ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్య మంత్రిత్వ శాఖ హిందీ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


హిందీని ప్రోత్సహించి ఎక్కువగా వాడటం వల్ల వైవిధ్యం ఉన్న దేశంలో జాతీయ స్వరంతో సులువుగా సమాచారం వ్యాప్తి చేయవచ్చు.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 03 JUL 2023 2:40PM by PIB Hyderabad

"హిందీని ప్రోత్సహించి ఎక్కువగా వాడటం వల్ల  వైవిధ్యం ఉన్న దేశంలో జాతీయ స్వరంతో సులువుగా సమాచారం వ్యాప్తి చేయవచ్చు" అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ రోజు జరిగిన ఆరోగ్య మంత్రిత్వ  శాఖ హిందీ సలహా మండలి సమావేశంలో  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు  ప్రొఫెసర్‌ ఎస్‌పీ సింగ్‌ బాఘేల్‌, డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వ్యవహారాల్లో హిందీ వాడకాన్ని ఎక్కువ చేసి, హిందీకి  కల్పించడానికి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల్లో హిందీ సలహా మండలి ఏర్పాటయింది. ప్రతి రెండు సంవత్సరాలకు కనీసం ఒకసారి మండలి సమావేశం కావాల్సి ఉంటుంది. 

మండలి సమావేశంలో మాట్లాడిన డాక్టర్ మాండవీయ జాతీయ భాష ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలన్నారు.' భాష భావ వ్యక్తీకరణకు ఒక వేదికను అందిస్తుంది.  బాషా వల్ల జాతీయ భావం పెంపొంది అందరూ కలిసి పనిచేయడానికి భాష ఒక సాధనంగా పనిచేస్తుంది." అని అన్నారు. " ప్రాంతీయ భాషలను ఉపయోగించవచ్చు. అయితే, జాతీయ భాషగా హిందీని గుర్తించి గౌరవించాలి. జాతీయ భావం పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరు హిందీ ని ఉపయోగించాలి"  అని మంత్రి పేర్కొన్నారు. 

అధికార కార్యక్రమాల్లో హిందీ వాడకాన్ని ఎక్కువ చేయడానికి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చర్యలను డాక్టర్ మాండవీయ వివరించారు. 

అధికార కార్యకలాపాల్లో హిందీ ని వాడాలని డాక్టర్ మాండవీయ సూచించారు. " హిందీ ని అధికార భాషగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖకి చెందిన అధికార భాష శాఖ జారీ చేసిన మార్గదర్శలను అమలు చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది. వార్షిక ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు అమలు చేస్తుంది. జాతీయ సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా   హిందీని మంత్రిత్వ శాఖ గుర్తించింది. హిందీ మన సామూహిక జాతీయతను ప్రతిబింబిస్తుంది." అని డాక్టర్ మాండవీయ అన్నారు. 

 కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ మాట్లాడుతూ హిందీ మధురమైన, సులభమైన భాష అని అన్నారు.మన సంప్రదాయం వారసత్వంలో భాగమైన హిందీ ని వాడకాన్ని  ప్రోత్సహించాలన్నారు. ప్రజలతో మమేకం అవడానికి హిందీ ని ఉపయోగించాలన్నారు. 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్‌ ఎస్‌పీ సింగ్‌ బాఘేల్‌ మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ అధికారిక పనిలో హిందీ వినియోగాన్ని క్రమంగా పెంచాలని కోరారు. అధికారుల్లో హిందీ వాడకంపై మెరుగైన అవగాహన, ప్రచారం కల్పించాలని ఆయన సూచించారు. 

హిందీ వాడకాన్ని ఎక్కువ చేయడానికి సమావేశంలో పాల్గొన్న వారు అనేక సూచనలు, సలహాలు అందించారు. అన్ని శాఖల ఔషధాలకు - అల్లోపతి, హోమియోపతి మరియు ఆయుర్వేదం - హిందీలో ముఖ్యంగా హిందీ మాట్లాడే ప్రాంతాల్లో  పేర్లు పెట్టాలని సూచించారు. హిందీలో మందులు రాసేలా డాక్టర్లను ప్రోత్సహించాలని కూడా సూచించారు. హిందీలో మందుల పేర్లు రాయడం వల్ల ప్రజలకు సులువుగా అర్థం అవుతుంది.   హిందీ వాడకాన్ని ప్రోత్సహిస్తుందని సూచించారు.  ప్రజలు హిందీలో మాట్లాడటానికి గర్వపడేలా చూడాలని అన్నారు.  ఆంగ్లం మాత్రమే ఆధునిక భాష అనే అభిప్రాయాన్ని ఎదుర్కోవడానికి అధికారిక ప్రయోజనాల కోసం హిందీ వాడకాన్ని మెరుగుపరచాలని కూడా  సూచనలు అందాయి. మంత్రిత్వ శాఖల్లో అన్ని పరిపాలన కార్యకలాపాలు హిందీలో జరిగేలా చూడాల్సిన అవసరాన్ని సమావేశం గుర్తించింది.   భారతదేశమంతటా ఇటువంటి సమావేశాలు నిర్వహించి  గర్వంతో హిందీలో మాట్లాడేలా ప్రజలను ప్రోత్సహించాలని    కొంత మంది సభ్యులు సూచించారు. 

సమావేశంలో డాక్టర్ అనిల్ అగర్వాల్, పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ), శ్రీ గులాం అలీ, పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ), శ్రీ ప్రతాప్ రావు జాదవ్, పార్లమెంట్ సభ్యులు (లోక్ సభ)  పాల్గొన్నారు.  ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఐసిఎంఆర్ డిజి డాక్టర్ శ్రీ సుధాన్ష్ పంత్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ శ్రీమతి రోలీ సింగ్,  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  అదనపు కార్యదర్శి  శ్రీ జైదీప్ కుమార్ మిశ్రాఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ,శ్రీ రాజీవ్ మాంఝీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్, ఎయిమ్స్ (న్యూఢిల్లీ) డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. .

 

***


(Release ID: 1937069)