మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

మహిళల నేతృత్వంలో పాల సహకార సంఘాల ద్వారా సుస్థిర అభివృద్ధి - డబ్ల్యూ 20 జనభాగిదారి ఈవెంట్

Posted On: 22 JUL 2023 2:19PM by PIB Hyderabad

"పాడి పరిశ్రమల సహకార సంస్థల ద్వారా మహిళల నేతృత్వంలోని సుస్థిర అభివృద్ధి" అనే అంశం గుజరాత్‌లోని ఆనంద్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా డబ్ల్యూ20 ఆధ్వర్యంలో జనభాగిదారి ఈవెంట్  జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవఅతిథులు, నిపుణులు మరియు డెయిరీ రంగానికి చెందిన మహిళా నాయకులు చురుకుగా పాల్గొన్నారు.

 

వర్చువల్‌గా ప్రసంగించిన శ్రీ పర్షోత్తం రూపాలా, పాడి పరిశ్రమలో మహిళల పాత్ర మరియు ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో వారి సహకారాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం 18 పాడి పరిశ్రమ సహకార సంఘాలు మహిళలచే నిర్వహించబడుతున్నాయని చెప్పారు.

 

ఏ హెచ్ డీ సెక్రటరీ శ్రీమతి అల్కా ఉపాధ్యాయ, శ్వేత విప్లవానికి మహిళల గణనీయమైన సహకారాన్ని నొక్కిచెప్పారు, పాడి పరిశ్రమల రంగంలో 70 శాతం మంది శ్రామిక శక్తి మహిళలే. కొత్త ఏ-హెల్ప్ (అక్రెడిటెడ్ ఏజెంట్ ఫర్ హెల్త్ అండ్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ లైవ్‌స్టాక్ ప్రొడక్షన్) చొరవ, స్థానిక పశువైద్య ప్రాథమిక సేవలను అందిస్తూ మరియు పశువుల యజమానుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి కమ్యూనిటీ-ఆధారిత మహిళా కార్యకర్తలు కూడా పాలుపంచుకుంటున్నారని  ఆమె పేర్కొన్నారు. వన్ హెల్త్ ( సమిష్టి జీవ ఆరోగ్యం) కాన్సెప్ట్ యొక్క ప్రాముఖ్యతను మరియు వ్యాధుల నివారణ యొక్క ప్రాముఖ్యతను కూడా ఆమె హైలైట్ చేశారు.

 

శ్రీ జగదీష్ విశ్వకర్మ, గుజరాత్ ప్రభుత్వ సహకార శాఖ సహాయ మంత్రి, 'జన్ భగీదరి - పాడి సహకార సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని సుస్థిర అభివృద్ధి' ప్రారంభోత్సవాన్ని సూచిస్తూ ఉత్సవ జ్యోతిని వెలిగించారు.

 

జన్ భగీదారి కార్యక్రమంలో డబ్ల్యూ 20 చైర్ డాక్టర్. సంధ్యా పురేచా  స్వాగత ప్రసంగం సందర్భంగా,  మహిళల సాధికారత మరియు పాడి పరిశ్రమతో సహా వివిధ రంగాలలో వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని డబ్ల్యూ 20 యొక్క లక్ష్యాలను నొక్కిచెప్పారు.

 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో మహిళలు పోషించిన కీలక పాత్రను శ్రీమతి భారతి గోష్ హైలైట్ చేశారు మరియు భారత ప్రభుత్వ పథకాలు దేశంలో మహిళలకు అనుకూలమైన వాతావరణాన్ని మరియు పర్యావరణ వ్యవస్థను ఎలా సృష్టించాయో నొక్కి చెప్పారు.

 

'జన్ భాగీదారీ - మహిళల నేతృత్వంలో పాల సహకార సంఘాల ద్వారా  సుస్థిర అభివృద్ధి' అనే కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా పాడి రైతులను సత్కరించారు.  మహిళా వ్యాపార వ్యవస్థాపకత, క్షేత్ర స్థాయి మహిళా నాయకత్వం, లింగ డిజిటల్ విభజనను తగ్గించడం, విద్య మరియు నైపుణ్యం అభివృద్ధి మరియు వాతావరణ మార్పు చర్య వంటి  డబ్ల్యూ 20 యొక్క ఐదు కీలక ప్రాధాన్యతా రంగాలలో తమ అద్భుతమైన విజయ గాథలను రైతులు పంచుకున్నారు.

 

గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జాయెన్ మెహతా, అమూల్ మరియు భారతదేశపు డెయిరీ రంగంలో పురోగతి మరియు అభివృద్ధిపై అంతర్దృష్టిని అందించారు.

 

ఐ డీ ఎఫ్ డైరెక్టర్ జనరల్  శ్రీమతి కరోలిన్ ఎమాండ్ "ప్రపంచ పాల రంగంలో మహిళల పాత్రను గుర్తించడం మరియు బలోపేతం చేయడం" ప్రదర్శనను అందించారు. ఆమె ప్రెజెంటేషన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యం 5, వ్యవసాయ ఆహార వ్యవస్థ లలో మహిళల స్థితి మరియు మహిళల సాధికారతలో పాల రంగంలో మహిళల పాత్రను హైలైట్ చేసింది.

 

ఎన్‌డిడిబి చైర్మన్ డాక్టర్ మీనేష్ షా మాట్లాడుతూ సహకార సంఘాల్లో మహిళలు పోషించే కీలక పాత్ర గురించి మరియు పాడి పరిశ్రమలో మహిళలను ప్రోత్సహించడంలో ఎన్‌డిడిబి నిబద్ధతను వ్యక్తం చేశారు.

 

గుజరాత్ ప్రభుత్వ సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ జగదీష్ విశ్వకర్మ, భారతదేశంలో పాడి పరిశ్రమ సహకార సంఘాలను బలోపేతం చేయడం మరియు పాడి పరిశ్రమలో మహిళల కీలక పాత్ర గురించి భారత ప్రభుత్వ లక్ష్యం గురించి ఉద్ఘాటించారు.

 

డబ్ల్యూ 20 చీఫ్ కోఆర్డినేటర్ శ్రీమతి ధరిత్రి పట్నాయక్ తన ముగింపు వ్యాఖ్యలలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మరియు డెయిరీ రంగంలో మహిళల నేతృత్వంలోని స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడానికి నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

ఉమెన్ 20 (డబ్ల్యూ 20) అనేది అధికారిక జీ20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్, ఇది 2015లో తుర్కియే ప్రెసిడెన్సీ ఆఫ్ జీ 20 క్రింద లింగ సమానత్వంపై దృష్టి పెట్టే లక్ష్యంతో రూపొందించబడింది. డబ్ల్యూ 20 యొక్క ప్రాథమిక లక్ష్యం మహిళా సాధికారత, మహిళల హక్కుల కోసం వాదించడం మరియు సమాజంలో వారి వాణిని పెంచడం. లింగ సమానత్వం వైపు పురోగతి చాలా నెమ్మదిగా మరియు పరిధీయంగా ఉన్నందున ఏదైనా గుర్తించదగిన మార్పులను చూడడానికి దేశీయ కార్యక్రమాలు అంతర్జాతీయ వ్యూహంలో చేర్చబడాలి అనే ఆలోచనపై ఇది స్థాపించబడింది. అదనంగా, జీ 20 లీడర్స్ డిక్లరేషన్‌లో లింగ సమానత్వం మరియు మహిళల ఆర్థిక సాధికారతకు మద్దతు ఇచ్చే నియమాలు మరియు చర్యలు ఉండేలా చూడటం దీని లక్ష్యం.

 

ఒక రోజు కార్యక్రమంలో "అన్ని రంగాలలో మహిళా నాయకుల పునరుద్ధరణ ప్రయాణం" మరియు "ఇంటర్ డిసిప్లినరీ సహకారం ద్వారా సుస్థిర అభివృద్ధిలో మహిళల సహకారం" అనే అంశంపై ప్యానెల్ చర్చలు జరిగాయి. శ్రీమతి రహీబాయి సోమా పోపెరే (సీడ్ మదర్ ఆఫ్ ఇండియా), శ్రీమతి టెస్సీ థామస్ (మాజీ డైరెక్టర్ జనరల్, ఏరోనాటికల్ సిస్టమ్ & అగ్ని 4 క్షిపణి మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్, డీ ఆర్ డీ ఓ), శ్రీమతి లజ్జా గౌస్వామి (షూటర్, అంతర్జాతీయ క్రీడాకారిణి, కామన్‌వెల్త్ గేమ్స్ పతక విజేత) వంటి స్ఫూర్తిదాయక మహిళా నాయకులు ఉన్నారు.

 

విశిష్ట సేవలందించిన మహిళా ప్రతినిధులను డాక్టర్ సంధ్యా పురేచా సత్కరించడంతో కార్యక్రమం ముగిసింది.

 

***



(Release ID: 1941847) Visitor Counter : 139