వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

“భారత్ దాల్” పేరిట సబ్సిడీ ధరలతో శనగ పప్పు విక్రయం ప్రారంభించిన శ్రీ పీయూష్ గోయల్; రూ.60కి కిలో ప్యాక్, కిలో రూ.55కి 30 కిలోల ప్యాక్ విడుదల

Posted On: 17 JUL 2023 5:45PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలుఆహరంప్రభుత్వ పంపిణీటెక్స్  టైల్వాణిజ్య శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సబ్సిడీ ధరలకు శనగపప్పు విక్రయాన్ని ప్రారంభించారు“భారత్ దాల్”  బ్రాండ్  తో విడుదల చేసిన శనగపప్పు కిలో ప్యాక్ రూ.60కి, 35 కిలోల ప్యాక్ కిలో రూ.55 ధరకు విధుల చేశారు.

జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్  ఫెడరేషన్ (నాఫెడ్ఢిల్లీ-ఎన్ సి ఆర్ లలో రిటైల్ స్టోర్ల ద్వారా సబ్సిడీ శనగ పప్పు విక్రయిస్తోంది.  పప్పులు సగటు వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవే “భారత్  దాల్” విక్రయం.

జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్  ఫెడరేషన్ (నాఫెడ్శనగ పప్పు మిల్లింగ్ప్యాకేజింగ్  చేపడితే ఎన్ సిసిఎఫ్కేంద్రీయ భండార్సఫల్  రిటైల్ స్టోర్ల ద్వారా ఢిల్లీ-ఎన్ సి ఆర్ లలో  విక్రయిస్తారుఅలాగే సంక్షేమ పథకాల కింద సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వాలుపోలీసుజైళ్ల శాఖలకువినియోగదారుల సహకార సంఘాలకు  కూడా శనగ పప్పు అందుబాటులో ఉంచుతారు.  

శనగ మన దేశంలో పుష్కలంగా ఉత్పత్తి చేసే పప్పు దినుసుదీన్ని పలు రకాల్లో వినియోగిస్తారు.  శనగను నానబెట్టిఉడకబెట్టి సలాడ్  గానుశనగను వేయించి స్నాక్ గాను విక్రయిస్తారువేయించిన శనగ పప్పును కంది పప్పు ప్రత్యామ్నాయంగా కూరలుసూప్ లలో వినియోగిస్తారుకారంతీపి పిండి వంటల్లో  ముడి పదార్థంగా శనగ పిండిని వినియోగిస్తారుశనగకు పోషకాహార విలువలు కూడా ఉన్నాయిఅందులో ఫైబర్ఐరన్పొటాషియంవిటమిన్ బిసెలీనియం బీటా కెరోటిన్చోలిన్ ఉన్నాయిరక్త హీనతరక్తంలో చక్కర అదుపులో ఉంచడానికి;  ఎముకలుమానసిక  ఆరోగ్యానికి శనగ ఉపయోగపడుతుంది

 

***



(Release ID: 1940383) Visitor Counter : 148