ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ ‘క్లబ్ త్రో-ఎఫ్51’లో స్వర్ణం సాధించిన ప్రణవ్ సూర్మాకు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
23 OCT 2023 5:26PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో భాగంగా ‘క్లబ్ త్రో- ఎఫ్51’లో స్వర్ణ పతక విజేత భారత క్రీడాకారుడు ప్రణవ్ సూర్మాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ ‘క్లబ్ త్రో’ (ఎఫ్51)లో స్వర్ణ పతకం సాధించిన ప్రణవ్ సూర్మాకు నా హృదయపూర్వక అభినందనలు. అతని పట్టుదల, మొక్కవోని సంకల్పంతో సాధించిన ఈ విజయం దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా చేసింది. అతడు మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1970866)
आगंतुक पटल : 98
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam