వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతీయ మామిడిపండ్ల ఎగుమతి పాదముద్రలను విదేశాలకు విస్తరించింది


భారతదేశం 2023-24 ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) 47.98 మిలియన్ల యూ ఎస్ డాలర్ల విలువైన మామిడిని ఎగుమతి చేసింది.

2023-24లో అమెరికాకు మామిడి ఎగుమతిలో భారతదేశం గత ఏడాది కంటే 19% వృద్ధిని నమోదు చేసింది.

Posted On: 27 OCT 2023 2:26PM by PIB Hyderabad

వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ( అపెడా), వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క నిరంతర ప్రయత్నాలతో భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) మొదటి ఐదు నెలల్లో మామిడి ఎగుమతిలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 47.98 మిలియన్ల యూ ఎస్ డాలర్ల విలువైన మామిడిని ఎగుమతి చేసింది, ఇది మునుపటి సంవత్సరాల 40.33 మిలియన్ల యూ ఎస్ డాలర్ల ఎగుమతి కంటే 19 శాతం ఎక్కువ.

 

వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు అపెడా సహకారంతో, భారతదేశం 2022-23లో 48.53 మిలియన్ల యూ ఎస్ డాలర్లు విలువైన 22,963.78 ఎం టీ మామిడిని ఎగుమతి చేసింది. ప్రస్తుత సంవత్సరం 2023-24 (ఏప్రిల్-ఆగస్టు)లో భారతదేశం 27,330 ఎం టీ 47.98 మిలియన్లు యూ ఎస్ డాలర్లు విలువ గల మామిడిని ఎగుమతి చేసింది. 2023 సీజన్‌లో మామిడిపండ్ల ఎగుమతిని ప్రోత్సహించే చొరవలో భాగంగా, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు అపెడా, అమెరికా వ్యవసాయ శాఖ యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ ఇన్‌స్పెక్టర్‌ మామిడి పండ్ల ముందస్తు అనుమతి కోసం వాషి, నాసిక్, బెంగళూరు మరియు అహ్మదాబాద్‌లలో రేడియేషన్ సౌకర్యాలకు ఆహ్వానించింది. 

 

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 19 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా అమెరికా కి భారతీయ మామిడి పండ్ల ఎగుమతిలో భారతదేశం గొప్ప విజయాన్ని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారతదేశం 2043.60 ఎం టీ భారతీయ మామిడిని అమెరికా కి ఎగుమతి చేసింది.

 

 సంబంధిత అధికారుల నిరంతర ప్రయత్నాలతో, భారతదేశం అమెరికా తో పాటు జపాన్‌కు 43.08 ఎం టీ, న్యూజిలాండ్‌కు 110.99 ఎం టీ, ఆస్ట్రేలియాకు 58.42ఎం టీ మరియుకొత్త గమ్యస్థానమైన దక్షిణాఫ్రికాకు 4.44 ఎం టీ మామిడిపండ్లను ఎగుమతి చేసింది.

 

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు అపెడా సంయుక్తంగా దక్షిణ కొరియా నుండి మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ముందస్తు అనుమతి కోసం ఇన్స్పెక్టర్లను ఆహ్వానించాయి. ఇది డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ అండ్ స్టోరేజ్ , ఇండియా అండ్ యానిమల్ అండ్ ప్లాంట్ క్వారంటైన్ ఏజెన్సీసంయుక్త పర్యవేక్షణలో అధీకృత ఆవిరి వేడి చికిత్స సదుపాయంలో చికిత్స పొందిన తర్వాత దక్షిణ కొరియా 18.43 ఎం టీ మామిడిని ఎగుమతి చేయడానికి భారతదేశం కు అనుమతించింది. 

 

2022-23లో మామిడి పండ్ల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2023 సీజన్‌లో, భారతదేశం ఇరాన్, మారిషస్, చెక్ రిపబ్లిక్ మరియు నైజీరియా వంటి కొత్త గమ్యస్థానాలను అన్వేషించడం ద్వారా 41 దేశాలకు మామిడిని ఎగుమతి చేసింది.

 

అపెడా తన ఎగుమతిని ప్రోత్సహించడానికి భారతీయ మామిడి పండ్లను ప్రదర్శించడానికి సియోల్ ఫుడ్ అండ్ హోటల్ షోలో కూడా పాల్గొంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల జ్ఞాపకార్థం (ఆజాది కా అమృత్ మహోత్సవ్), అపెడా బహ్రెయిన్‌కు 75 తూర్పు రకాల మామిడిని ఎగుమతి చేయడానికి వీలు కల్పించింది. ఈ సరుకులో భారతదేశంలోని తూర్పు ప్రాంతం నుండి 5 జీ ఐ - ట్యాగ్ చేయబడిన రకాలు ఉన్నాయి.

 

అదనంగా, అపెడా భారతీయ మామిడి పండ్ల ఎగుమతిని ప్రోత్సహించడానికి మరియు పెంచడానికి సంబంధిత దేశాల మిషన్స్ ఆఫ్ ఇండియాతో క్రియాశీల సహకారంతో మామిడి ప్రచార  ఉత్సవం నిర్వహించింది.

 

అపెడా భారత రాయబార కార్యాలయం, బ్రస్సెల్స్‌తో కలిసి భారతీయ మామిడి పండ్ల ఎగుమతి కోసం మామిడి రుచి కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రదర్శనలో అమ్రపల్లి, బనగానపల్లి, కేసర్, హింసాగర్ వంటి నాలుగు రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. పాల్గొనేవారికి మామిడి లస్సీ మరియు మామిడి పాయసంతో సహా అన్ని రకాల మామిడి పండ్లను అందించారు.

 

ఇంకా, వివిధ అంతర్జాతీయ మార్కెట్‌లకు భారతీయ మామిడి పండ్ల ఎగుమతిని ప్రోత్సహించడానికి అపెడా 2023లో అనేక కార్యక్రమాలు చేపట్టింది. అపెడా ద్వారా మలేషియాలో మామిడి ఎగుమతి అభివృద్ధి ప్రోగ్రామ్‌ను భారత హైకమిషన్, కౌలాలంపూర్ సహకారంతో నిర్వహించింది, ఇందులో కేసర్ మరియు బనగానపల్లి రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు.

 

అలాగే, అపెడా ఆఫ్ఘనిస్తాన్‌లోని మామిడి ప్రచార కార్యక్రమం కోసం కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి మామిడి పండ్ల ఎగుమతి ని సులభతరం చేసింది. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయాల సహకారంతో అపెడా ద్వారా కువైట్‌లో కూడా ఇదే విధమైన ప్రదర్శన నిర్వహించబడింది.

 

***



(Release ID: 1972277) Visitor Counter : 66


Read this release in: English , Urdu , Marathi , Hindi