శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

జమ్మూ కాశ్మీర్ మొట్టమొదటి అత్యాధునిక టాటా మెమోరియల్ సెంటర్ ముంబై అనుబంధ క్యాన్సర్ కేర్ సదుపాయాన్ని జిఎంసి కథువాలో ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్: తక్కువ ఖర్చుతో , అందరికీ ఆరోగ్య సంరక్షణ అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని 'ఆరోగ్యకరమైన భారతదేశం' కోసం రోడ్ మ్యాప్


'కథువా-ఉధంపూర్-దోడా' పార్లమెంటరీ నియోజకవర్గం 3 మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్, బయోటెక్ పార్క్ వంటి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో భారతదేశ భవిష్యత్ 'హెల్త్ సర్క్యూట్'గా మారుతుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

టాటా మెమోరియల్ ఆసుపత్రికి అనుబంధంగా జిఎంసి కథువాలో డేకేర్ కీమోథెరపీ యూనిట్ ను ఏర్పాటు చేయడంతో, క్యాన్సర్ చికిత్స తక్కువ ఖర్చు తో అందుబాటులోకి రానుంది; ఈ ప్రాంతంలో తక్కువ ఖర్చు తో క్యాన్సర్ చికిత్స కోసం ఉన్న లోటు ఈ రోజు తీరింది: డాక్టర్ జితేంద్ర సింగ్ .

విపత్తు నిర్వహణ, ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భారత్ రోల్ మోడల్: డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశం ఆరోగ్య సేవల సెక్టోరల్ , సెగ్మెంటెడ్ పంపిణీ విధానం నుండి సమగ్ర అవసరాల ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవకు మారింది: డాక్టర్ జితేంద్ర సింగ్

జిఎంసి కథువాలో టాటా మెమోరియల్ హాస్పిటల్ , మెటర్నల్ ఐసియుకు అనుబంధంగా 300 ఎల్ పిఎమ్ సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్, డే కేర్ కీమోథెరపీ యూనిట్ ను ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 24 SEP 2023 4:42PM by PIB Hyderabad

కథువా ప్రభుత్వ వైద్య కళాశాల కొత్త బ్లాక్ లో జమ్మూ కాశ్మీర్  మొట్టమొదటి అత్యాధునిక టాటా మెమోరియల్ సెంటర్ (టిఎంసి) ముంబైని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) , పి  ఎం ఒ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రారంభించారు. జమ్ముకశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

క్యాన్సర్ రోగిని ముంబైలోని టాటా ఆసుపత్రిలో చేర్పించాలని లేదా సహాయకులకు వసతి ఏర్పాటు చేయాలని కోరుతూ నిరాశ చెందిన కుటుంబ సభ్యుల నుండి ప్రతిరోజూ ఉదయం ఈ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి కాల్స్ రావడం తనకు బాధ కలిగించిందని మంత్రి అన్నారు. అందుకే కథువాలో టాటా అనుబంధ విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని, తద్వారా టాటా మెమోరియల్ సెంటర్ ముంబై నియంత్రణ అథారిటీ అయిన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో పత్రాలను తరలించినట్టు తెలిపారు. 

పెరుగుతున్న ఆయుర్దాయం, మారుతున్న జీవనశైలి, పర్యావరణ కారకాలు మొదలైన వాటితో క్యాన్సర్ వ్యాప్తి అంటువ్యాధి నిష్పత్తిలో ఉందని, అన్ని రకాల , అన్ని అవయవాల క్యాన్సర్లు ప్రతిచోటా సంభవిస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కథువాలో టాటా శాటిలైట్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి గొప్ప వరం అని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో శాటిలైట్ ఆస్పత్రులు, టాటా మెమోరియల్ సెంటర్ సదుపాయం ప్రారంభించామని, గౌహతిలో కూడా ఆన్కో డీఎం, ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత కథువాకు కూడా అవకాశం కల్పించవచ్చని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో శాటిలైట్ ఆస్పత్రులు, టాటా మెమోరియల్ సెంటర్ సదుపాయం ప్రారంభించామని, గౌహతిలో కూడా ఆన్కో డీఎం, ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత కథువాకు కూడా అవకాశం కల్పించవచ్చని తెలిపారు.

కథువా-ఉధంపూర్-దోడా పార్లమెంటరీ నియోజకవర్గం 3 మెడికల్ కాలేజీలు, నార్త్ ఇండియాలో మొదటి బయోటెక్ పార్క్ వంటి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో భారతదేశ భవిష్యత్తు 'హెల్త్ సర్క్యూట్'గా మారనుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ రోజు జిఎంసి కథువాలో డే-కేర్ కెమోథెరపీ (ఆన్కో-కేర్) యూనిట్ ను ప్రారంభించడంతో  ఈ ప్రాంతంలో ఇంతవరకు లోటు గా  ఉన్న తక్కువ ఖర్చు క్యాన్సర్ చికిత్స  ఇక అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. 

జీఎంసీ కథువాలో డే కేర్ కీమోథెరపీ యూనిట్, 300 ఎల్ పి ఎం ఆక్సిజన్ ప్లాంట్, మెటర్నల్ ఐసీయూ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ భారీ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

రాబోయే సంవత్సరాల్లో జిఎంసి కథువాలో ఆంకో-కేర్ ను అప్ గ్రేడ్ చేస్తామని, ఆంకో  డిఎం, ఎంసిహెచ్ సీట్లు ఇస్తామని, చికిత్స, ఉపన్యాసాలు సెమినార్ల కోసం ప్రపంచ స్థాయి క్యాన్సర్ నిపుణులను ఇక్కడకు ఆహ్వానిస్తామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

వివిధ రకాల క్యాన్సర్ల చికిత్స గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారతదేశంలో బయోటెక్నాలజీ రంగం 2025 నాటికి 150 బిలియన్ డాలర్ల బయో ఎకానమీని సాధించనుందని, ఇది 2022 లో 100 బిలియన్ డాలర్లకు పైగా ఉందని, 'సెర్వావాక్' వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారతదేశం ముందంజలో ఉందని అన్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో చౌకైన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ 'ఆరోగ్యకరమైన భారతదేశం' కోసం రోడ్ మ్యాప్ అని, దేశంలో 260 కి పైగా కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు అయ్యాయని, ఎంబిబిఎస్ సీట్లు 79% పెరిగాయని, 9 సంవత్సరాలలో 93% పిజి సీట్లుపెరిగాయని, , 22 ఎయిమ్స్ ఆమోదం పొందాయని వివరించారు. 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారతదేశం డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారతదేశం సెక్టోరల్ ,  సెగ్మెంటెడ్ ఆరోగ్య సేవల పంపిణీ విధానం నుండి సమగ్ర అవసరాల ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవకు మారిందని, సంక్షోభ నిర్వహణ, ముందస్తు ఆరోగ్య సంరక్షణలో ఇప్పుడు రోల్ మోడల్ గా కనిపిస్తోందని అన్నారు.

దేశంలో తొలిసారిగా 'ప్రివెంటివ్ హెల్త్ కేర్'ను వెలుగులోకి తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి డాక్టర్ జితేంద్ర సింగ్ కృతజ్ఞతలు తెలిపారు, అందువల్లే కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో, భారతదేశం రెండు డిఎన్ఎ వ్యాక్సిన్లు , ఒక నాసికా వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయగలిగిందని అన్నారు. 

జిఎంసి కథువాలో డే-కేర్ కెమోథెరపీ ఆన్కో-కేర్ యూనిట్ ఏర్పాటు ఈ ప్రాంతంలో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చు లో అందుబాటులో ఉంచుతుందని జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య ,వైద్య విద్య కార్యదర్శి శ్రీ భూపిందర్ కుమార్ తన ప్రసంగంలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో కథువా డీడీసీ వైస్ చైర్మన్ రఘునందన్ సింగ్ బబ్లూ, కథువా డీసీ రాకేశ్ మిన్హాస్, పె టి ఎం ఫౌండేషన్ కు చెందిన కె కె  పరాశర్, మహా మానవ్ మాలవీయ మిషన్ కు చెందిన నీరజ్ గౌడ్,  జె అండ్ కె బ్యాంక్ జి ఎం సునీల్ కుమార్ గుప్తా, నాబార్డ్ సి జి ఎం బాల మోదీ శ్రీధర్, ప్రిన్సిపల్ జీఎంసీ కథువా, మెడికల్ సూపరింటెండెంట్ జీఎంసీ కథువా పాల్గొన్నారు.

<><><><>



(Release ID: 1960430) Visitor Counter : 119