సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మనుషులతో మల పదార్థాల తొలగింపు (మాన్యువల్ స్కావెంజింగ్) పద్ధతి నిర్మూలనకు రోబో 'బండికూట్' టెక్నాలజీ
प्रविष्टि तिथि:
09 AUG 2023 4:07PM by PIB Hyderabad
మ్యాన్ హోల్ అడుగున పేరుకుపోయిన గ్రిట్, నిక్షేపాలను తొలగించడానికి బండికూట్ వంటి ఉత్పత్తులు అవసరం. ఇవి పేరుకు పోవడం వల్ల మురుగు నీరు పొంగిపొర్లడానికి కారణమవుతుంది. అందువల్ల వాటిని తొలగించడానికి మ్యాన్ హోల్ లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండా ఆపరేట్ చేయగలిగే తగిన మ్యాన్ హోల్ డీ-గ్రిటింగ్ యంత్రాలను కొనుగోలు చేయాలని, తగిన క్లీనింగ్ పీరియాడిటీని ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థలకు సూచించారు. పారిశుధ్య కార్మికులకు అదే స్థాయి భద్రతను నిర్ధారిస్తూ, స్థానికంగా సులభంగా తయారు చేయబడిన చాలా సరళమైన యంత్రాలను ఉపయోగించడం ద్వారా కాలానుగుణ , అత్యవసర డీ-గ్రిటింగ్ మ్యాన్ హోల్స్ అవసరాన్ని పూర్తి చేయవచ్చు, ఇది దాదాపు అదే విధమైన ఫలితాన్ని ఇస్తుంది.
నగరాలు తమ మ్యాన్ హోల్స్, మురుగు కాలువల నిర్వహణకు సరళమైన, చౌకైన యాంత్రిక ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించారు.
ఎంఎస్ యాక్ట్ 2013లోని సెక్షన్ 33 ప్రకారం మురుగునీరు, సెప్టిక్ ట్యాంకుల శుభ్రతకు ప్రతి స్థానిక అథారిటీ, ఇతర ఏజెన్సీ తగిన సాంకేతిక పరికరాన్ని ఉపయోగించాలి. ప్రభుత్వం ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు, ఇతరత్రా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకాన్ని ప్రోత్సహించాలి.
"మాన్యువల్ స్కావెంజర్లుగా పనిచేయడాన్ని నిషేధించడం , వారి పునరావాస నిబంధనలు, 2013 (ఎంఎస్ నిబంధనలు, 2013)" ప్రకారం, యజమాని భద్రతా యంత్రాలను, పరికరాలను అందించడం, నిబంధనలలో సూచించిన భద్రతా జాగ్రత్తలను నిర్ధారించడం తప్పనిసరి.
మురుగునీటి పారుదల, సెప్టిక్ ట్యాంకుల శుభ్రతకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) జారీ చేసింది. దీనికి అదనంగా, ఈ క్రింది వాటిని నిర్ధారించడానికి దేశంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో (యుఎల్ బి) నమస్తే పథకాన్ని అమలు చేస్తున్నారు:-
*భారత్ లో పారిశుద్ధ్య పనుల్లో జీరో మరణాలు
*పారిశుధ్య పనులన్నీ నైపుణ్యం కలిగిన కార్మికుల ద్వారా నిర్వహించాలి.
*పారిశుధ్య కార్మికులు ఎవరూ మానవ మలం పదార్థంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండరు
*రిజిస్టర్డ్ , నైపుణ్యం కలిగిన పారిశుధ్య కార్మికుల నుండి సేవలను పొందడానికి పారిశుద్ధ్య సేవలను కోరుకునేవారిలో (వ్యక్తులు , సంస్థలు) అవగాహన పెంచడం
*యాంత్రీకరణ పారిశుద్ధ్య సేవలను సురక్షితంగా అందించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ శానిటేషన్ యూనిట్లను (ఇఆర్ ఎస్ యు) బలోపేతం చేయడం, సామర్థ్యం పెంచడం.
పారిశుధ్య కార్మికులకు పారిశుధ్య సంస్థలను నడపడానికి సాధికారత కల్పించడం, యంత్రాల లభ్యత ద్వారా క్లీనింగ్ ఆపరేషన్ యాంత్రీకరణను ప్రోత్సహించడం.
యాంత్రిక పరికరాలతో సురక్షితంగా శుభ్రపరచడానికి , వారి గౌరవాన్ని పెంచడానికి ఎబి-పిఎంజెఎవై కింద వృత్తిపరమైన శిక్షణ, భద్రతా పరికరాలు, ఆరోగ్య భీమాను పొడిగించడం ద్వారా మురుగునీటి సెప్టిక్ ట్యాంక్ కార్మికులను ఈ పథకం క్రమబద్ధీకరిస్తుంది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే రాజ్యసభ లో ఒక లిఖిత పూర్వక సమాధానం లో ఈ వివరాలు తెలిపారు.
*****
(रिलीज़ आईडी: 1947362)
आगंतुक पटल : 164