ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఢిల్లీ యూనివర్సిటీలో డిజిటల్ ఇండియా టాక్ షో కమ్ ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహణ


ఉమాంగ్,డిజిలాకర్,ఎన్‌డి-ఏబిసి, సెబర్‌సెక్యూరిటీ, మైస్కీమ్‌ మరియు యూఎక్స్‌4జిపై అవగాహన కార్యక్రమాలు

డిజిటల్ ఇండియా ఇంటరాక్టివ్ క్విజ్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా నిర్వహించబడింది

Posted On: 19 SEP 2023 2:03PM by PIB Hyderabad

సెప్టెంబర్ 18, 2023న ఢిల్లీ యూనివర్సిటీలో డిజిటల్ ఇండియా టాక్ షో కమ్ ఇంటరాక్టివ్ సెషన్ విజయవంతంగా నిర్వహించబడింది. రాబోయే 6 నెలల్లో ప్లాన్ చేసిన వర్క్‌షాప్‌ల శ్రేణిలో ఇది రెండవది. ఇది డిజిటల్ ఇండియా అవేర్‌నెస్ ప్రచారంలో భాగంగా నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఇజిడి), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఇఐటివై) ద్వారా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, వర్సిటీ సిబ్బందితో పాటు యూనివర్సిటీకి చెందిన 500 మందికి పైగా హాజరయ్యారు. కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం ఎన్‌ఇజిడి మరియు డియులకు చెందిన అధికారులు కీలక ప్రసంగాలు చేశారు.

ఎంఇఐటివై ఎన్‌ఇజిడి డైరెక్టర్‌ శ్రీ జె ఎల్ గుప్తా మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలను మరియు దేశంలోని డిజిటల్ పరివర్తనను ఎలా తీసుకువస్తున్నాయో దాని యొక్క ముఖ్య కార్యక్రమాలు అలాగే దేశంలోని సుదూర ప్రాంతాలకు మరింత మెరుగ్గా చేరుకోవడంలో ఏ విధంగా సహాయపడుతున్నాయన్నదానిపై వివరించారు.

ఢిల్లీ యూనివర్శిటీ కంప్యూటర్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వం మరియు విశ్వవిద్యాలయాల మధ్య సహకారం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. అందరికీ ప్రయోజనాలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు చొచ్చుకుపోయేలా చేసిందని తెలిపారు. డిజిలాకర్, నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్‌ఏడి) మరియు అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబిసి) వంటి కార్యక్రమాల కోసం ఎంఇఐటివైతో యూనివర్సిటీ కలిగి ఉన్న వివిధ సహకారాల గురించి కూడా ఆయన పంచుకున్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ (ఐఎల్‌ఎల్‌ఎల్‌) డైరెక్టర్ ప్రొ.సంజోయ్ రాయ్ విద్యార్థుల జీవితాల్లో డిజిటలైజేషన్ ప్రయోజనాలు మరియు డిజిటల్ ప్రపంచంలో నైతికత యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడారు.

ఐదు కీలక డిజిటల్ ఇండియా కార్యక్రమాలైన ఉమాంగ్, డిజిలాకర్, నేషనల్ అకడమిక్ డిపాజిటరీ - అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఎన్‌ఏడి-ఏబిసి), సైబర్ సెక్యూరిటీ, మైస్కీమ్‌ మరియు యూఎక్స్‌4జి వంటి అంశాలపై నిపుణులచే ఎంగేజింగ్ సెషన్‌లు నిర్వహించారు.

వర్క్‌షాప్ యొక్క ముఖ్యాంశాలలో ఒకటి ఇంటరాక్టివ్ డిజిటల్ ఇండియా క్విజ్. ఇందులో ఐదు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన బహుళ ఎంపిక ప్రశ్నలు అడిగారు; విద్యార్థులు మరియు డియు ప్రొఫెసర్లు ఇరువురు చాలా ఉత్సాహంతో క్విజ్‌లో పాల్గొన్నారు. మరియు విజేతలకు డిజిటల్ ఇండియా గూడీస్ మరియు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

 

image.png

****



(Release ID: 1958836) Visitor Counter : 115


Read this release in: English , Urdu , Hindi , Kannada