ప్రధాన మంత్రి కార్యాలయం
వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
28 OCT 2023 10:27AM by PIB Hyderabad
వాల్మీకి జయంతి పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సమానత్వం, సద్భావనపై మహర్షి వాల్మీకి ప్రబోధాలు నేటికీ మనను నడిపిస్తున్నాయని ప్రధాని అన్నారు. ఆయన తన సందేశాల ద్వారా మన నాగరికత, సంస్కృతిలో తరతరాలుగా చిరస్మరణీయుడుగా నిలిచారని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“వాల్మీకి జయంతి పవిత్ర సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు. సాంఘిక సమానత్వం, సద్భావనపై ఆయన అమూల్య ప్రబోధాలు నేటికీ భారతీయ సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తున్నాయి. మానవాళికి ఇచ్చిన సందేశాల ద్వారా మన నాగరికత, సంస్కృతిలో అమూల్య వారసత్వంగా ఆయన తరతరాలుగా నిలిచిపోతారు” అని ప్రధాని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1972646)
आगंतुक पटल : 153
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam