ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విభజన బాధితులకు ప్రధాని నివాళి

प्रविष्टि तिथि: 14 AUG 2023 10:06AM by PIB Hyderabad

   దేశ విభజన విషాద సంస్మరణ దినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆనాటి బాధితులకు నివాళి అర్పించారు. అప్పటి భయానక విధ్వంసం సందర్భంగా మాతృభూమితో అనుబంధం కూకటివేళ్లతో పెకలించి వేయబడిన క్షణాల్లో వారనుభవించిన వేదనను గుర్తుచేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“దేశ విభజన విషాద సంస్కరణ దినం నేపథ్యంలో ఆనాడు అమరులైన భారతీయులకు శ్రద్ధాంజలి ఘటించాల్సిన సందర్భమిది. దీంతోపాటు మాతృభూమి నుంచి దూరం కావాల్సిన విషాద సమయంలో వారి వేదన, పోరాటం ఎంతటిదో ఇది మనకు గుర్తుచేస్తుంది. ఆనాటి త్యాగమూర్తులందరికీ నమస్కరిస్తూ నివాళి అర్పిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1948478) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada