థలం లభించింది

నాడు పోస్టు చేయడమైనది: 08 NOV 2023 5:38PM by PIB Hyderabad

పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డిఏఆర్‌పిజి) నుండి అందిన సూచనల మేరకు సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అక్టోబర్ 2,  2023  నుండి అక్టోబర్ 31, 2023 వరకు ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0 నిర్వహించబడింది.

సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ తన దాఖలు చేసిన యూనిట్లలో పెండింగ్‌లో ఉన్న అంశాలను (ఎస్‌సిడిపిఎం) పరిష్కరించడం కోసం  ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0ని రెండు దశల్లో చేపట్టింది  సన్నాహక దశ 15.09.2023 నుండి 30.09.2023 వరకు నిర్వహించగా 02.10.2023 నుండి 2020.2020 వరకు ఫోకస్ చేసే దశను అమలు చేయడం జరిగింది. అందులో ఈ కింది అంశాలు ఉన్నాయి: -

 

  • పెండెన్సీని తగ్గించడం:సిపిజిఆర్‌ఏఎంల పబ్లిక్ గ్రీవెన్స్ డిస్పోజల్, ఐఎంసి:ఈఎఫ్‌సి/ఎస్‌ఎఫ్‌సి/క్యాబినెట్ నోట్, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, పార్లమెంట్ హామీలు మొదలైనవి;
  • డిజిటలైజేషన్: 100% ఇ-ఆఫీస్ అమలు, 100% భౌతిక ఫైల్‌లు మరియు రశీదుల డిజిటలైజేషన్ (భౌతిక ఫైల్‌లను ఇ-ఆఫీస్‌లోకి మార్చడం);
  • ఆఫీస్ స్పేస్ యొక్క సమర్ధవంతమైన నిర్వహణ: ఉపయోగించని ఫైల్‌లు/పాత పేపర్లు/ఫైల్ కవర్లు/ఫైల్ బోర్డులు/కంప్యూటర్లు/ప్రింటర్/ఫర్నిచర్ వంటి సేవలందించని వస్తువులను స్క్రాప్ చేయడం;
  • పర్యావరణ అనుకూల పద్ధతులు: 100% గో గ్రీన్ (పేపర్‌లెస్ వర్కింగ్ + "ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను ఉపయోగించకపోవడం + పేపర్‌లెస్ పని మొదలైనవి), చెత్త ద్వారా నగదు పొందడం మొదలైనవి;
  • పరిశుభ్రత డ్రైవ్: కార్యక్రమ సమయంలో ప్రతి అధికారి/అధికారి ద్వారా వారంలో 03 గంటలు;
  • సామాజిక న్యాయం మరియు సాధికారత విభాగంలో స్వచ్ఛతను సంస్థాగతీకరించడం.


న్యూఢిల్లీలో గల శాస్త్రి భవన్‌లోని సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖలోని అన్ని విభాగాలతో పాటు, న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (డిఏఐసి), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (ఎన్‌ఐఎస్‌డి), అంబేద్కర్ ఫౌండేషన్ (డిఏఎఫ్), న్యూఢిల్లీ, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌డిసి), ఢిల్లీ, నేషనల్ సఫాయి కరంచరీస్ ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్‌కేఎఫ్‌డిసి), న్యూఢిల్లీ, నేషనల్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్, న్యూఢిల్లీ, ఎన్‌సిఎస్‌సి, లోక్ నాయక్ భవన్, న్యూ ఢిల్లీ, ఎన్‌సిబిసి, భికాజీ కామా ప్లేస్, న్యూఢిల్లీ మరియు ఎన్‌సిఎస్‌కే, లోక్ నాయక్ భవన్, న్యూఢిల్లీలో ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0 నిర్వహించబడింది.

కార్యక్రమం యొక్క ప్రధాన ఫలితాలు క్రిందివి: -

 

  • 817 ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి.
  • 50 ఎంపీ సూచనలు పరిష్కరించబడ్డాయి.
  • 2500 ఫైళ్లను పరిశీలించగా, 2445 ఫైళ్లను తొలగించారు.
  • ఫర్నీచర్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు కంప్యూటర్ స్క్రాప్ చేయబడి రూ. 1,12,000/- ఆదాయం లభించింది.
  • 1800 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయగలిగే వస్తువులను తొలగించడం మరియు కార్యాలయాల్లో పునరుద్ధరణ పనులు చేయడం ద్వారా ఖాళీ చేయబడింది.
  • 100% గో గ్రీన్ (పేపర్‌లెస్ వర్కింగ్ +నో ఫర్‌ వన్-టైమ్ ప్లాస్టిక్ యూజ్), రెగ్యులర్ క్లీనెస్ యాక్టివిటీస్ మరియు 100% ఇ-ఆఫీస్ అమలు వంటి పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరించి డిపార్ట్‌మెంట్‌లోని పద్ధతులను సంస్థాగతీకరించడానికి దృష్టి సారించారు.

ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0లో అధికారులందరూ పాల్గొన్నారు. ఈ విషయంలో సాధించిన పురోగతిని అభినందించడానికి ఈవెంట్‌కు ముందు మరియు పోస్ట్ ఫోటోగ్రాఫ్‌లు తీయబడ్డాయి మరియు ప్రత్యేక డిఏఆర్‌పిజి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి. అన్ని కార్యకలాపాలు ట్విట్టర్‌ (ఎక్స్‌)తో సహా సోషల్ మీడియా కవరేజ్ ద్వారా భాగస్వామ్యం చేయబడ్డాయి. “ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0:లో మొత్తం పోస్ట్‌ల సంఖ్య 42;
 

***


(రిలీజ్ ఐడి: 1975803) సందర్శకుల సూచీ సంఖ్య : : 96
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi