azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఈజిప్టు అత్యున్నత పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర హోం , సహకార మంత్రి శ్రీ అమిత్ షా


రాజనీతిజ్ఞుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కీర్తి కిరీటంలో ఈజిప్టు అత్యున్నత గౌరవం 'ది ఆర్డర్ ఆఫ్ నైల్ అవార్డు' మరో కలికిత రాయి గా నిలుస్తుంది.

విదేశాల నుంచి అత్యధిక సంఖ్యలో అవార్డులు అందుకున్న ఏకైక భారత ప్రధాని మోదీ.. శ్రీ షా

Posted On: 25 JUN 2023 6:20PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి  ఈజిప్టు అత్యున్నత పురస్కారం లభించడం పట్ల  కేంద్ర హోం , సహకార మంత్రి శ్రీ అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. 

ప్రధానమంత్రికి అభినందనలు తెలుపుతూ  శ్రీ అమిత్ షా ట్వీట్ చేశారు. “ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  గొప్ప  రాజనీతిజ్ఞుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయనకు ఇప్పుడు మరొక గౌరవంతో దక్కింది.  ఈజిప్ట్ తన అత్యున్నత రాష్ట్ర గౌరవం 'ది ఆర్డర్ ఆఫ్ నైల్ అవార్డు' ను ప్రధానమంత్రి కి ప్రదానం చేసింది. ఇతర దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో అవార్డులు అందుకున్న ఏకైక భారత ప్రధాని శ్రీ మోడీ" అని శ్రీ షా తన ట్వీట్  లో పేర్కొన్నారు.  మాత్రమే.

 

*****


(Release ID: 1935320) Visitor Counter : 202
Read this release in: English , Urdu , Marathi , Manipuri