మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ మరియు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఆగష్టు 17, 2023న పూరీ మరియు భువనేశ్వర్లను విభిన్న కార్యక్రమాలలో పాల్గొంటారు.
Posted On:
16 AUG 2023 7:53PM by PIB Hyderabad
కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, మరియు కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి.నిర్మలా సీతారామన్ రేపు ఆగస్ట్ 17, 2023 (గురువారం) పూరీ మరియు భువనేశ్వర్లలో ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
మన దేశ వారసత్వం మరియు పురోగతి పట్ల వారి అంకితభావాన్ని ఉదహరిస్తూ, "మేరీ మాటీ మేరా దేశ్" థీమ్తో ప్రతిధ్వనించే కార్యక్రమాలను వారు ప్రారంభించబోతున్నారు. రోజు కార్యకలాపాలు ఉన్నాయి:
శ్రీ మందిర దర్శనం: శతాబ్దాల సంప్రదాయానికి నివాళులు అర్పిస్తూ పూజనీయ శ్రీ మందిరాన్ని ఉదయం 7:00 గంటలకు మంత్రులు సందర్శించనున్నారు.
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ "మేరి మాటి మేరా దేశ్"పై ఇసుక కళ: ఉదయం 8:00 గంటలకు, ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన మంత్రముగ్ధులను చేసే "మేరీ మాటి మేరా దేశ్" థీమ్ యొక్క మనోహరమైన అందం ఇసుక శిల్పం గా రూపుదాల్చుతుంది. ఈ ఆకర్షణీయమైన ప్రదర్శన బ్లూ ఫ్లాగ్ బీచ్, మేఫెయిర్, పూరి లో సాగర తీరాన్ని అలంకరిస్తుంది.
మొక్కలు నాటడం మరియు పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞలో పాల్గొనడం: మంత్రులు ఉదయం 9:00 గంటలకు ప్రశంసనీయమైన పర్యావరణ కార్యక్రమం లో పాల్గొంటారు. పూరి లోని పెంటకట దగ్గర సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం యొక్క రెసిడెన్షియల్ కాంప్లెక్స్, శ్రీ సదాశివ క్యాంపస్లో మొక్కలు నాటడం మరియు పంచప్రాన్ ప్రతిజ్ఞ నిర్వహించబడుతుంది.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సహీద్ జయీ రాజ్గురు జన్మస్థలం - అమృత్ కలాష్ యాత్ర: ఉదయం 10:15 గంటలకు, మంత్రులు ప్రముఖ సహీద్ జయీ రాజ్గురు జన్మస్థలాన్ని సందర్శించి, బిరహరేకృష్ణపూర్లో ప్రతీకాత్మక అమృత్ కలష్ యాత్రను ప్రారంభించడం ద్వారా స్వాతంత్ర్య వారసత్వానికి నివాళులు అర్పిస్తారు.
కువి మరియూ దేశియా భాషలో పుస్తక ఆవిష్కరణ: భాషా వైవిధ్యం వేడుకలో, భువనేశ్వర్లోని మేఫెయిర్లో కువీ మరియు దేశియా భాషల్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది. భాష జ్ఞాన వ్యాప్తిని సులభతరం చేస్తుంది.
20వ జాతీయ సీ ఏ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవం: భువనేశ్వర్లోని ఎస్ ఓ ఏ యూనివర్శిటీ ఆడిటోరియంలో మేధోప్రగతి మరియు వృత్తిపరమైన అభివృద్ధిని పెంపొందించే 20వ జాతీయ సీ ఏ కాన్ఫరెన్స్ను ప్రముఖులు ప్రారంభించడంతో ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు కార్యక్రమాలు ముగుస్తాయి.
ఈ రోజు మన వారసత్వాన్ని కాపాడుకోవడం, మన మాతృభూమితో అనుసంధానం చేయడం మరియు పర్యావరణం మరియు మన దేశం పట్ల బాధ్యత భావాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను ఈ కార్యక్రమాలు తెలియజేస్తాయి.
***
(Release ID: 1949723)