గనుల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు నిల్వలు
Posted On:
31 JUL 2023 4:20PM by PIB Hyderabad
భారతీయ ఖనిజాల వార్షిక పుస్తకం ప్రకారం 01.04. 2020 నాటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం వనరులలో 47.17 టన్నులు ఉన్నాయి. ఇందులో 5.3 టన్నుల నిరూపిత & సంభావ్య నిల్వలు, 41.87 టన్నుల ప్రాథమిక లోహంగా బంగారంతో ఇతర వనరులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో జిఎస్ఐ నిర్వహించిన బంగారంపై పరిశోధనల ప్రకారం రామగిరి బంగారు క్షేత్రం, పెనకచెర్ల బంగారు క్షేత్రం, జోనగిరి పలకల బెల్టు, చిగురుగుంట దక్షిణానికి ఉన్న బినత్తం బంగారు బెల్ట్లలో బంగారు నిక్షేపాలు కనిపించినట్టు తెలుస్తోంది. చిగురుగుంట ప్రాంతంలో సగటున 4.0 - 6.22 జి/ టఇ ఎయుతో 3467 టన్నుల ముడి ఖనిజం ఉన్నట్టు జిఎస్ఐ అంచనా వేసింది.
ఎంఎండిఆర్ చట్టం, 2015 అమలు తర్వాత, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చిగురుగుంట, బిసనత్తం బంగారు గనులు, కోలార్ పలకల బెల్ట్ గురించిన భౌగోళిక రాజకీయ నివేదికలు వచ్చిన తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ఈ రెండు బ్లాకులలో వనరుల అంచనా దిగువన పేర్కొన్నట్టుగా ఉంది ః
చిగురుగుంట బ్లాకుః చిగరగుంట గని -1లో అంచనా వేసిన వనరులు సగటు 5.20 పిపిఎం బంగారంతో 1.6573 మిలియన్ టన్నల ఖనిజం, చిగరగుంట బ్లాకు 5వ స్థాయి (చిగరగుంట గని 1&2) వరకు సగటున 5.73 జి/ టఇతో మొత్తం వనరు 2.04 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు.
బిసనత్తం బ్లాకుః బిసనత్తం బ్లాకులో సగటు గ్రేడ్ 4.70 జి/ టితో 173478 టన్నుల ఖనిజ వనరును అంచనా వేశారు.
ఈ విషయాన్ని రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ వివరించారు.
***
(Release ID: 1944521)