బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మ‌హాత్మా గాంధీకి ఘ‌నంగా నివాళులు అర్పించి, స్వ‌చ్ఛ‌తా డ్రైవ్‌ను నిర్వ‌హించిన బొగ్గు మంత్రిత్వ శాఖ


పారిశుద్ధ్య కార్య‌క‌లాపాల‌లో పాలు పంచుకున్న బొగ్గు కార్య‌ద‌ర్శి అమృత్ లాల్ మీనా & ఇత‌ర సీనియ‌ర్ అధికారులు

Posted On: 01 OCT 2023 3:14PM by PIB Hyderabad

స్వ‌చ్ఛ‌తా హీ సేవ ప్ర‌చారం కింద బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదివారం మ‌హాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తూ, పారిశుద్ధ్యం, అందులో ప్ర‌జ‌ల సామూహిక భాగ‌స్వామ్యాన్ని ఉద్ఘాటిస్తూ పారిశుద్ధ్య డ్రైవ్‌ను నిర్వ‌హించింది. 
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ అమృత్ లాల్ మీనా, సంయుక్త కా్య‌ద‌ర్శి శ్రీ సంజీవ్ కుమార్ క‌స్సీ, డిడిజి శ్రీ బిపి ప‌తి, శ్రీ‌మ‌తి సంతోష్‌, డిప్యూటీ కార్య‌ద‌ర్శులు, డైరెక్ట‌ర్లు, ఇత‌ర సీనియ‌ర్ అధికారులు, 100కు పైగా ఔత్సాహిక వాలంటీర్లు క‌లిసి గంట‌కు పైగా మెగా పారిశుద్ధ్య డ్రైవ్‌లో శ్ర‌మ‌దానం చేశారు. 

 


బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి వ‌చ్చిన బృందం పారిశుద్ధ్య పిలుపును అందిపుచ్చుకుని, శాస్త్రి భ‌వ‌న్‌ను, దాని ప‌రిస‌రాల‌ను శుభ్రం చేసే ప‌నిని చేప‌ట్టింది.  ప్ర‌గ‌తిశీల స‌మాజంలో పారిశుద్ధ్యం అన్న‌ది అంత‌ర్భాగ‌మ‌ని విశ్వ‌సించిన మ‌హాత్మాగాంధీ ఆద‌ర్శాల‌ను నిల‌బెట్టాల‌న్న మంత్రిత్వ శాఖ నిబద్ధ‌త‌కు ఈ కృషి ఒక నిద‌ర్శ‌నం. వారి భాగ‌స్వామ్యం ప‌రిశుభ్ర‌మైన‌, మ‌రింత స్థిర‌మైన ప‌ర్యావ‌ర‌ణం కోసం ప‌ని చేయ‌డంలో ఐక్య‌త‌, సామూహిక బాధ్య‌త స్ఫూర్తిని పున‌రుద్ఘాటించ‌డ‌మే కాక మ‌హౄత్మా గాంధీ జీవితాంతం ప్ర‌చారం చేసిన ప‌రిశుభ్ర‌త‌, స‌మాజ సేవ సూత్రాల ప‌ట్ల అంకిత‌భావాన్ని సూచిస్తుంది. 

 


పారిశుద్ద్యం అనేది కేవ‌లం ఒక్క‌సారి చేసి ఊరుకునేది కాద‌ని, ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించి, మ‌న సమాజాల శ్రేయ‌స్సు కోసం నిరంత‌రం క‌ట్టుబ‌డి ఉండ‌ట‌మ‌ని ఈ కార్య‌క్ర‌మం పున‌రుద్ఘాటించింది. నేటి చ‌ర్య‌లు, ఆరోగ్య‌క‌ర‌మైన‌, ప‌రిశుభ్ర‌మైన భార‌త దిశ‌గా ఇటువంటి అడుగులే వేసేందుకు స్ఫూర్తినిస్తాయ‌ని బొగ్గు మంత్రిత్వ శాఖ విశ్వ‌సిస్తోంది. 

 

***
 


(Release ID: 1963314)
Read this release in: English , Urdu , Hindi