ఆర్థిక మంత్రిత్వ శాఖ

11 అక్టోబర్ 2023న జెనీవాలో జరగనున్న టిఐఆర్‌ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ (టిఐఆర్‌ఈఎక్స్‌బి) కోసం భారతదేశ అభ్యర్థిత్వానికి మద్దతునిస్తున్న సిబిఐసి

Posted On: 30 SEP 2023 4:10PM by PIB Hyderabad

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్‌ ట్యాక్స్‌స్‌ అండ్‌ కస్టమ్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి టిఐఆర్ కార్నెట్స్ (టిఐఆర్ కన్వెన్షన్, 1975) కవర్ కింద అంతర్జాతీయ వస్తువుల రవాణాపై టిఐఆర్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ (టిఐఆర్‌ఈఎక్స్‌బి)లో భారతదేశ అభ్యర్థిత్వానికి మద్దతును ప్రచారం చేయడానికి కన్వెన్షన్‌కు కాంట్రాక్ట్ పార్టీల నుండి అంబాసిడర్లు మరియు ప్రతినిధుల కోసం నిన్న న్యూఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీని కోసం ఎన్నికలు 11.10.2023న జెనీవాలోని పలైస్ డెస్ నేషన్స్‌లో టిఐఆర్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యొక్క 81వ సెషన్‌లో జరగాల్సి ఉంది.

 

image.png


రాబోయే టిఐఆర్‌ఈఎక్స్‌బి ఎన్నికల్లో భారత అభ్యర్థి సిబిఐసి ప్రిన్సిపల్ కమీషనర్ & హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ రిలేషన్స్ శ్రీ.విమల్ కుమార్ శ్రీవాస్తవ విదేశీ ప్రతినిధులకు పరిచయం చేయబడ్డారు. కన్వెన్షన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రవాణా నెట్‌వర్క్‌లతో అనుసంధానం కావడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని మరియు ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక వృద్ధి మరియు భౌగోళిక రాజకీయ స్థిరత్వంలో సరిహద్దు కనెక్టివిటీకి కీలక పాత్ర ఉందని గుర్తించడం జరిగింది. టిఐఆర్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌లో భారతదేశ నిపుణుడిని ఎన్నుకోవడం ద్వారా సంబంధిత విధానాలు మరియు పద్ధతులను అమలు చేయడానికి తద్వారా బహుళ-మోడల్ రవాణా వ్యవస్థ యొక్క ప్రపంచ ఏకీకరణకు, ముఖ్యంగా టిఐఆర్ పూర్తి డిజిటలైజేషన్‌కు భారతదేశం గణనీయంగా దోహదపడాలని భావిస్తోంది. కన్వెన్షన్ యొక్క భౌగోళిక కవరేజీని విస్తరించాలని మరియు దక్షిణాసియా ప్రాంతంలో రవాణా ఏర్పాట్లను పునర్నిర్వచించడం కోసం దీనిని ఉపయోగించాలని భారతదేశం భావిస్తున్నట్లు కూడా హైలైట్ చేయబడింది.

 

image.png


రెవెన్యూ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది; ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) శ్రీ సంజయ్ వర్మ; ప్రత్యేక కార్యదర్శి మరియు సిబిఐసి చైర్మన్, శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్; మరియు స్పెషల్ సెక్రటరీ మరియు మెంబర్ కస్టమ్స్, సిబిఐసి శ్రీ సూర్జిత్ భుజబల్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

జెనీవాలో 11.10.2023న జరగనున్న టిఐఆర్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఎన్నికలకు భారతదేశ అభ్యర్థిత్వానికి అనేక మంది ప్రముఖులు తమ మద్దతును తెలియజేయడంతో రిసెప్షన్ విజయవంతంగా ముగిసింది.

టిఐఆర్ కన్వెన్షన్ గురించి:

టిఐఆర్ కన్వెన్షన్, 1975 అనేది కస్టమ్స్ నియంత్రణకు సంబంధించిన అంతర్జాతీయ  వ్యవస్థ. ఇది ఒకే కస్టమ్స్ డాక్యుమెంట్ (టిఐఆర్ కార్నెట్) మరియు ఏకీకృత హామీ వ్యవస్థను ఉపయోగించి బహుళ అంతర్జాతీయ సరిహద్దులను దాటే వస్తువులకు అవాంతరాలు లేని రవాణాకు సహకరిస్తుంది. ఇది భారత్‌తో సహా 78 కాంట్రాక్టింగ్ పార్టీలను కలిగి ఉంది. 33,000 కంటే ఎక్కువ మంది ఆపరేటర్లు టిఐఆర్ వ్యవస్థను ఉపయోగించడానికి అధికారం కలిగి ఉన్నారు మరియు సంవత్సరానికి 1.5 మిలియన్ల టిఐఆర్ రవాణాలు నిర్వహించబడుతున్నాయి. టిఐఆర్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ (టిఐఆర్‌ఈఎక్స్‌బి) అనేది టిఐఆర్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి అనుబంధ సంస్థ. ఇది టిఐఆర్ ప్రక్రియ యొక్క అప్లికేషన్‌ను పర్యవేక్షిస్తుంది మరియు మద్దతును అందిస్తుంది. ఇది 9 మంది సభ్యులతో కూడి ఉంటుంది. ఒక్కొక్కరు వేర్వేరు కాంట్రాక్టింగ్ పార్టీలకు చెందినవారు ఇందులో ఉంటారు.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం ఒక ముఖ్యమైన వాణిజ్య దేశం మరియు అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్‌ఎస్‌టిసి)లో కీలక భాగస్వామి. 2017లో కన్వెన్షన్‌లోకి ప్రవేశించినప్పటి నుండి టిఐఆర్‌ వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం అనేక చర్యలు తీసుకుంది. నేషనల్ గ్యారెంటీయింగ్ అసోసియేషన్ నియమించింది మరియు దేశంలోని ఓడరేవులు మరియు ఇతర కస్టమ్స్ స్టేషన్‌ల విధానాన్ని మరియు అధికారాన్ని తెలియజేస్తూ 48/2018-కస్ సర్క్యులర్ జారీ చేయబడింది. డిజిటల్ టిఐఆర్‌తో సహా భారతదేశం పైలట్ రన్స్‌ కూడా నిర్వహించింది. వాటాదారుల సంప్రదింపుల ద్వారా టిఐఆర్‌ యొక్క సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి చర్యలు ప్రారంభించబడ్డాయి.

 

****



(Release ID: 1962608) Visitor Counter : 82


Read this release in: Tamil , English , Urdu , Hindi