నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ సౌర కూటమి స్థాయి సంఘం ఎనిమిదో సమావేశం హైబ్రిడ్ ఫార్మాట్‌ లో ఢిల్లీలో జరిగింది.


ప్రపంచం నికర శూన్యం వైపు కదులుతున్న నేపథ్యంలో సౌర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది : ఐ.ఎస్.ఏ. స్థాయి సంఘం సమావేశంలో ఐ.ఎస్.ఏ. అధ్యక్షుడు, కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి

Posted On: 07 JUN 2023 1:48PM by PIB Hyderabad

అంతర్జాతీయ సౌర కూటమి (ఐ.ఎస్.ఏ) స్థాయి సంఘం ఎనిమిదవ సమావేశం 2023 జూన్, 6వ తేదీన న్యూ ఢిల్లీ లో ఐ.ఎస్.ఏ. ప్రస్తుత అధ్యక్షుడు, భారత విద్యుత్ శాఖ మంత్రి హోదాలో కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ అధ్యక్షతన జరిగింది.  ఐ.ఎస్.ఏ. అసెంబ్లీ సహా అధ్యక్ష హోదాలో ఉన్న ఫ్రెంచ్ రిపబ్లిక్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించింది.  సభ్య దేశాల ప్రతినిధులు కొందరు ఢిల్లీలో వ్యక్తిగతంగా హాజరు కాగా, మరికొందరు దృశ్య మాధ్యమం ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఐ.ఎస్.ఏ. సభ్య దేశాల్లో ఐ.ఎస్.ఏ. ప్రదర్శన ప్రాజెక్టుల గురించి;  ఐ.ఎస్.ఏ. సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్ (ఎస్.టి.ఏ.ఆర్-సి) గురించి;  ఐ.ఎస్.ఏ. సోలార్-ఎక్స్ స్టార్ట్ అప్ ఛాలెంజ్ గురించి;  ఐ.ఎస్.ఏ. సోలార్ ఫైనాన్స్ సౌకర్యం; ఐ.ఎస్.ఏ. స్థాయి సంఘం తొమ్మిదవ సమావేశానికి సన్నాహాలతో పాటు, ఐ.ఎస్.ఏ. అసెంబ్లీ ఆరవ సమావేశానికి సన్నాహాల గురించి,  ఐ.ఎస్.ఏ. స్థాయి సంఘం ఎనిమిదవ సమావేశం చర్చించింది. 

అంతర్జాతీయ సౌర కూటమి అధ్యక్ష హోదాలో, కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె. సింగ్  ప్రారంభోపన్యాసం చేస్తూ,  శక్తి పరివర్తన ఆవశ్యకత ఇప్పుడు స్థిరమైన ప్రశ్న అని పేర్కొన్నారు.  “ప్రపంచానికి శక్తి పరివర్తన అవసరమా అనేది ఇప్పడు ప్రశ్నే కాదు.  అందుకు బదులుగా, ఇప్పుడు దాన్ని ఎలా సాధించాలి, ఎంత త్వరగా సాధించాలి అనేదే ప్రశ్న.  ప్రత్యామ్నాయ శక్తి వనరుగా పునరుత్పాదక ఇంధనాల వేగవంతమైన వృద్ధితో కొత్త ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది." అని ఆయన వివరించారు. 

పునరుత్పాదక శక్తి ని పరివర్తన చేయడంలో ప్రపంచం సాధించిన విజయంలో సౌరశక్తి అభివృద్ధి కీలక పాత్రను మంత్రి నొక్కిచెప్పారు.  "శక్తి పరివర్తన సాధించడానికి ప్రధాన సహకారాలలో సౌరశక్తి అభివృద్ధి ఒకటి.  గత దశాబ్దం నుండి మొత్తం ప్రపంచ సౌర పి.వి. సామర్థ్యం సుమారు గా 942 గిగా వాట్స్ కి చేరుకుంది.  కొత్త సామర్థ్యం గల ఇన్‌స్టాలేషన్లతో 2021 సంవత్సరంలో సోలార్ పి.వి. మార్కెట్ మొత్తం ~175 గిగా వాట్స్ రికార్డు స్థాయి స్ట్రీక్‌ ను కొనసాగించింది.  ప్రతి సంవత్సరం, ప్రపంచం నెట్ జీరో వైపు కదులుతున్న నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనంగా సౌర శక్తి ఉత్పత్తి సాంకేతికత క్రమంగా అభివృద్ధి చెందుతోంది." అని ఆయన వివరించారు.  

పంపిణీ చేసిన శక్తి ప్రదేశంలో సోలార్ పి.వి. సాంకేతికత మరిన్ని అప్లికేషన్లను కనుగొనడం ద్వారా సౌరశక్తి కి చెందిన ఈ వృద్ధి సమ్మిళిత మవుతుందని మంత్రి పేర్కొన్నారు.   "సోలార్ పి.వి., ఆగ్రో  పి.వి., ఫ్లెక్సిబుల్, ఉపరితల సమీకృత సౌర ఘటాల ఉత్పాదక వినియోగ అనువర్తనాలు సౌర పి.వి. సాంకేతికతను అమలు చేయడానికి కొత్త మార్గాలను తెరుస్తూనే ఉన్నాయి." అని కూడా ఆయన పేర్కొన్నారు. 

వాతావరణ చర్య తీసుకోవడానికి మానవాళికి పరిమిత సమయం మిగిలి ఉందిగ్రీన్ ఎనర్జీ కోసం మరిన్ని నిధులు అవసరం.ఎస్.అధ్యక్షుడు

ప్రపంచ సౌరశక్తి పరివర్తన దిశగా ఐ.ఎస్.ఏ. నిర్విరామంగా కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.  బ్యాంకింగ్ సౌర ప్రాజెక్టుల అభివృద్ధికి, ఫైనాన్సింగ్ వెహికల్ ద్వారా ఫైనాన్సింగ్‌ ను ప్రోత్సహించడానికి సోలార్ ఫైనాన్స్ ఫెసిలిటీ తో సహా ఐ.ఎస్.ఏ. కార్యక్రమాలు అందించిన సహకారం గురించి;   తయారీదారులు, సరఫరాదారులు, పెట్టుబడిదారులకు సౌర అంకురసంస్థలు అందుబాటులోకి తీసుకు రావడంలో సోలార్‌-ఎక్స్ గ్రాండ్ ఛాలెంజ్ సహాయం చేయడం గురించి; శిక్షణా కేంద్రాలు, స్పెసిఫికేషన్ మరియు ప్రమాణాల అభివృద్ధి కోసం శిక్షణా కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పనిచేయడానికి, సౌర శక్తి ప్రాజెక్టులపై ప్రభుత్వాలకు, ప్రైవేటు రంగానికి మద్దతు ఇవ్వడానికి సమాచార కేంద్రాలుగా సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్లు పనిచేయడం గురించి; అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్తు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో చేపట్టిన "వన్-సన్-వన్-వరల్డ్-వన్-గ్రిడ్-ఇనిషియేటివ్" గురించి  ఆయన వివరించారు. 

ఐ.ఎస్.ఏ. తో పాటు, సభ్య దేశాల సహకారం కోసం అవకాశాలు వాస్తవానికి అపరిమితంగా ఉన్నాయని మంత్రి, ఐ.ఎస్.ఏ. అధ్యక్షుడు పేర్కొంటూ, వ్యవసాయం, ఆరోగ్యం, రవాణా, బ్యాటరీ నిల్వ, తాపన, శీతలీకరణ, గ్రీన్ హైడ్రోజన్ వంటి బహుళ రంగాలలో సోలార్ అప్లికేషన్లను వినియోగించే తొమ్మిది చర్యల ద్వారా హరిత, మరింత స్థిరమైన ప్రపంచానికి సంస్థ గణనీయంగా దోహదపడుతుందని తెలియజేశారు. 

పర్యావరణానికి సవాలు అనేది ఇప్పుడు మరింత అత్యవసరంగా మారుతున్నదని, ఈ సవాలును ఎదుర్కోవటానికి మానవాళికి మిగిలి ఉన్న సమయం చాలా పరిమితంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.  "చాలా తక్కువగా అభివృద్ధి చెందిన దేశాలకు స్వచ్ఛమైన ఇంధనాన్ని పొందేందుకు, శక్తి పరివర్తనను పొందడానికి మనం సహాయం చేయనంత వరకు మనం ఈ సవాలును ఎదుర్కోలేము.  ఈ విషయాన్ని దశాబ్దాల క్రితమే గుర్తించినప్పటికీ, ముందుకు రావడానికి మనం ఎటువంటి ముగింపును చూడలేదు.  ప్రపంచం "నెట్ జీరో" స్థాయికి చేరుకోవాలంటే, కేవలం కొన్ని దేశాలు మాత్రమే ఆ స్థాయిని చేరుకుంటే సరిపోదు.  ఇందుకోసం, మనం తగినంతగా చేస్తున్నామా? అని మన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి." అని ఆయన సూచించారు. 

ప్రపంచవ్యాప్తంగా కొన్ని "హరిత నిధులు" ఏర్పాటు చేసినప్పటికీ, ఆ నిధుల్లో కొంత భాగాన్ని ఆఫ్రికా దేశాలకు చాలా బాహాటంగా పంపవలసిందిగా ఆ "హరిత నిధులను"  ఐ.ఎస్.ఏ.  కోరవలసి ఉందని మంత్రి సభ్య దేశాలను కోరారు.   ఆ హరిత నిధులకు మన వాటా సహకారం పెరగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 

ఐఎస్‌.ఏ. సభ్యుల పాత్రకు మంత్రి అభినందనలు తెలిపారు.  మేము పరివర్తనను కొనసాగిస్తున్నామని, శక్తి పరివర్తన దిశలో ఐ.ఎస్.ఏ. చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.  "రాబోయే రోజుల్లో మనం మరిన్ని ప్రాజెక్టులను చూస్తాము, ఎక్కువ మంది ప్రజలు విద్యుత్తును పొందడం, స్వచ్ఛమైన శక్తి లేని వ్యక్తుల సంఖ్య తగ్గడం మనం చూస్తాము." అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

సౌర విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్త పెట్టుబడిని వేగవంతం చేసే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది : ఫ్రాన్స్

అభివృద్ధి, ఫ్రాంకోఫోనీ, అంతర్జాతీయ భాగస్వామ్యాల సహాయ మంత్రి, అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ సహ అధ్యక్షులు క్రిసౌలా జచరోపౌలౌ, దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగిస్తూ, ఐ.ఎస్.ఏ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పూర్తి స్థాయి అంతర్జాతీయ సంస్థగా మారినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.  జి-20 అధ్యక్ష హోదాలో భారతదేశ నాయకత్వాన్ని సహ-అధ్యక్షులు ప్రశంసించారు.  కొత్త ప్రపంచ ఆర్థిక ఒప్పందం కోసం భారతదేశం క్రియాశీలంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.  పునరుత్పాదక శక్తి అవసరం గతంలో కంటే ఎక్కువగా ఉందని, శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించాలని, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రతి చోటా పెంచాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ పేర్కొంది.  సి.ఓ.పి-28 విజయవంతం కావడానికి ఐ.ఎస్.ఏ. క్రియాశీల ప్రాతినిధ్యం కీలకమని దేశ ప్రతినిధి చెప్పారు.  సౌరశక్తిలో సామర్థ్య పెంపుదల, పెట్టుబడులను పెంచడం వంటి ఐ.ఎస్.ఏ. ప్రాధాన్యతలకు ఫ్రాన్స్ మద్దతు ఇస్తుందని ఆమె హామీ ఇచ్చారు. 

అంతర్జాతీయ సౌర కూటమి - ఐ.ఎస్.ఏ. సహ-అధ్యక్షుల ప్రసంగాన్ని ఇక్కడ చూడవచ్చు. 

అంతర్జాతీయ సౌర కూటమి - .ఎస్.. గురించి

అంతర్జాతీయ సౌర కూటమి (ఐ.ఎస్.ఏ) అనేది దాని సభ్య దేశాలలో శక్తిని, ఉత్సాహాన్ని నింపుతూ, ఇంధన భద్రతను నిర్ధారించడం, ఇంధన పరివర్తనను నడపడం కోసం సౌర ఇంధన సాంకేతికతల విస్తరణ కోసం ఒక సహకార వేదికగా పనిచేస్తుంది.   ఇది 93 సభ్య దేశాలతో పాటు115 సంతకం చేసే అధికారం గల దేశాలతో కూడిన ఒక అంతర్జాతీయ సంస్థ.  భారతదేశంలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న మొదటి అంతర్జాతీయ అంతర్-ప్రభుత్వ సంస్థ.

తక్కువ-అభివృద్ధి చెందిన దేశాలు (ఎల్.డి.సి.లు), అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప రాష్ట్రాలు (ఎస్.ఐ.డి.ఎస్) గా వర్గీకరించబడిన దేశాల్లో ప్రభావాన్ని అందించడంపై ప్రత్యేక దృష్టి సారించి, తక్కువ-కర్బన వృద్ధి పథాలను అభివృద్ధి చేయడంలో సభ్య దేశాలకు సహాయం చేయడానికి, సూర్యుని ద్వారా శక్తినిచ్చే తక్కువ ఖర్చుతో పరివర్తనాత్మక శక్తి పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి ఐ.ఎస్.ఏ. కృషి చేస్తుంది.   బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు (ఎం.డి.బి.లు), అభివృద్ధి ఆర్థిక సంస్థలు (డి.ఎఫ్.ఐ.లు), ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజం, ఇతర అంతర్జాతీయ సంస్థలతో ఐ.ఎస్.ఏ. భాగస్వామ్యం ఒక అంతర్జాతీయ వేదికగా ప్రపంచాన్ని ముందుకు వెళ్లాలని కోరుకునే మార్పును అందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. 

 

2030 నాటికి సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్‌ లో 1,000 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులను సమీకరించాలనే లక్ష్యంతో ఐ.ఎస్.ఏ., దాని ‘టూవర్డ్స్-1000’ అనే  వ్యూహం ద్వారా మార్గనిర్దేశం చేయబడింది.  క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌ ని ఉపయోగించి 1,000 మిలియన్ల మందికి ఇంధనాన్ని అందుబాటులో ఉంచడం కోసం, 1,000 గిగా వాట్ల సౌర శక్తి సామర్థ్యాన్ని స్థాపించడం జరిగింది.  ఇది ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 1,000 మిలియన్ టన్నుల కర్బన సౌర ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఐ.ఎస్.ఏ. సభ్య దేశాలు విధానాలు, నిబంధనలను అమలు చేయడం, ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం, ఉమ్మడి ప్రమాణాలను అంగీకరించడం, పెట్టుబడులను సమీకరించడం ద్వారా మార్పును పెంచుతున్నాయి.  ఈ పని ద్వారా, సౌర ప్రాజెక్టుల కోసం, ఐ.ఎస్.ఏ.  కొత్త వ్యాపార నమూనాలను గుర్తించి, రూపొందించడం;  సౌర విశ్లేషణలు, సలహాల ద్వారా సౌర-స్నేహపూర్వకంగా వారి శక్తి చట్టాలు, విధానాలను రూపొందించడానికి ప్రభుత్వాలకు ఐ.ఎస్.ఏ. మద్దతు ఇవ్వడం;  వివిధ దేశాల నుండి సోలార్ టెక్నాలజీకి  ఉన్న డిమాండ్ ను సమీకరించడం; ఖర్చులను తగ్గించడం;  నష్టాలను తగ్గించడం జరిగింది.  ప్రైవేట్ పెట్టుబడులకు రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడం ద్వారా పెట్టుబడులు పెరిగాయి.  సౌర ఇంజనీర్లు, శక్తి విధాన రూపకర్తల కోసం సౌర శిక్షణతో పాటు, సమాచార లభ్యత పెరిగింది.

సౌరశక్తి పరిష్కారాల విస్తరణ ద్వారా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రయత్నాలను సమీకరించడానికి భారత్, ఫ్రాన్స్ దేశాల సంయుక్త ప్రయత్నంగా ఐ.ఎస్.ఏ. ను రూపొందించడం జరిగింది.   2015 సంవత్సరంలో పారిస్‌ లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల ఫ్రేమ్‌ వర్క్ కన్వెన్షన్ (యు.ఎన్.ఎఫ్.సి.సి.సి) కి సంబంధించిన 21వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సి.ఓ.పి) సందర్భంగా దీన్ని రూపొందించడం జరిగింది.   2020 సంవత్సరంలో దాని ఫ్రేమ్‌ వర్క్ ఒప్పందాన్ని సవరించడంతో, ఐక్యరాజ్యసమితిలోని అన్ని సభ్య దేశాలు ఇప్పుడు ఐ.ఎస్.ఏ. లో చేరడానికి అర్హత పొందాయి.

కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి భూపిందర్ సింగ్ భల్లా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

*****



(Release ID: 1930619) Visitor Counter : 233