రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ ఉత్పత్తుల విభాగంలో పూర్తి ఉత్సాహంగా స్వచ్ఛత ప్రచారం 3.0 పరిశుభ్రమైన భవిష్యత్ కోసం పని ప్రాంతాల్లో మార్పులు
Posted On:
17 OCT 2023 2:26PM by PIB Hyderabad
పరిశుభ్రత అనేది రోజువారీ జీవితంలో భాగం, అది ఇప్పుడు కార్యాలయాలకు కూడా విస్తరించింది. స్వచ్ఛత ప్రచారం 3.0 దేశవ్యాప్తంగా పరిశుభ్రతను పెంచే కీలక ప్రయత్నంగా మారింది. రక్షణ ఉత్పత్తుల విభాగానికి (డీడీపీ) చెందిన అన్ని డీపీఎస్యూలు, సంస్థలు పూర్తి ఉత్సాహంతో ఇందులో పాల్గొంటున్నాయి.






ఈ కార్యక్రమంలోని ప్రధాన ప్రచారం అక్టోబర్ 2న ప్రారంభమైంది, అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. ఈ ప్రచార సమయంలో, కార్యాలయాల్లోని పని ప్రాంతాలను మెరుగ్గా మార్చడం, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టారు.
స్వచ్ఛత ప్రచారం 3.0లో రెండో వారం ముగిసింది. ఈ కాలంలో రక్షణ ఉత్పత్తుల విభాగం ఈ కింది విజయాలు సాధించింది:
-
18,000 దస్త్రాలు/రికార్డులను సమీక్షించారు, కాలం తీరిన దస్త్రాలను తొలగించారు
-
తుక్కు/ఉపయోగించని వస్తువులను తీసేయడం ద్వారా 7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేశారు
-
1300 మెట్రిక్ టన్నుల తుక్కు/ఉపయోగించని వస్తువులు అమ్మారు/తొలగించారు
-
తుక్కును అమ్మి 19 కోట్లు రూపాయల ఆదాయం ఆర్జించారు
-
63 ప్రజా ఫిర్యాదులు పరిష్కరించారు
-
డీడీపీ కార్యాలయాలు, డీపీఎస్యూల భాగస్వామ్యంతో సైబర్ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు
రోజువారీ పురోగతిని సంయుక్త కార్యదర్శి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ప్రచార సమయంలో వివిధ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహించడం, ప్రజలు కూడా భాగస్వాములయ్యేలా ప్రేరేపించడం కోసం ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించారు. సామాజిక మాధ్యమాలు, బ్యానర్లు, పోస్టర్లు, చిత్రకళ పోటీలు మొదలైన వాటి ద్వారా ప్రచారం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డీపీఎస్యూలు & డీడీపీ కలిసి, #SpecialCampaign 3.0 ట్యాగ్ ద్వారా ఎక్స్లో 330కి పైగా ట్వీట్లు పోస్ట్ చేశాయి.
డీడీపీ సహా అన్ని డీపీఎస్యూలు/అనుబంధ కార్యాలయాలు, ఉద్యోగులు ప్రచారంలో పూర్తి ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
****
(Release ID: 1968612)