సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యుపిఎ ప్రభుత్వం 2004 నుంచి 2013 మధ్య 9 ఏళ్ళ కాలంలో 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది :డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 9 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఉపాధి కల్పన గణనీయంగా పెరిగింది : డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన పాలనా సంస్కరణల వల్ల గత 9 సంవత్సరాలలో పరిస్థితి గుణాత్మకంగా , పరిమాణాత్మకంగా మెరుగు పడింది : డాక్టర్ జితేంద్ర సింగ్

“ప్రధానమంత్ర శ్రీ నరేంద్ర మోదీ యువతను 2047 దార్శనికతకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. వీరిని అంతర్జాతీయ సవాళ్లకు తట్టుకునే విధంగా , అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే విధంగా భవిష్యత్ కు సిద్ధం
చేసి,

వీరు ప్రపంచానికి నాయకత్వం వహించేలా తీర్చిదిద్దుతున్నారు. ’’

Posted On: 19 JUN 2023 5:34PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 సంవత్సరాల మధ్య 9 సంవత్సరా వ్యవధిలో  సుమారు 9 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగా, 2004 నుంచి 2013 మధ్య 9 సంవత్సరాల కాలంలో
యుపిఎ ప్రభుత్వం కేవలం 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కల్పించిందని,కేంద్ర  శాస్త్ర,సాంకేతిక వ్యవహారా శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, అణు ఇంధనం,
అంతరిక్ష, సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆయన ఈరోజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈవిషయం చెప్పారు.
 ఈ సందర్భంగా ఆయన తన వాదనను  యుపిఏ పాలనలోన గణాంకాలను పోలుస్తూ  గట్టిగా సమర్థించుకున్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ తొమ్మిది సంవత్సరాల పాలనలో చెప్పుకోదగిన స్థాయిలో ఉపాధి కల్సన పెరిగిందని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి ప్రారంభించిన ఆరు రోజ్గార్ మేళాలలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరిగిందన్నారు.
ప్రతి సారి నిర్వహించిన రోజ్గార్ ప్రచార కార్యక్రమంలో ,ఒక్కోసారి సుమారు 70 వేలకు పైగా నియామక పత్రాలు అందజేసినట్టు తెలిపారు.
ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, గత 9 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వంలోని  8,82,191 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసినట్టు తెలిపారు.
యుపిఎ ప్రభుత్వం తొలి 9 సంవత్సరాలలో చేపట్టిన నియామకాలు 6,02,045 మాత్రమే నని ఆయన తెలిపారు.
ప్రభుత్వానికి చెందిన మూడు ప్రధాన ప్రభుత్వ ఏజెన్సీలైన యుపిఎస్సి, 2014–23 సంవత్సరాల మధ్య 50,906 ఉద్యోగ నియామకాలు చేయగా
2004 –13 మధ్య ఈ సంస్థ చేపట్టిన నియామకాలు 45,431 మాత్రమేనని చెప్పారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ –ఎస్.ఎస్.సి సంస్థ ఇదే కాలంలో 4,00691 నియామకాలు చేయగా , యుపిఎ  9 ఏళ్ల పాలనలో జరిగిన నియామకాలు,2,07,563 మాత్రమే నని చెప్పారు.
ఆర్.ఆర్.బిలు 2004 నుంచి 2013 మధ్య యువతకు 4,30,592 ఉద్యోగాలు ఇవ్వగా యుపిఎ పాలనలో 9 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 3,47,251 అని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా , ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదిగేలా ప్రధానమంత్రి , యువతలో చైతనయం తీసుకువచ్చారని మంత్రి చెప్పారు.
గతంలో కేవలం 350 స్టార్టప్లు ఉండగా ప్రస్తుతంంం లక్ష స్టార్టప్లు ఉన్నాయని చెప్పారు. అరోమా మిషన్ను ప్రారంభించడం జరిగిందని,
గతంలో అగరుబత్తుల పుల్లలు ఆగ్నేయాసియా నుంచి దిగుమతి చేసుకునే వారని, కానీ ఇప్పుడు దేశంలోని వెదురు సాగును ఇండియన్ ఫారెస్ట్ చట్టం 1927 పరిధి నుంచి చట్ట సవరణ ద్వారా తప్పించడం, దిగుమతి సుంకాన్ని 25 శాతం పెంచడంతో, వెదురు పరిశ్రమ అవకాశాలు పెరిగాయని, ఇది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఖాదీ ప్రస్తుతం డిజైనర్ ఐటమ్గా మారిందని, లక్ష కోట్ల టర్నోవర్ సాధిస్తోందని చెప్పారు.
 ‘‘అంతర్జాజాతీయ సవాళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలు, అంతర్జాతీయ పారామితులకు అనుగుణంగా మీరు జీవనం గడుపుతుండవచ్చు. ఆ రకంగా, ప్రధానమంత్రి,
2047 దార్శనికతకు వీలుగా యువతను  మిగిలిన ప్రపంచానికి నాయకత్వం వహించేలా సంసిద్ధులను చేస్తున్నారు ”అని ఆయన తెలిపారు. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఒక వరంగా ప్రధానమంత్రి గట్టి విశ్వాసంతో ఉన్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

“నూతన ప్రత్యామ్నాయాలు రూపుదిద్దుకున్నాయి. గతంలో కేవలం 50 బయోటెక్ స్టార్టప్లు ఉండగా ప్రస్తుతం అవి
6 వేల కు చేరుకున్నాయి. హిమాలయన్ ప్రాంతానికి అరోమా మిషన్ను ప్రారంభించడం జరిగింది.
ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రకటించిన డీప్ సీ మిషన్, ఆర్ధిక వ్యవస్థకు అదనపు విలువను జోడిస్తుంది. ఇది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే కాక,
మనకు అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఇస్తుంది.”అని ఆయన తెలిపారు.
పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టడమే కాక, గత ఏడాది 9 వేల మంది ఉద్యోగులకు బల్క్ ప్రమోషన్లు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఏడాది 4 వేల ప్రమోషన్లు చేపట్టనున్నట్టు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాల వల్ల ప్రమోషన్లు నిలిచిపోయాయని, డిపార్టమెంటల్ జాప్యాలు, న్యాయపరమైన అంశాల కారణంగా నిలిచిపోయాయని,
ఇది ఉద్యోగులలో ఉత్సాహం కోల్పోయేలా చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల వల్ల
 ఈ అడ్డంకులు తొలగడమే కాకుండా ఇది   సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని చూపుతున్నదని అన్నారు.

ప్రధానమంత్రి తీసుకువచ్చిన పాలనాపరమైన సంస్కరణల కారణంగా గత 9 సంవత్సరాలలో పరిమాణాత్మక, గుణాత్మక మార్పులు వచ్చినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
‘అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రధానమంత్రి 2015 ఆగస్టు 15న ఎర్రకోట బురుజుల నుంచి చేసిన ప్రసంగంలో
ప్రభుత్వంలో దిగువస్థాయిలో జరిగే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ ప్రకటన చేశారు. మూడు నెలల  లోనే డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్
ఈ సంస్కరణను  అమలు  చేసింది. ఫలితంగా 2016 ఫిబ్రవరి 1 నుంచి గ్రూప్ సి పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దు చేయడం  జరిగింది. ఈ విషయంలో కొన్ని రాష్ట్రాలు బాగా సమయం తీసుకున్నాయి.
ఈ సంస్కరణవల్ల మెరిట్కు గుర్తింపు రావడంతోపాటు, పారదర్శకతకు వీలు కలిగింది. లంచగొండితనం, పక్షపాతం, ఒకరికి అనుకూలంగా వ్యవహరించడం వంటి అనర్థాలు లేకుండా పోయాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

.“అలాగే, వలస పాలన కాలం నాటి అటెస్టేషన్ విధానాన్ని తొలగించి , స్వీయ ధృవీకరణను తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన
కేవలం కొద్ది నెలల లోనే, ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014 మే 26న అధికారం చేపట్టిన కొద్ది నెలల లోనేసెప్టెంబర్లో  ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆ రకంగా ప్రభుత్వం యువతపై విశ్వాసం ఉంచింది. మిషన్ కర్మయోగి కింద ప్రభుత్వం సామర్ధ్యాల పెంపునకు చర్యలు చేపట్టింది.
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, అలాగే ఇప్పటికే పనిచేస్తున్నవారి సామర్ధ్యాల పెంపునకు చర్యలు చేపట్టినట్టు డాక్టర్ జితేంద్ర తెలిపారు.
అవినీతిని ఎంతమాత్రం సహించేది లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారన్నారు.‘‘ లంచం ఇచ్చేవారిని కూడా అవినీతి నిరోధక చట్టం పరిధికిందికి తీసుకువచ్చేందుకు
పిసిఎ 1988 చట్టాన్ని 30 సంవత్సరాల తర్వాత సవరించడం జరిగిందని ఆయన చెప్పారు.దీనివల్ల సత్యసంధత,
 నిజాయితీ కలిగిన అధికారులు ఎలాంటి ఒత్తిడి లేకుండా నిబద్ధతతో పనిచేయడానికి వీలు కలుగుతుందని ఆయన అన్నారు.

మరో  ముఖ్యమంఐన సంస్కరణ, ప్రభుత్వంలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగానికి సంబంధించినది.
“ ఇతర  దేశాలు సిపిజిఆర్ఎఎంఎస్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాయి. ఇంతకుముందు సంవత్సరానికి రెండు లక్షల ఫిర్యాదులు
వస్తుంటే, ఈ వ్యవస్థను కంప్యూటరైజ్ చేయడం ,ఆన్లైన్ సదుపాయం కల్లపించడం, 5 రోజుల పరిమితి విధింపు, వంటి వాటివల్ల
ఇప్పుడు ఏడాదికి 20 లక్షల ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం జరిగింది.
నిర్ణీత వ్యవధిలోగా ఫిర్యాదుల పరిష్కారానికి వీలు కల్పించడం జరిగింది. ఫిర్యాదు అనంతరం తగిన సలహా ఇవ్వడానికి హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగింది.
’’అని ఆయన తెలిపారు.వయోధికులు, మహిళలను దృష్టిలో ఉంచుకుని అతిపెద్ద పెన్షన్ సంస్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు.
సగటు జీవిత కాలం పెరిగిందని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు లాభదాయకత కలిగి ఉండేలా వివిధ విధానాలను వారికి అనుకూలంగా సవరించడం జరిగిందన్నారు.“ పదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారు , దురదృష్టవశాత్తు చనిపోతే అలాంటి వారికి సంబంధించి,
 విడాకులు పొందిన కుమార్తెకు పెన్షన్ అందేందుకు , విడాకుల పిటిషన్లు సుదీర్ఘకాలం కోర్టులలో పెండింగ్ లో ఉన్నప్పటికీ, ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అడ్డంకిగాఉన్న నిబంధనను అలాగే రద్దు చేయడం జరిగింది.
కనిపించకుండా పోయిన ఉద్యోగి విషయంలో , భౌతిక కాయాన్ని కనుగొనడానికి వేచి ఉండే సమయం 7 సంవత్సరాలు.
ఉదాహరణకు ఎల్.డబ్ల్యు.ఇ లేదా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో , అలాంటి వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడం జరుగుతోంది”అని ఆయన తెలిపారు.

 

*******


(Release ID: 1933621)
Read this release in: Urdu , Hindi , Punjabi , Odia , Tamil