పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశంలోని 57 స్థావరాలలో పనిచేస్తున్న 36 ఎఫ్‌టిఓలు


2022లో రికార్డు స్థాయిలో 1165 కమర్షియల్ పైలట్ లైసెన్స్‌లను జారీ చేసిన డిజిసిఏ

Posted On: 07 AUG 2023 2:34PM by PIB Hyderabad

ప్రస్తుతం దేశంలో 36 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌టిఓలు) 57 బేస్‌లలో పనిచేస్తున్నాయి. ఇవి క్యాడెట్‌లకు ఫ్లయింగ్ శిక్షణను అందిస్తున్నాయి. 2022 సంవత్సరంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) పరిశ్రమ అవసరాలను తీర్చడానికి రికార్డు స్థాయిలో 1165 కమర్షియల్ పైలట్ లైసెన్స్‌లను (సిపిఎల్‌లు) జారీ చేసింది.

పైలట్ శిక్షణ పాఠశాలలను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:-

(i) 2020లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సరళీకృత ఎఫ్‌టిఓ మార్గదర్శకాలను ఆమోదించింది. ఇందులో విమానాశ్రయ రాయల్టీ (ఏఏఐకి ఎఫ్‌టిఓల ద్వారా ఆదాయ వాటా చెల్లింపు) భావన రద్దు చేయబడింది మరియు భూమి అద్దెలు గణనీయంగా హేతుబద్ధీకరించబడ్డాయి.

(ii) 2021లో పోటీ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత ఏఏఐ బెలగావి (కర్ణాటక), జలగావ్ (మహారాష్ట్ర), కలబురగి (కర్ణాటక), ఖజురహో (మధ్యప్రదేశ్) మరియు లిలాబరీ (అస్సాం)లోని ఐదు విమానాశ్రయాలలో తొమ్మిది ఎఫ్‌టిఓ స్లాట్‌లను అందజేసింది. ప్రస్తుతం, వీటిలో ఆరు ఎఫ్‌టిఓ స్లాట్‌లు పనిచేస్తున్నాయి: అవి-జల్గావ్, లిలాబరీ, ఖజురహో, బెలగావిలో ఒక్కొక్కటి మరియు కలబురగిలో రెండు.

(iii) జూన్ 2022లో పోటీ బిడ్డింగ్ ప్రక్రియ తర్వాత భావ్‌నగర్ (గుజరాత్), హుబ్బల్లి (కర్ణాటక), కడప (ఆంధ్రప్రదేశ్), కిషన్‌గఢ్ (రాజస్థాన్) మరియు సేలం (తమిళనాడు) అనే ఐదు విమానాశ్రయాలలో ఏఏఐ ద్వారా మరో ఆరు ఎఫ్‌టిఓ స్లాట్‌లు లభించాయి. ప్రస్తుతం, సేలం (తమిళనాడు)లో ఒక ఎఫ్‌టిఓ స్లాట్ పనిచేస్తోంది.

(iv) ఎఫ్‌టిఓల వద్ద విమాన కార్యకలాపాలకు అధికారం ఇచ్చే హక్కుతో ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌లకు అధికారం కల్పించేందుకు డిజిసిఏ తన నిబంధనలను సవరించింది. ఇది ప్రతి ఎఫ్‌టిఓ వద్ద ఎగిరే గంటలు మరియు విమాన వినియోగాన్ని పెంచడానికి మరియు సిపిఎల్‌ అవసరాలను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***



(Release ID: 1946539) Visitor Counter : 110