నీతి ఆయోగ్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం హరిత,సుస్థిర అబివృద్ధి అజెండా పేరుతో నీతిఆయోగ్ చే జి 20 సదస్సు.
అత్యంత నాణ్యమైన సుస్థిర పురోగతికి మద్దతు తెలిపేందుకు వీలుగా ఏకాభిప్రాయసాధనకు ఇది చక్కని అవకాశం : నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెరి
అన్నిప్రాంతాల దృక్పథాలతో సుస్థిరపురోగతికి సంబంధించి లోతైన చర్చ
2023 జూలై 28–29 తేదీలలో న్యూఢిల్లీలో రెండురోజుల సదస్సు.
Posted On:
27 JUL 2023 5:33PM by PIB Hyderabad
భారత ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ విధాన ప్రణాళిక రూపకల్పన సంస్థ నీతి ఆయోగ్, ఒట్టొవా లోని అంతర్జాతీయ అభివృద్ధి పరిశోధన సంస్థ (ఐడిఆర్సి), న్యూఢిల్లీలోని అంతర్జాతీయ
అభివృద్ధి నెట్ వర్క్ (జిడిఎన్) తో కలసి రెండు రోజుల అంతర్జాతీయ పాలసీ వర్క్షాప్ను నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా హరిత, సుస్థిర ప్రగతికి సంబంధించిన సవాళ్లను , అవకాశాలను
40మంది ప్రముఖ ఆలోచనాపరులు ఈ సదస్సులో పరిశీలించనున్నారు.
“ అత్యంత నాణ్యత కలిగిన పురోగతికి మద్దతునిచ్చే విధంగా రాజకీయ ఏకాభిప్రాయసాధనకు కృషిచేయడానికి గల సమర్థతనుంచే జి 20కి చట్టబద్ధత లభిస్తోంద”ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెరి అన్నారు.
“అంతర్జాతీయ సంస్థలు (ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్లు) సూచిస్తున్న దానిప్రకారం, రాగల దశాబ్దాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రకరకాల ప్రగతి వ్యూహాలు అవసరమౌతాయి.
భారత్ జి 20 అధ్యక్షత కింద ఈ వర్క్షాప్ జరుగుతుండడం సంతోషకరమైన అంశమని ఆయన అన్నారు. సెప్టెంబర్లో జరగనున్న జి20నాయకుల సమావేశానికి ముందుగా ఇది జరిగేవిధంగా సమయాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు.
2023 జూలై 28, 29 తేదీలలో జరిగే ఈ రెండు రోజుల సదస్సులో తొలి రోజు వర్క్షాప్ ఇంధనం, వాతావరణం, ప్రగతి, సాంకేతికత, విధానపరమైన అంశాలు, ఉద్యోగాలు, ట్రేడింగ్ వ్యవస్థకు సంబంధించిన అంశాలు,
అంతర్జాతీయ ఫైనాన్స్ను సుస్థిర ప్రగతి కోసం రూపొందించడం వంటివి ఉన్నాయి. రెండో రోజు వర్క్షాప్ లో బహుళపక్ష విధానం, సర్దుబాటు ధోరణి, సమ్మిళితత్వం వంటి అంశాలు ఉన్నాయి. ఈ వర్క్షాప్ లో చర్చించిన అంశాలపై తదుపరి
నీతిఆయోగ్, ఇతర భాగస్వామ్య సంస్థలు వివిధ వేదికలపై వీటిని చర్చించనున్నాయి.
నీతి ఆయోగ్ సిఇఒ బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం పాలసీ వర్క్షాప్ ప్రారంభోపన్యాసం చేస్తారు. జి 20 షేర్పా ,శ్రీ అమితాబ్ కాంత్,నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ శ్రీ సుమన్ కె.బెరి వర్క్షాప్ లక్ష్యాలు, ప్రక్రియను వివరిస్తారు.
మరిన్ని వివరాలకు https://niti.gov.in/g-20-conference
***
(Release ID: 1943578)