ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒడిశా లోని గంజమ్ జిల్లా లో జరిగిన బస్సు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు


Posted On: 26 JUN 2023 12:12PM by PIB Hyderabad

ఒడిశా లోని గంజమ్ జిల్లా లో జరిగిన ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర  మోదీ వ్యక్తం చేశారు.  మృతుల దగ్గరి బంధువుల కు లక్షల రూపాయల చొప్పున మరియు గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి  ఒక ట్వీట్ లో -

‘‘ఒడిశా లోని గంజమ్ జిల్లా లో బస్సు దుర్ఘటన జరిగిన సంగతి తెలిసి బాధ పడ్డాను.  తమ ప్రియతముల ను కోల్పోయిన వారి కి సంతాపాన్ని తెలియజేస్తున్నాను.  ఈ రహదారి దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరిత గతి న పునఃస్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను.  మృతుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది.  ఈ బస్సు  దుర్ఘటన లో క్షతగాత్రులు అయిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొన్నారు.

 


***


DS/TS



(Release ID: 1935330) Visitor Counter : 145