రైల్వే మంత్రిత్వ శాఖ
59524 కిలోమీటర్ల పోడవైన బ్రాడ్ గేజ్ రైల్వేలైను విద్యుదీకరణ పూర్తి
-50 వందే భారత్ సర్వీసుల ప్రారంభం.
- 2023 జూన్ నాటికి, 3,946 రూట్ కిలోమీటర్లలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సదుపాయం ఏర్పాటు.
- 6,108 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం .
Posted On:
09 AUG 2023 4:37PM by PIB Hyderabad
2023 ఆగస్టు 1 వతేదీన , మొత్తం 59,524 కిలోమీటర్ల పొడవు గల బ్రాడ్ గేజ్ రైల్వే లైను విద్యుదీకరణ పూర్తి .
విద్యుదీకరణ వల్లకింది ప్రయోజనాలు ఉంటాయి.
1. నిర్వహణ వ్యయం తగ్గుతుంది.
2. విద్యుత్ లోకోమోటివ్ ల సామర్థ్యం పెంపుతో, సరకు రవాణా రైళ్లు , పొడవాటి పాసింజర్ రైళ్ల సామర్థ్యం పెరుగుుతుంది.
3 డిటెన్షన్ ను తొలగించడం ద్వారా , సెక్షనల్ సామర్ధ్యం పెంపు.
4. పర్యావరణ హితకర రవాణా వ్యవస్థ
5.ముడిచమురు దిగుమతిపై ాధారపడపడం తగ్గింపు ద్వారా , విలువైన విదేశీ మారకద్రవ్యం ఆదా.
రైల్వే లైను విద్యుదీకరణ ప్రాజెక్టులు పూర్తి కావడం అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అటవీశాఖ అధికారుల నుంచి అటవీ క్లియరెన్సులు, వివిధ చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు, కొన్ని సదుపాయాలను వేరొకచోటికి తరలించడం.భౌతికంగా , ఆ యా ప్రాంతాల పరంగా ఉన్న పరిస్థితులు, ప్రాజెక్టు ప్రాంతంలో శాంతి భద్రతలు, ప్రాజెక్టుల ప్రాంతంలో పనులు చేయడానికి ఏడాదిలో అనుకూలంగా ఉన్న నెలలు వంటివి ప్రాధాన్యత వహిస్తాయి. ఈ అంశాలన్నీ ప్రాజెక్టు సకాలంలో పూర్తికావడంపై ప్రభావం చూపుతాయి.
రైళ్ల వేగం పెంచడం భారతీయ రైల్వేలొ నిరంతర ప్రక్రియ. రైల్వే కాలపట్టిక హేతుబద్ధీకరణ నిరంతర ప్రక్రియ. ఐఐటి ముంబాయి సహాయంతో రైళ్ల పట్టికను హేతుబద్ధం చేసే ప్రక్రియను రైల్వే శాఖ చేపట్టింది. పాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చడం, ఎక్స్ ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా మార్చడం వంటి వాటి ద్వారా రైళ్ల వేగం పెంచుతోంది. మెము కోచ్ లతో నడిచే రైళ్ల మార్పిడి ప్రయాణికులకు మెరైగన సేవలు అందించేందుకు నిర్దేశించినది. దీనికి తోడు భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది.ఇవి ఎక్కువ వేగం కలిగి ఉంటాయి. 2023 ఆగస్టు 3 వ తేదీ వరకు భారతీయ రైల్వే నెట్ వర్క్ లో 50 వందేభారత్ సేవలను ప్రవేశపెట్టారు.
రైళ్ల వేగం పెంచేందుకు తీసుకున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి.
1)భారతీయ రైల్వే నెట్ వర్క్ లోని 10,400 రూట్ కిలోమీటర్లలో వేగాన్ని గంటలకు 130 కిలోమీటర్లకు పైగా పెంచడం జరిగింది.
2) సెక్షనల్ వేగం న్యూఢిల్లీ- ముంబాయి మార్గంలో (వడోదరా – అహ్మదాబాద్ మార్గం సహా) , ఢిల్లీ –హౌరా మార్గం (కాన్పూర్ –లక్నో మార్గంలో) వేగం గంటకు 160 కిలోమీటర్లకు పెంచడం జరిగింది. ఈ మార్గాలను వరుసగా రూ 6,806 కోట్లు, 6,685 కోట్ల రూపాయల ఖర్చుతో ఆమోదించారు.
సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించడం భారతీయ రైల్వేలో నిరంతర ప్రక్రియ.
1)పాత యాంత్రిక సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ, కేంద్రీక్రుత పాయింట్ల నిర్వహణకు ఏర్పాటు. ఈ వ్యవస్థలు 30.06.2023 నాటికి 6,443 స్టేషన్లలో ఏర్పాటు చేశారు.
2)30.06.23 నాటికి 6,381 స్టేషన్లలో ట్రాక్ సర్క్యూటింగ్ పూర్తి అయింది.
3) 30.06.23 నాటికి , 11,102 లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద, ఇంటర్ లాకింగ్ గేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో లెవల్ క్రాసింగ్ లవద్ద భద్రత పెరిగింది.
4)బ్లాక్ సెక్షన్లకు సంబంధించి ఆటోమేటిక్ క్లియరెన్స్కు యాక్సిల్ కౌంటర్ల ఏర్పాటు. మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా రైళ్లు పూర్తిగా వచ్చేందుకు వీలు కల్పించేలా బిపిసి (బ్లాక్ ప్రూవింగ్ యాక్సిల్ కౌంటర్లు) సదుపాయం. వీటిని 30.06.23 నాటికి 6,412 బ్లాక్ సెక్షన్ లలో ఏర్పాటు చేయడం జరిగింది.
5) ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఎబిఎస్) ను 3,946 రూట్ కిలోమీటర్లలో 30.06.23 నాటికి ఏర్పాటు చేశారు.
రైల్ టెల్ ఒ.ఎఫ్.సిని నిర్వహిస్తుంది. కంట్రోల్ కమ్యూనికేషన్ సర్క్యూట్ కు ఇది వెన్నెముక లాంటిది. ఎఫ్.ఒ.ఐ.ఎస్ వంటి వాటికి ఇది అవసరం. 6,108 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పించడం జరిగింది.
ఈ సమాచారాన్ని రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్ , లోక్ సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1947364)