మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముగిసిన రెండు రోజుల సందర్శకుల సమావేశం సందర్శకుల సమావేశం 2023 ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము


దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు పరిశోధన, ఇన్నోవేషన్ పవర్ హౌస్ గా మారగల సామర్థ్యం ఉంది : రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

విద్యా రంగంలోని వారు ఉపాధ్యాయులు, విద్యా సంస్థల సామర్థ్యాన్ని నిర్మించేందుకు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అమృత్ పీధిని సాధికారం చేసేందుకు, ప్రపంచ శ్రేణి పరిశోధనను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నారు : శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

ఎన్ సిఆర్ఎఫ్, ఎన్ఆర్ఎఫ్ ప్రపంచానికి ప్రత్యేకించి దక్షిణ రాష్ట్రాలకు బెంచ్ మార్క్ గా నిలుస్తాయి : శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

ఐఐటి, ఎన్ఐ టి, ఐఐఎస్ఇఆర్, నైపర్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మందికి పైగా అధిపతులు సందర్శకుల సమావేశానికి హాజరయ్యారు

Posted On: 11 JUL 2023 7:11PM by PIB Hyderabad

రెండు రోజుల సందర్శకుల సమావేశం న్యూ ఢిల్లీలో మంగళవారం ముగిసింది. రాష్ట్రపతి భవన్ లో నేడు (జులై 11, 2023) ముగింపు సమావేశంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, విద్యా సఖ సహాయ మంత్రి శ్రీ సుభాష్ సర్కార్, విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఐఐటిలు, ఎన్ఐ టిలు, ఐఐఎస్ఇఆర్ లు, నైపర్ లు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మందికి పైగా అధిపతులు సందర్శకుల సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

ఈ సమావేశం థీమ్, సబ్ థీమ్ లు అన్నీ దేశానికి, యావత్ ప్రపంచానికి సరిపోతాయని రాష్ట్రపతి శ్రీమతి ముర్ము ముగింపు సమావేశంలో అన్నారు. అలాగే ఈ సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాలూ సంక్షిప్తంగాను, కార్యాచరణకు తగినవిగాను ఉన్నాయని ఆమె చెప్పారు. 

ఏ విధానం అయినా ఆచరణీయం అయినప్పుడే దాని ప్రాధాన్యం రుజువవుతుందని రాష్ట్రపతి అన్నారు.  విధానం సమర్థవంతంగా అమలు కావడంపై దాని ఫలితాలు  ఆధారపడి ఉంటాయన్నారు. ఉదాహరణకి "డిజిటల్ ఇండియా" కార్యక్రమం  భారత సమాజాన్ని డిజిటల్ గా సాధికారం చేసింది. దేశ  ఆర్ధిక  వ్యవస్థలో మార్పులు తెచ్చింది.  ఈ కార్యక్రమం ఫలితం అత్యంత ఆకర్షణీయం. సమర్థవంతమైన అమలు, ప్రజా భాగస్వామ్యం కారణంగానే అతి తక్కువ సమయంలో విప్లవాత్మకమైన మార్పు సాధ్యమయింది. ఉన్నత విద్యా రంగంలో కూడా అదే తరహా పరివర్తిత, సమ్మిళిత ఫలితం వస్తుందన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. 

కార్యక్రమం  సబ్ థీమ్ "పరిశోధన భాగస్వామ్యాలు, గుర్తింపులు" గురించి మాట్లాడుతూ సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదక శక్తులు ఇన్నోవేషన్, ఆధునిక ఆర్ అండ్ డి అని రాష్ట్రపతి అన్నారు.  ప్రధాన విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు ఇన్నోవేషన్ ఫై  దృష్టి పెట్టాయి. అవి పరిశోధన. అభివృద్ధికి మద్దతు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశాయి.  పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో కూడా దీన్ని వర్తింపచేయాల్సి ఉంది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు పరిశోధన, ఇన్నోవేషన్ పవర్ హౌస్ గా మారగల సమర్థత ఉందని ఆమె అన్నారు. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు సాంప్రదాయిక మౌలిక పరిశోధనను ప్రోత్సహిస్తూనే   స్టార్ట్ అప్ లు, ఆచరణీయ పరిశోధన, వాణిజ్యపరంగా విలువైన ఇన్నోవేషన్ రంగాలను ప్రోత్సహించడం ద్వారా పరివర్తన బాటలో నడిపిస్తూ ఉండడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరవుతున్న వివిధ సంస్థల అధినేతలు తమ సంస్థల్లో  పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉపయోగపడే  ఇన్నోవేషన్ ను  ప్రోత్సహిస్తారన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. 
అభివృద్ధి చెందిన దేశాలకు ఉన్నత విద్యా సంస్థలపరంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో చదవాలని ఆకాంక్షిస్తారని రాష్ర్టపతి అన్నారు.  భారత జాతీయ విద్యా విధానం - 20202లో కూడా అదే తరహా ప్రణాళిక ఆవిష్కరించారని ఆమె చెప్పారు. దాన్ని అనుసరించినట్టయితే మన ఉన్నత విద్యా సంస్థలు కూడా ప్రపంచ విద్యా కేంద్రాలుగా మారగలవని తెలిపారు. మన ఉన్నత విద్యా  సంస్థలు కూడా ప్రపంచ శ్రేణి మేథో కేంద్రాలుగా మారగలవన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. 

రాష్ర్టపతి ప్రసంగం కోసం ఈ లింక్  క్లిక్  చేయండి. 

విద్యారంగ ప్రముఖులు దేశంలో ఉపాధ్యాయులు, విద్యా సంస్థల సామర్థ్యాలు నిర్మించేందుకు, టెక్నాలజీని అనుసరించడం ద్వారా అమృత్  పీధిని సాధికారం చేసేందుకు, అందరి శ్రేయస్సు కోసం ప్రపంచ శ్రేణి పరిశోధనను ప్రోత్సహించేందుకు, పటిష్ఠమైన విద్యా రంగ పునాదులతో అమృత కాలంలో అతి పెద్ద అడుగు వేసేందుకు కట్టుబడి ఉన్నారని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్  తన ముగింపు ఉపన్యాసంలో అన్నారు. జాతీయ విద్యా విధానం 2020 భారతీయతను ప్రతిబింబించే పలు చర్యలు పునాదిగా పని చేస్తుందంటూ ఎన్ సిఆర్ఎఫ్, ఎన్ఆర్ఎఫ్ వంటివి  ప్రపంచ శ్రేయస్సుకు ప్రత్యేకించి ప్రపంచ దక్షిణ ప్రాంతాల శ్రేయస్సుకు బెంచ్  మార్క్  లు కాగలవని భావిస్తున్నామని నొక్కి చెప్పారు.

గత ఐదు సెషన్లలోనూ ఎన్ఇపి విజన్  సాకారం కావడానికి తీసుకోవలసిన ఉమ్మడి చర్యలు, భాగస్వామ్య నైపుణ్యం;  ఉమ్మడి సవాళ్లు, అవకాశాలు;  తిరుగులేని కట్టుబాటుపై సవివరంగా చర్చించారని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్  తెలిపారు. ప్రాచీన కాలంలో తక్షశిల, నలంద అంతర్జాతీయ విద్యా కేంద్రాలుగా ఉండడాన్ని ఉదాహరణగా చూపుతూ ఆ వైభవాన్ని తిరిగి పొందవలసిన సమయం ఇదేనన్నారు. నవభారత నిర్మాణం గురించి, విద్యాసంస్థల ప్రపంచ ప్రభావశీలత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఎన్ఇపి 2020 నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా సమాజాభివృద్ధిని, జాతీయాభివృద్ధిని మరింత వ్యూహాత్మక రంగాలకు అనుసంధానం చేసుకుంటూ విద్యా సంస్థలు ఏ విధంగా సరిహద్దులు విస్తరించగలవనే అంశంపై కూడా చర్చించినట్టు చెప్పారు. మానసికమైన, భావోద్వేగపరమైన ఆరోగ్యం ఏ విధంగా విద్యార్థులను ఉత్తేజితం చేస్తుంది, ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగల శక్తి విద్యార్థులకు అందించగలుగుతుంది; ఇటు క్యాంపస్  లోను, అటు జీవితంలోను కూడా రాణించగలిగే పరికరాలు, వనరులు ఆయా సంస్థలు ఏ విధంగా అందించగలుగుతాయి అనే అంశాలు ఆయన వివరించారు. సంఘటిత చర్యల ద్వారా విద్యా సంస్థలు ప్రతీ ఒక్క విద్యార్థిని చేయి పట్టుకుని నడిపించి, వారికి మార్గనిర్దేశం చేసినప్పుడే ఉన్నత శ్రేణి నాణ్యత గల బోధన ద్వారా నాణ్యమైన విద్య అందించడం సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు.

‘‘ఎన్ఇపి-2020 సాకారానికి చర్యలు’’ అనే అంశంపై ప్యానెల్  గోష్ఠికి విశ్వవిద్యాలయ గ్రాంట్ల కమిషన్  చైర్మన్  ప్రొఫెసర్  మామిడాల జగదీశ్  కుమార్ సారథ్యం వహించారు. ఈ సెషన్  లో విద్యా మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలన్నింటినీ సంక్షిప్తంగా వివరించిన అనంతరం విభిన్న విద్యా సంస్థలు చేపట్టిన విజయవంతమైన చర్యలు, అవి అమలు జరుగుతున్న తీరుకు సంబంధించిన కేస్  స్టడీలను పరిశీలనకు తీసుకున్నారు. ఈ సెషన్  లో ఐఐటి, కాన్పూర్  డైరెక్టర్   ప్రొఫసర్  అభయ్ కరాండికర్;  ఆంధ్రప్రదేశ్  లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్  చాన్సలర్  ప్రొఫెసర్ టివి కట్టిమణి తమ అధ్యయన పత్రాలను సమర్పించారు. జెఎన్  యు వైస్  చాన్సలర్  ప్రొఫెసర్  శాంతిశ్రీ ధూళిపూడి పండిట్  ఈ సెషన్  కు మోడరేటర్  గా వ్యవహరించారు. ఉన్నత విద్యా సంస్థలు మరింతగా టెక్నాలజీ అనుసంధానతపై దృష్టి సారించాలన్న అంశంపై చర్చించారు. జాతీయ డిజిటల్  విశ్వవిద్యాలయం (ఇ-విశ్వవిద్యాలయ) దేశంలోని అధిక శాతం జనాభాకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తుందని భావించారు. పలు సంస్థలు అంతర్జాతీయకరణకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచంలోని ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాల మధ్య విద్యాసహకారం పెంచుకోవలసిన, భారతదేశంలో విద్యాభ్యాసానికి విదేశీ విద్యార్థులను ఆకర్షించవలసిన అవసరం ఉన్నట్టు గుర్తించారు. మన విశ్వవిద్యాలయాలు పరిశోధన సామర్థ్యాలు మరింతగా విస్తరించుకోవాలి. స్వయం-సమృద్ధ జాతి నిర్మాణంలో భాగంగా ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్  కు అనుకూలమైన వాతావరణం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 

‘‘అంతర్జాతీయకరణ చర్యలు, జి 20’’ అనే అంశంపై జరిగిన రెండో సెషన్  లో ప్యానెల్  కు బెనారస్  హిందూ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్  ప్రొఫెసర్  సుధీర్.కె.జైన్  సారథ్యం వహించారు. ఢిల్లీ ఐఐటి డైరెక్టర్  ప్రొఫెసర్  రంగన్  బెనర్జీ అంతర్జాతీయకరణ ప్రయత్నాలు, విజయాలు, సవాళ్లు, ముందున్న దారి అనే అంశంపై ప్రెజెంటేషన్  ఇచ్చారు. రూర్కెలా ఎన్ఐటి డైరెక్టర్  ప్రొఫెసర్  కె.ఉమామహేశ్వరరావు భారతదేశంలో విద్యావకాశాలు, సవాళ్లు, అంతర్జాతీయకరణకు ముందున్న దారి అనే అంశంపై ప్రెజెంటేషన్  ఇచ్చారు. ఐఐటి (బిహెచ్  యు, వారణాసి) డైరెక్టర్  ప్రొఫెసర్  ప్రమోద్  కుమార్  ఈ సెషన్  కు మోడరేటర్  గా వ్యవహరించారు. మన విద్యా  సంస్థలు ప్రపంచ శ్రేణికి విస్తరించడానికి కృషి  చేస్తున్న నేపథ్యంలో మన ముందున్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై  ఈ సెషన్  లో సవివరంగా చర్చించారు. అంతర్జాతీయ విద్యార్థులు, ఫ్యాకల్టీ రాకపోకలను ప్రోత్సహించేందుకు, పరిశోధన సహకారాలు పెంచుకునేందుకు, మన సంస్థల అంతర్జాతీయ గుర్తింపు నిర్మాణానికి, భారత విద్యా వ్యవస్థలో భారతదేశాన్ని ప్రవేశపెట్టగల వ్యూహాత్మక చర్యలపరంగా విలువైన సూచనలు చేశారు.

‘‘పరిశోధన సహకారం, గుర్తింపు’’ అనే అంశంపై జరిగిన మూడో సెషన్  కు అంతరిక్ష కమిషన్ మాజీ చైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఇస్రో చైర్మన్  ప్రొఫెసర్ కె.రాధాక్రిష్ణన్  ప్యానెల్  అధిపతిగా వ్యవహరించారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఫ్యాకల్టీ, విద్యార్థులు పరిశోధనకు చేపట్టిన ప్రాజెక్టులు కొన్నింటిని ఈ సెషన్  లో వివరించారు. వ్యక్తిగతంగా, బృందాలుగా కొంతమంది చేసిన సేవల వివరాలు కూడా ఈ సెషన్  లో వివరించారు. ప్రాముఖ్యత కలిగిన వివిధ విద్యా సంస్థలు, విద్యా  సంస్థలకు అందించిన నిధులు తెచ్చిన సానుకూల మార్పుల గురించి చర్చించడంతో పాటు ఆయా  సంస్థలు చేసిన సేవలను గుర్తించి అవార్డులు అందచేశారు. బెంగళూరు ఐఐఎస్  సి డైరెక్టర్  ప్రొఫెసర్  గోవిందన్  రంగరాజన్;  హైదరాబాద్  విశ్వవిద్యాలయం వైస్  చాన్సలర్ ప్రొఫెసర్ బసుత్కర్.జె.రావు విశేషమైన ప్రెజెంటేషన్లు ఇచ్చారు. జామై మిలియా ఇస్లామియా వైస్  చాన్సరల్  ప్రొఫెసర్ నజ్మా అఖ్తర్  ఈ ప్యానెల్  మోడరేటర్ గా వ్యవహరించారు. సైన్స్, టెక్నాలజీ పురోగతిలో వేగం, గత దశాబ్ది కాలంలో ‘‘మార్పునకు దోహదపడే టెక్నాలజీలు’’, ‘‘నాలుగో పారిశ్రామిక విప్లవం’’ లో జరుగుతున్న పురోగతిపై చర్చించారు. వాతావరణ మార్పులు, ప్ర‌కృతి వైపరీత్యాలు కల్పిస్తున్న అవరోధాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎస్ డిజి 2030కి అనుగుణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం ప్రపంచశ్రేణిలో జరుగుతున్న ప్రచారం గురించి కూడా చర్చించారు. మన విద్యా  సంస్థలు, ఆర్ అండ్  డి భాగస్వాముల నిజాయతీతో కూడిన డిమాండు, జాతీయ అవసరాల ప్రాధాన్యతపై పరిశోధన ప్రాధాన్యత, ఎక్సలెన్స్  కు భరోసా తక్షణ అవసరమని గుర్తించారు. 

‘‘వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితత్వం, సంక్షేమం’’ అనే అంశంపై జరిగిన నాలుగో సెషన్ కు ఐఐటి మద్రాస్  డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి సారథ్యం వహించారు. డిఇఐ, వెల్ నెస్ ప్రయత్నాలపై వివిధ సంస్థలు తీసుకున్న చర్యలపై ఈ సెషన్  లో చర్చించారు. డిఇఐ తీసుకున్న చర్యల్లో లింగ వైరుధ్యం, శారీరకంగా సవాలును ఎదుర్కొంటున్న వారి జీవనం సరళం చేసేందుకు చేపట్టిన చర్యలు, మహిళా భాగస్వామ్యం పెంచడం ద్వారా వారిని నాయకత్వ స్థానంలో నిలిపేందుకు చర్యలు వంటి అంశాలపై ఇందులో చర్చించారు. ఐఐఎస్ఇఆర్ తిరుపతికి చెందిన ప్రొఫెసర్  శంతను భట్టాచార్య, ఎన్ఐటి కాలికట్ డైరెక్టర్  ప్రొఫెసర్  ప్రసాద్ కృష్ణ సెషన్  థీమ్  పై  సవివరమైన ప్రెజెంటేషన్లు ఇచ్చారు. ఎన్ఇహెచ్  యు వైస్ చాన్సలర్  ప్రొఫెసర్  ప్రభాశంకర్  శుక్లా  ఈ సెషన్  కు మోడరేటర్  గా వ్యవహరించారు. మన విద్యార్థులు, ఫ్యాకల్టీ సంక్షేమం, అభివృద్ధి, ఆనందం కోసం అందించిన విస్తృత శ్రేణి సలహాలు చర్చల్లో వెలుపలికి వచ్చాయి. జాతీయ విద్యా విధానంలో సూచించిన మేరకు స్థూల ఎన్  రోల్  మెంట్  మెరుగుపరచడం, డ్రాపౌట్ల సంఖ్య తగ్గించడంలో ఉన్నత విద్యా  సంస్థల పాత్రపై కూడా చర్చలో దృష్టి కేంద్రీకరించారు. 

‘‘అమృత కాల ప్రణాళికలు, కార్యాచరణలు’’ అనే అంశంపై జరిగిన ఐదో సెషన్  లో పాల్గొన్న ప్యానెల్ కు ఎఐసిటిఇ చైర్మన్  టి.జి.సీతారామ్ సారథ్యం వహించారు. ఎంటర్  ప్రెన్యూర్  షిప్, ఇన్నోవేషన్ కు ప్రాధాన్యం ఇస్తూ వ్యూహాత్మక ప్రణాళికలపై సెషన్  లో చర్చించారు. ‘‘2047 నాటికి టెక్నాలజీ సూపర్  పవర్  గా ఇండియా’’ అనే అంశంపై చర్చ జరిగింది. ప్రభుత్వ విధానంపై వర్క్  షాప్, స్టార్టప్  ల విజయ గాథలు; సూపర్ కంప్యూటింగ్,  సైబర్  ఫిజికల్ వ్యవస్థలు, సెమీ కండక్టర్ల కోసం చేపట్టిన జాతీయ కార్యక్రమాలు;  విద్యావేత్తల పాత్రపై సెషన్  లో చర్చించారు. ఐఐటి గాంధీనగర్  ప్రొఫెసర్  రజత్  మోనా, ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్  ప్రొఫెసర్  యోగేశ్ సింగ్ అత్యున్నత నాణ్యత గల విద్య, రాబోయే 25 సంవత్సరాలకు నాయకత్వం అనే అంశంపై చర్చించారు. ఐఐటిలు, డియులు అనుసరిస్తున్న ఉత్తమ ప్రమాణాల గురించి కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.  ఈ సెషన్  కు ఐఐటి రోపార్  డైరెక్టర్  ప్రొఫెసర్ రాజీవ్ అహూజా మోడరేటర్  గా వ్యవహరించారు. ఎన్ఇపి 2020లో పొందుపరిచిన విధంగా భారత విద్యారంగం అద్భుత వృద్ధి  అవకాశాలపై చర్చలు కేంద్రీకరించారు. స్వభావసిద్ధంగా పరస్పర విభాగాల భాగస్వామ్యం గల, పరిశ్రమ అవసరాలను తీర్చగల కొత్త కార్యక్రమాలను అధిక శాతం ఉన్నత విద్యా సంస్థలు ప్రారంభించాయి. డేటా విలువను పక్షపాత రహితంగా గుర్తింపు, మదింపు చేయగల వ్యవస్థ, ‘‘పీర్  సోర్సింగ్’’తో కూడిన పారదర్శకమైన ర్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మాత్రమే భారత విద్యా వ్యవస్థ నాణ్యత మరింతగా పెరుగుతుందని నిర్ణయానికి వచ్చారు. 

రాష్ర్టపతి 2023 జూలై 10వ తేదీన రాష్ర్టపతి భవన్  లో సందర్శకుల సదస్సు 2023ని ప్రారంభించారు. వ్యక్తులు, సమాజం, దేశ పురోగతికి విద్య అత్యంత అవసరమని ప్రారంభోపన్యాసంలో రాష్ర్టపతి అన్నారు. ఈ లక్ష్యంతోనే సామాజికంగా, ఆర్థికంగా బలహీన వర్గాలకు సమాన,  సమ్మిళిత ఉన్నత విద్య జాతీయ విద్యా విధానం - 2020లోని అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ఆమె అన్నారు. సందర్శకుల సదస్సు 2023 సందర్భంగా వివిధ విద్యా సంస్థల అధిపతులను ఆమె కలిశారు. 

సందర్శకుల సదస్సు 2023 సందర్భంగా రాష్ర్టపతి భవన్  లో వివిధ విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు/లబ్ధిదారులు రాష్ర్టపతిని కలిశారు. చర్చల సందర్భంగా విద్య, సమాజం కోసం వారు చేసిన సేవలను రాష్ర్టపతి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్  సహ వ్యవస్థాపకుడు శ్రీ రాకేశ్  గంగ్వాల్; యమ్ చైనా మాజీ సిఇఓ శ్రీ ముకేశ్  పంత్;  మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడు శ్రీ సుబ్రతో బాగ్చి;  యాక్సెల్  ఇండియా సహ వ్యవస్థాపకుడు శ్రీ  ప్రశాంత్  ప్రకాశ్;   కెపాయింట్  టెక్నాలజీస్ చైర్మన్,  సహ వ్యవస్థాపకుడు డాక్టర్  శ్రీధర్  శుక్లా, సిటియస్  టెక్  సిఇఓ,  సహ వ్యవస్థాపకుడు శ్రీ రిజ్వాన్  కోయిటా;  ఐవి కాప్  వెంచర్స్  అడ్వైజర్స్  ప్రైవేట్  లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్టనర్ శ్రీ విక్రమ్  గుప్తా;  టిటికె ప్రెస్టిజ్  చైర్మన్ శ్రీ టిటి జగన్నాథన్; ఇనామ్ సహ వ్యవస్థాపకుడు, ఫ్లేమ్ విశ్వవిద్యాలయం గవర్నర్ల బోర్డు సభ్యుడు శ్రీ నెమిష్  షా;  హెచ్  సిఎల్ టెక్నాలజీస్  చైర్ పర్సన్, శివనాడార్  విశ్వవిద్యాలయం ట్రస్టీ శ్రీమతి రోష్ని నాడార్;  పిరామల్ గ్రూప్  చైర్మన్ శ్రీ అజయ్  పిరామల్  కూడా తమ జీవన సహచరులతో కలిసి  ఈ సంభాషణల్లో పాల్గొన్నారు. 

ప్రారంభ కార్యక్రమంలో సందర్శకుల అవార్డులు 2021ని రాష్ట్రపతి బహూకరించారు. స్కూల్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్, దక్షిణ బిహార్ కేంద్రీయ విశ్వవిద్యాలయం  ప్రొఫెసర్  వేంకటేశ్  సింగ్ కు సిలికాన్  ఫైబర్ షీట్  ఉపయోగించి రెసిస్టివ్ ప్లేట్  చాంబర్ డిటెక్టర్ రూపొందించినందుకు ‘ఇన్నోవేషన్’ అవార్డు;  సాఫ్ట్  మాటర్ అండ్ లిక్విడ్  క్రిస్టల్  అనే అంశంపై చేసిన కృషికి యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్  ఆఫ్ ఫిజిక్స్ కు చెందిన ప్రొఫెసర్  సూరజిత్ ధార ‘రీసెర్చ్  అండ్  ఫిజికల్  సైన్సెస్’ అవార్డు;  సాగర్  కు చెందిన డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయకు చెందిన ప్రొఫెసర్  మహమ్మద్  లతీఫ్  ఖాన్   తూర్పు హిమాలయాలు, సెంట్రల్ ఇండియాలో జీవవైవిధ్యంపై అవగాహన, ఆర్ఇటి (అరుదైన, ప్రమాదం ఎదుర్కొంటున్న) మొక్కల పునరుజ్జీవం అనే అంశంపై  ‘బయోలాజికల్  సైన్సుల్లో పరిశోధన’ అవార్డు;  ఫెర్రో ఎలక్ర్టిక్  థిన్  ఫిలింస్  కు ఫ్రీక్వెన్సీ  ట్యూనబుల్  మైక్రోవేవ్  డివైసెస్  లో పరిశోధనకు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్  ఆఫ్  ఫిజిక్స్ కు చెందిన  ప్రొఫెసర్ కెసి జేమ్స్  రాజు ‘పరిశోధన అభివృద్ధి’ అవార్డు అందుకున్నారు. మాలిక్యులర్  సిస్టమ్,  మెటీరియల్స్  లో  ఫొటో ఎక్సైటేషన్  పై ఏర్పడిన స్వల్పకాలం జీవించే కెమికల్  స్పెసీస్  డైనమిక్స్, స్పెక్ర్టోస్కోపీపై పరిశోధనకు (ఫిజికల్  సైన్సులు) యూనివర్శిటీ ఆఫ్  హైదరాబాద్  లోని స్కూల్  ఆఫ్  కెమిస్ర్టీకి చెందిన ప్రొఫెసర్ అనునయ్  సమంతకు  2020 సంవత్సరానికి 6వ విజిటర్స్  అవార్డును రాష్ర్టపతి బహూకరించారు. 

 

****
 


(Release ID: 1938835)
Read this release in: English , Urdu , Hindi