సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

బంగ్లాదేశ్ పౌర సేవకుల 60వ బ్యాచ్ శిక్షణను ఎన్ సి జీ సి పూర్తిచేసింది. బంగ్లాదేశ్ నుండి ఇప్పటివరకు 2,145 మంది అధికారులు ఎన్ సి జీ సి లో శిక్షణ పొందారు ప్రజల అవసరాలకు సున్నితంగా ప్రతిస్పందించడంలో సివిల్ సర్వెంట్ల పాత్రను

డీ జీ, ఎన్ సి జీ సి శ్రీ భరత్ లాల్ నొక్కి చెప్పారు.

‘ఆసియ శతాబ్దం'’ దక్షిణాసియాకు ఒక అవకాశాన్ని అందిస్తోందని డీజీ ఎన్‌సీజీజీ అన్నారు

ఎన్ సి జీ సి పూర్వ విద్యార్థులుగా పౌర సేవకులు విజ్ఞానం మరియు ఉత్తమ అభ్యాసాలను మార్పిడి చేసుకోవడానికి ప్రోత్సహించారు

Posted On: 03 JUN 2023 11:54AM by PIB Hyderabad

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సి జీ సి) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ పౌర సేవకుల కోసం 2 వారాల 60వ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం  2వ జూన్, 2023న ముగిసింది. సీ బీ పీ 1,500 మంది పౌర సేవకులకు మొదటి దశ శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత, 2025 నాటికి అదనంగా 1,800 మంది పౌర సేవకుల సామర్థ్యాన్ని పెంచడానికి ఎన్ సి జీ సి బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత గత రెండేళ్లలో ఎన్ సి జీ సి బంగ్లాదేశ్ అధికారులు 517 మందికి ఇప్పటికే శిక్షణ అందించింది. 

 

21వ శతాబ్దాన్ని 'ఆసియా శతాబ్దం'గా అభివర్ణిస్తారు. ఇది దక్షిణాసియా దేశాలకు తమను తాము అభివృద్ధి చెందిన దేశాలుగా మార్చుకోవడానికి మరియు వారి పౌరుల జీవన నాణ్యతను పెంచడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, పరస్పర అభ్యాసాన్ని పెంపొందించడం మరియు ఇ-గవర్నెన్స్‌ని అనుసరించడం ద్వారా పౌర-కేంద్రీకృత ప్రజా పాలన విధానాలు మరియు సుపరిపాలనపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారత ప్రభుత్వం ఈ ప్రయత్నాలలో చురుకుగా నిమగ్నమై ఉంది. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు వారి పౌర సేవకులు మరియు సాంకేతిక నిపుణుల సామర్థ్యాలను బలోపేతం చేయడానికి వారి ప్రయత్నంలో సహాయం చేస్తోంది. ఈ మిషన్‌ను అనుసరించి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సి జీ సి)ని ' కేంద్రీకృత సంస్థ'గా గుర్తించింది. ఫలితంగా, ఎన్ సి జీ సి విస్తరిస్తోంది మరియు దాని కార్యకలాపాలను గణనీయంగా పెంచుతోంది.

 

నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ భరత్ లాల్ అధ్యక్షతన బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్ కోసం 60వ సీ బీ పీ వేడుక జరిగింది. తన ప్రసంగంలో, పరిపాలన మరియు పౌర సేవలని మెరుగుపరచడానికి భారతదేశంలో విజయవంతంగా అమలు చేయబడిన పాలనా అనుభవ విజ్ఞానం మరియు వినూత్న పద్ధతుల మార్పిడిని సులభతరం చేసే ప్రాథమిక లక్ష్యంతో ఈ సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమాలు ఎలా నిశితంగా నిర్వహించబడుతున్నాయో ఆయన హైలైట్ చేశారు. అత్యుత్తమ అభ్యాసాల మార్పిడి ద్వారా, ప్రపంచవ్యాప్తంగా పాలనా వ్యవస్థల అభివృద్ధికి మరియు బలోపేతం చేయడానికి భారతదేశం దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. డీ జీ పాల్గొనే అధికారులను సీ బీ పీ నుండి 4-5 కీలకమైన అభ్యాసాలను గుర్తించవలసిందిగా కోరారు, వారు వారి నిర్దిష్ట అవసరాల ఆధారంగా అవసరమైన మార్పులతో స్వీకరించవచ్చు మరియు ప్రతిరూపం చేయవచ్చు.

 

సమాజంలో సివిల్ సర్వెంట్లు పోషించే కీలక పాత్రపై కూడా డిజి మాట్లాడారు. సివిల్ సర్వెంట్లు ప్రజల అవసరాలకు సున్నితంగా  ప్రతిస్పందించాలని మరియు సమయానుకూలంగా ప్రజా సేవలను అందించాలని ఆయన కోరారు. మానవ కేంద్రీకృత విధానాన్ని అవలంబించడం ద్వారా మరియు సమర్థవంతమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం ద్వారా, పౌర సేవకులు ప్రజల శ్రేయస్సుకు మరియు పాలనా వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడానికి గణనీయంగా దోహదపడతారు. గృహాలు, నీరు, మరుగుదొడ్లు, వంటగ్యాస్, విద్య, వైద్యం, ఆర్థిక సేవలు, నైపుణ్యాభివృద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి వేగంగా భారీ స్థాయిలోపని చేయాలని ఆయన కోరారు.

 

'ఆసియా శతాబ్దం' ఒక పరివర్తన దశను సూచిస్తుందని, ఇక్కడ దక్షిణాసియా దేశాలు ప్రధాన ప్రపంచ అగ్రశ్రేణి గా ఎదగాలని ఆయన నొక్కి చెప్పారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, విభిన్న ఆర్థిక వ్యవస్థలు మరియు చైతన్యవంతమైన యువ జనాభాతో, దక్షిణాసియా సుస్థిరమైన వృద్ధి మరియు అభివృద్ధికి అవసరమైన వనరులను కలిగి ఉంది. సాధారణ సవాళ్లను ఎదుర్కొనేందుకు, అట్టడుగు వర్గాలను ఉద్ధరించడానికి మరియు ఈ ప్రాంతంలోని పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి ఈ బలాలను ఉపయోగించుకోవడం యొక్క ప్రాముఖ్యతను డి జి నొక్కిచెప్పారు.

 

దక్షిణ ప్రపంచంలో  సామాజిక-ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి, మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. అధిక నాణ్యత ప్రజా సేవలను నిర్ధారించడం మరియు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, మహిళలు శ్రామిక శక్తిలో చురుకుగా పాల్గొనవచ్చు మరియు అర్థవంతమైన ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనవచ్చు, తద్వారా మొత్తం ఉత్పాదకతను పెంచుతుంది. మహిళా సాధికారత కోసం సివిల్ సర్వెంట్లు కృషి చేయాలని, అవకాశాలు మరియు వనరుల సమాన ప్రాప్తికి హామీ ఇవ్వాలని డిజి కోరారు. ఈ సమిష్టి కృషి మన దేశాలను తదుపరి అభివృద్ధి దశ వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

 

అంతేకాకుండా, లీకేజీలను నిరోధించడానికి మరియు వనరులను సక్రమంగా వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఆయన బలమైన భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాలను పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసారు. ఈ సంబంధం వివిధ అభివృద్ధి ప్రయత్నాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. ఎన్ సి జీ సి పూర్వ విద్యార్థులుగా  వారి ఉత్తమ అభ్యాసాలు మరియు శిక్షణలను చురుకుగా పంచుకోవాలని డీ జీ అధికారులను కోరారు. అనుభవాలు మరియు నైపుణ్యం యొక్క ఈ భాగస్వామ్యం ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది, కొత్త విధానాలను ప్రేరేపిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా పాలన మరియు ప్రభుత్వ పరిపాలనలో సానుకూల మార్పును ప్రోత్సహిస్తుంది.

 

డాక్టర్ ఎ. పీ సింగ్, కోర్సు సమన్వయకర్త తన ప్రసంగంలో 60వ సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమంలో కవర్ చేయబడిన అంశాల వైవిధ్యాన్ని హైలైట్ చేశారు. ఈ కార్యక్రమాలలో పాలన, డిజిటల్ పరివర్తన, అభివృద్ధి పథకాలు మరియు సుస్థిరమైన అభ్యాసాల యొక్క వివిధ అంశాలు ఉన్నాయి. కవర్ చేయబడిన అంశాలలో మారుతున్న పాలనా నమూనా, పాస్‌పోర్ట్ సేవ మరియు మడాడ్‌తో సహా డిజిటల్ గవర్నెన్స్‌పై కేస్ స్టడీస్, అందరికీ గృహాలు, విభిన్న అభివృద్ధి పథకాల నుండి ఉత్తమ పద్ధతులు, పర్యావరణ అనుకూలమైన స్మార్ట్ సిటీ ప్రణాళిక, భారతదేశ మిశ్రమ సంస్కృతి, సుపరిపాలన లో ఆధార్ పాత్ర, పాలన, విపత్తు నిర్వహణ, ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క అవలోకనం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్ట్, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం, స్వామిత్వ పథకం, ఆరోగ్య రంగ ఆప్టిమైజేషన్, నాయకత్వం మరియు కమ్యూనికేషన్, ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, ఉమాంగ్, పీ ఎం గతి శక్తి యోజన, ప్రభుత్వం ఇ-మార్కెట్‌ప్లేస్, గ్రామీణ కనెక్టివిటీ కోసం పీ ఎం జీ ఎస్ వై, హరిత విద్యుత్, సమర్థవంతమైన పౌర సేవలు, విజిలెన్స్ అడ్మినిస్ట్రేషన్, మహిళా-కేంద్రీకృత పాలన, అవినీతి నిరోధక వ్యూహాలు, సర్క్యులర్ ఎకానమీ మరియు ఎన్నికల నిర్వహణ మొదలైన అంశాలు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి ఎక్స్‌పోజర్ సందర్శనలలో పాల్గొనడానికి విలువైన అవకాశం ఉందని, ఇది వారి మొత్తం అభ్యాస ప్రయాణాన్ని పెంపొందించిందని ఆయన హైలైట్ చేశారు. ప్రణాళికాబద్ధమైన సందర్శనలలో సహారన్‌పూర్‌లోని జిల్లా యంత్రాంగం, భారత పార్లమెంటు, మరియు ప్రధానమంత్రి సంగ్రహాలయ మొదలైనవి ఉన్నాయి.

 

ఎం ఈ ఏ భాగస్వామ్యంతో ఎన్ సి జీ సి 15 దేశాల పౌర సేవకులకు శిక్షణ ఇచ్చింది. బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, నేపాల్ భూటాన్, మయన్మార్ మరియు కంబోడియా పౌర సేవకులకు శిక్షణ ఇచ్చింది. పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించి, విస్తరిస్తున్న దేశాల జాబితా నుండి ఎక్కువ సంఖ్యలో పౌర సేవకులకు వసతి కల్పించడానికి ఎన్ సి జీ సి తన సామర్థ్యాన్ని ముందుగానే విస్తరిస్తోంది. ఈ విస్తరణ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం మరియు ఎన్ సి జీ సి అందించే నైపుణ్యం మరియు వనరుల నుండి మరిన్ని దేశాలు ప్రయోజనం పొందగలవని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.

 

మొత్తం కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌ను బంగ్లాదేశ్ కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ ఎ. పి. సింగ్, కో-కోర్సు కోఆర్డినేటర్ డా. సంజీవ్ శర్మ మరియు ఎన్‌సిజిజి కెపాసిటీ బిల్డింగ్ టీమ్ పర్యవేక్షించారు.

 

***



(Release ID: 1929714) Visitor Counter : 116