నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గౌహతిలో ఏడు మతపరమైన ప్రదేశాలు జలమార్గాల ద్వారా అనుసంధానించబడతాయి


"రివెరైన్ బేస్డ్ టూరిజం సర్క్యూట్" కోసం 19 మే 2023న ఐడబ్ల్యూఏఐ, ఎస్‌డిసిఎల్, ఏటిడిసి మరియు డిఐడబ్ల్యూటిల మధ్య అవగాహన ఒప్పందం

అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ మరియు కేంద్ర ఎంఒపిఎస్‌డబ్ల్యూ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ సమక్షంలో ఈ ఎమ్ఒయుపై సంతకాలు జరగనున్నాయి.

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2023 3:12PM by PIB Hyderabad

అంతర్గత జలమార్గాలను అభివృద్ధి చేయడానికి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఒపిఎస్‌డబ్ల్యూ) కట్టుబడి ఉంది. ఈ క్రమంలో, బ్రహ్మపుత్ర నదిపై అభివృద్ధి చేస్తున్న 'రివర్ బేస్డ్ టూరిజం సర్క్యూట్' కోసం ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ), సాగర్‌మాల డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌డిసిఎల్), అస్సాం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏటిడిసి ) మరియు  డైరెక్టరేట్‌ ఆఫ్ ఇన్‌లాండ్‌ వాటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (డిఐడబ్ల్యూటి) మధ్య 19 మే 2023న అస్సాంలోని గౌహతిలో సంతకాలు జరుగుతాయి. అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ మరియు ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్  సమక్షంలో ఈ సంతకం కార్యక్రమం జరగనుంది.

రూ. 40-45 కోట్ల ప్రాథమిక వ్యయంతో సాగరమాల కార్యక్రమం కింద ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు.ఎస్‌డిసిఎల్ మరియు ఐడబ్ల్యూఏఐ సంయుక్తంగా ప్రాజెక్ట్ వ్యయంలో 55% సహకరిస్తాయి. మిగిలినది ఏటిడిసి ద్వారా అందించబడుతుంది. ప్రాజెక్ట్ కోసం దేవాలయాల సమీపంలోని ఘాట్‌ల వినియోగాన్ని ఉచితంగా అందించడానికి డిఐడబ్ల్యూటి అంగీకరించింది.

ఈ సాగరమాల ప్రాజెక్ట్ గౌహతిలో ఉన్న కామాఖ్య, పాండునాథ్, అశ్వక్లాంత, డౌల్ గోవింద, ఉమానంద, చక్రేశ్వర్ మరియు ఔనియతి సత్ర అనే ఏడు చారిత్రక దేవాలయాలను కలుపుతుంది. ఈ సర్క్యూట్ హనుమాన్ ఘాట్, ఉజాన్ బజార్ నుండి ప్రయాణించి, పైన పేర్కొన్న అన్ని దేవాలయాలను జలమార్గాల ద్వారా కవర్ చేయడం ద్వారా తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఫెర్రీ సర్వీస్ ఒక పూర్తి సర్క్యూట్‌ను పూర్తి చేయడానికి మొత్తం ప్రయాణ సమయం 2 గంటల కంటే తక్కువకు తగ్గిస్తుందని భావిస్తున్నారు.


 

***


(రిలీజ్ ఐడి: 1925322) సందర్శకుల సూచీ సంఖ్య : : 201
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Manipuri