రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ ఎన్క్యాప్)ను ప్రారంభించనున్న శ్రీ నితిన్ గడ్కరీ

प्रविष्टि तिथि: 20 AUG 2023 2:49PM by PIB Hyderabad

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ కొత్త కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (భారత్ ఎన్క్యాప్)ను 22 ఆగస్టు 2023 కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారుభారతదేశంలో మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను 3.5 టన్నుల వరకు పెంచడం ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచాలనే ప్రభుత్వ నిబద్ధతలో  కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగుమార్కెట్లో అందుబాటులో ఉన్న మోటారు వాహనాల ప్రమాద భద్రతను తులనాత్మకంగా అంచనా వేయడానికి కారు వినియోగదారులకు ఒక సాధనాన్ని అందించడం  కార్యక్రమం లక్ష్యం.   కార్యక్రమం కిందఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్) 197 ప్రకారం కార్ల తయారీదారులు స్వచ్ఛందంగా తమ కార్లను పరీక్షించుకోవచ్చుపరీక్షలలో కారు పనితీరు ఆధారంగాకారు అడల్ట్ ఓక్యుపెంట్స్ (ఏఓపీమరియు చైల్డ్ ఆక్యుపెంట్ (సీఓపీ)కి స్టార్ రేటింగ్లు ఇవ్వబడతాయిసంభావ్య కారు కస్టమర్లు వివిధ వాహనాల భద్రతా ప్రమాణాలను సరిపోల్చడానికి  స్టార్ రేటింగ్లను సూచించవచ్చు మరియు తదనుగుణంగా వారి కొనుగోలు-నిర్ణయాన్ని తీసుకోవచ్చుకస్టమర్ అవసరాలకు అనుగుణంగా కార్ల తయారీదారులను ప్రోత్సహిస్తే  సురక్షితమైన కార్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారుఅధిక భద్రతా ప్రమాణాలతోభారతీయ కార్లు గ్లోబల్ మార్కెట్లో మెరుగైన పోటీని సాధించగలవుభారతదేశంలోని కార్ల తయారీదారుల ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతాయి కార్యక్రమం భారతదేశంలో భద్రతా సున్నితమైన కార్ మార్కెట్ను అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు.

****


(रिलीज़ आईडी: 1950680) आगंतुक पटल : 251
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Odia , Tamil