రైల్వే మంత్రిత్వ శాఖ

రైళ్లలో మహిళా ప్రయాణికులతో సహా ప్రయాణికుల రక్షణ మరియు భద్రతకు రైల్వేలు తీసుకున్న చర్యలు..

Posted On: 09 AUG 2023 4:33PM by PIB Hyderabad

'పోలీసు' మరియు 'ప్రజా రక్షణ' భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని రాష్ట్ర సబ్జెక్ట్‌లు. అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చట్ట అమలు ద్వారా రైల్వేలో నేరాలను నిరోధించడం, గుర్తించడం, నమోదు చేయడం, దర్యాప్తు చేయడం మరియు శాంతిభద్రతల నిర్వహణ బాధ్యతలను కలిగి ఉంటాయి. ప్రభుత్వ  ఏజెన్సీలు అనగా ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ)/జిల్లా పోలీస్రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్రైల్వే ఆస్తిప్రయాణీకుల ప్రాంతం, ప్రయాణీకులకు మెరుగైన రక్షణ మరియు భద్రతను అందించడానికి సంబంధిత అనుసంధానించబడిన విషయాల కోసం జీఆర్పీ/జిల్లా పోలీసులకు అనుబంధం వృత్తిగా ఉంటుందిరాష్ట్రాల వారీగా రైల్వేలో మహిళలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనల సంఖ్యను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బిప్రచురించింది. 2021 వరకు ఎన్సిఆర్బి ప్రచురించిన సమాచారం ఆధారంగా 2018 & 2019 సంవత్సరాలతో పోలిస్తే 2021 సంవత్సరంలో భారతీయ రైల్వేలో నమోదైన మహిళలపై నేరాల కేసులు గణనీయంగా తగ్గాయికోవిడ్ -19 ప్రారంభం కారణంగా ప్యాసింజర్ రైలు ఆపరేషన్ తీవ్రంగా తగ్గించబడినందున 2020 సంవత్సరంలో నేరాల డేటాను పోల్చడానికి పరిగణించబడదు.  2022 మరియు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు ఎన్సిఆర్బి ద్వారా ప్రచురించబడలేదుప్రయాణీకుల భద్రత కోసం 7264 కోచ్లు మరియు 866 రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా ఉంచబడింది.  ప్రయాణ సమయంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి,  ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు, పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాల పంపిణీ, రైల్వే డిస్‌ప్లే నెట్‌వర్క్ (ఆర్.డి.ఎన్)పై వీడియోలు మొదలైన వాటి ద్వారా అవగాహన ప్రచార కార్యక్రమాలు తప్పకుండా నిర్వహించబడతున్నాయి. దీనికి తోడు రైళ్లలో మహిళా ప్రయాణికులతో సహా ప్రయాణీకుల రక్షణ మరియు భద్రత కోసం జీఆర్/స్థానిక పోలీసుల సమన్వయంతో రైల్వే ఈ క్రింది చర్యలు తీసుకుంటోంది: -

1. దుర్బలమైన మరియు గుర్తించబడిన మార్గాలు/విభాగాలలో, రైళ్లు ప్రతిరోజూ వివిధ రాష్ట్ర ప్రభుత్వ రైల్వే పోలీసులు ఎస్కార్ట్ చేసే రైళ్లకు అదనంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఎస్కార్ట్ చేయబడుతుంది.

2. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రైల్వేలు ప్రయాణికులతో నిత్యం టచ్‌లో ఉంటాయి. ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి మరియు వారి భద్రతా సమస్యలను పరిష్కరించడానికి ట్విట్టర్, ఫేస్‌బుక్, కూ మొదలైన వేదికల ద్వారా రైల్వేలు ప్రయాణికులతో నిత్యం టచ్‌లో ఉంటాయి.

3. రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139 ద్వారా వచ్చే ఫిర్యాదుల నిమిత్తం ఆపదలో ఉన్న ప్రయాణీకులకు భద్రతా సంబంధిత సహాయం కోసం భారతీయ రైల్వేలో (24x7) పనిచేస్తోంది.

4. దొంగతనాలు, స్నాచింగ్‌లు, మత్తుపదార్థాలు సేవించడం మొదలైన వాటికి వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయాణీకులకు అవగాహన కల్పించడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా తరచుగా ప్రకటనలు చేయబడతాయి.

5. ‘మేరీ సహేలి’ చొరవ కింద, రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణీకుల రక్షణ మరియు భద్రత కోసం వారి మొత్తం ప్రయాణంలో అంటే ప్రయాణ ప్రారంభ స్టేషన్ నుండి గమ్యస్థాన స్టేషన్ వరకు వారికి రక్షణ మరియు భద్రతపై దృష్టి కేంద్రీకరించబడింది.

6. రైలు ఎస్కార్ట్ పార్టీలలో, సాధ్యమైనంత వరకు పురుష & మహిళా ఆర్.పి.ఎఫ్/ఆర్.పి.ఎస్.ఎఫ్ సిబ్బందిని సరైన సమ్మిళితం చేయాలని జోనల్ రైల్వేలకు సూచించబడింది.

7.మహిళల కోసం ప్రత్యేకించబడిన కంపార్ట్‌మెంట్లలోకి పురుష ప్రయాణీకుల ప్రవేశాన్ని నివారించేందుకు డ్రైవ్‌లు నిర్వహించబడతాయి.

8. రైల్వేల భద్రతా ఏర్పాట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మరియు సమీక్షించడం కోసం సంబంధిత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్/కమీషనర్ ఆఫ్ స్టేట్స్/యూనియన్ టెరిటరీల అధ్యక్షతన అన్ని రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్ర స్థాయి రైల్వే భద్రతా కమిటీ (ఎస్.ఎల్.ఎస్.సి.ఆర్) ఏర్పాటు చేయబడింది.

రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

                                                       

******



(Release ID: 1947360) Visitor Counter : 75


Read this release in: English , Urdu , Tamil