విద్యుత్తు మంత్రిత్వ శాఖ

73 గిగా వాట్లు దాటిన ఎన్‌టిపిసి గ్రూప్ వ్యవస్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం

Posted On: 07 JUL 2023 4:09PM by PIB Hyderabad

భారతదేశంపు అగ్రగామి సమగ్ర విద్యుత్ ఉత్పత్తిదారు అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 73,024 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో ఎన్‌టిపిసికి చెందిన పవర్ ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 57,038 మెగావాట్లు. ఎన్‌టిపిసి అనుబంధ సంస్థలు మరియు జాయింట్ వెంచర్‌ల యాజమాన్యంలోని ప్లాంట్ల సామర్థ్యం 15,986 మెగావాట్లుగా నిలిచింది.  బీహార్లోని బార్హ్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ యొక్క స్టేజ్-I (3 x 660 మెగావాట్లుయొక్క 660 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్-2 ప్రారంభించడంతో సమూహం యొక్క మొత్తం సామర్థ్యం 73 గిగా వాట్లు దాటిందిఇందులో 50 ఎన్‌టిపిసి స్టేషన్లు (26 బొగ్గు ఆధారిత స్టేషన్లు, 7 గ్యాస్ ఆధారిత స్టేషన్లు, 1 హైడ్రో స్టేషన్, 16 పునరుత్పాదక ఇంధన ఆధారిత స్టేషన్లుమరియు జాయింట్ వెంచర్లు మరియు అనుబంధ సంస్థల ద్వారా 39 స్టేషన్లు (9 బొగ్గు ఆధారిత, 4 గ్యాస్ ఆధారిత, 8 హైడ్రో మరియు 18 పునరుత్పాదక శక్తి ఆధారితమైనవిస్టేషన్లుఉన్నాయి. దేశానికి విశ్వసనీయమైన మరియు సరసమైన విద్యుత్‌ను అందించాలనే ఎన్‌టిపిసి నిబద్ధతను ఈ సాఫల్యం బలపరుస్తుంది. ఇంకా, 2032 నాటికి 60,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఎన్‌టిపిసి భారతదేశపు అతిపెద్ద సమీకృత పవర్ యుటిలిటీఇది దేశ విద్యుత్ అవసరాలలో 1/4 వంతును అందిస్తుంది. థర్మల్హైడ్రోసోలార్ మరియు విండ్ పవర్ ప్లాంట్ల యొక్క విభిన్న పోర్ట్ఫోలియోతోకంపెనీ ఉత్తమ పద్ధతులను అవలంబించడానికిఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు పచ్చటి భవిష్యత్తు కోసం స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతలను స్వీకరించడానికి కట్టుబడి ఉంది.

***

 



(Release ID: 1938114) Visitor Counter : 149