ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ప్రధాని ప్రసంగం

Posted On: 26 APR 2023 11:19PM by PIB Hyderabad

అర్నబ్ గోస్వామి గారూ, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ సహోద్యోగులందరూ, దేశవిదేశాల్లోని రిపబ్లిక్ టీవీ వీక్షకులందరూ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్! నేను ఏదైనా చెప్పే ముందు, నా చిన్నతనంలో నేను విన్న ఒక జోక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కుమార్తె ఆత్మహత్య కు పాల్పడుతూ, తాను జీవితంలో విసిగిపోయానని, ఇక బతకడం ఇష్టం లేదని నోట్ రాసి పెట్టింది. ఏదో ఒకటి తిని కంకారియా సరస్సులో దూకి చనిపోతానని రాసింది. మరుసటి రోజు ఉదయం తన కూతురు ఇంట్లో లేదని ప్రొఫెసర్ గుర్తించాడు. ఆమె గదికి వెళ్లి చూడగా ఒక ఉత్తరం దొరికింది. ఆ లేఖ చదివిన తర్వాత ఆయనకు చాలా కోపం వచ్చింది. తాను ప్రొఫెసర్ ను అని, ఇన్నేళ్లు కష్టపడ్డానని, అయినా సూసైడ్ లెటర్ లో కూతురు కంకారియా ను తప్పుగా రాసిందని ఆయన అన్నారు.  అర్నబ్ హిందీ లో బాగా మాట్లాడటం ప్రారంభించడం సంతోషంగా ఉంది. అతను చెప్పింది నేను వినలేదు, కానీ అతని హిందీ సరైనదా కాదా అనే దానిపై నేను శ్రద్ధ పెట్టాను. బహుశా, ముంబైలో నివసించిన తరువాత మీ హిందీ మెరుగుపడింది.

 

మిత్రులారా,

 

మీతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. వచ్చే నెలలో రిపబ్లిక్ టీవీ ఆరేళ్లు పూర్తి చేసుకోనుంది. ‘నేషన్ ఫస్ట్’ అనే మీ లక్ష్యాన్ని విస్మరించనండుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగారు. కొన్నిసార్లు అర్నబ్ గొంతు నొప్పిగా ఉందని, కొన్నిసార్లు కొందరు అతని గొంతు పట్టుకునేందుకు ప్రయత్నించినా ఛానల్ మూత పడలేదు. అది అలసిపోలేదు, ఆగలేదు.

 

మిత్రులారా,

 

నేను 2019లో రిపబ్లిక్ సమ్మిట్ కు వచ్చినప్పుడు అప్పటి ఇతివృత్తం 'ఇండియాస్ మూమెంట్'. ఈ ఇతివృత్తం నేపథ్యం  దేశ ప్రజల నుంచి మాకు లభించిన తీర్పు. భారత ప్రజలు అనేక దశాబ్దాల తర్వాత అఖండ మెజారిటీతో వరుసగా రెండోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 'ఇండియాస్ మూమెంట్' వచ్చేసిందన్న నమ్మకం  దేశానికి కలిగింది. నాలుగేళ్ల తర్వాత ఈ రోజు మీ సమ్మిట్ థీమ్ 'టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్'. అంటే ఆ పరివర్తన వెనుక ఉన్న నమ్మకం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.

 

మిత్రులారా,

 

నేడు దేశంలో జరుగుతున్న మార్పు దిశను కొలవడానికి ఒక మార్గం ఆర్థిక వ్యవస్థ వృద్ధి , విస్తరణ వేగం. భారతదేశం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి దాదాపు 60 సంవత్సరాలు పట్టింది. అరవై ఏళ్ళు! 2014 నాటికి ఎలాగోలా రెండు ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకోగలిగాం. అది ఏడు దశాబ్దాల్లో రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ! కానీ నేడు మా ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ నిలిచింది.

గత తొమ్మిదేళ్లలో 10వ స్థానం నుంచి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఇదంతా వందేళ్ల అతిపెద్ద సంక్షోభం మధ్య జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోయిన సమయంలో, భారతదేశం సంక్షోభం నుండి బయటపడటమే కాకుండా, వేగంగా ముందుకు సాగుతోంది.

 

మిత్రులారా,

 

విధాన రూపకర్తల నుండి మీరు తరచుగా ఒక విషయం వినే ఉంటారు - ఫస్ట్ ఆర్డర్ ఇంపాక్ట్. ఇది ఏదైనా పాలసీ కి సంబంధించి మొదటి ,సహజ ఫలితం. ఫస్ట్ ఆర్డర్ ఇంపాక్ట్ అనేది పాలసీ మొదటి లక్ష్యం, దాని ప్రభావం తక్కువ సమయంలో కనిపిస్తుంది. కానీ ప్రతి పాలసీలోనూ సెకండ్, థర్డ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటి ప్రభావం లోతైనది, సుదూరమైనది, కానీ బయటపడటానికి సమయం పడుతుంది. దానిని తులనాత్మక అధ్యయనం చేయడానికి, వివరంగా అర్థం చేసుకోవడానికి మనం చాలా దశాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. టీవీ ప్రపంచంలోని ప్రజలు రెండు కిటికీలను నడుపుతారు - అప్పుడు -ఇప్పుడు. ఈ రోజు నేను కూడా అలాంటిదే చేయబోతున్నాను. కాబట్టి ముందు గతం గురించి మాట్లాడుకుందాం.

 

మిత్రులారా,

 

స్వాతంత్య్రానంతరం అవలంబించిన లైసెన్సురాజ్ ఆర్థిక విధానంలో ప్రభుత్వమే కంట్రోలర్ అయింది. పోటీ లేకుండా పోయింది. ప్రైవేటు పరిశ్రమలు, ఎంఎస్ఎంఇ లను వృద్ధి చెందనివ్వలేదు.

దీని మొదటి ప్రతికూల ప్రభావం ఏమిటంటే, ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనుకబడి పేదలుగా మారాము. ఆ విధానాల రెండో ఆర్డర్ ప్రభావం మరింత దారుణంగా ఉంది. ప్రపంచంతో పోలిస్తే భారత్ వినియోగ వృద్ధి చాలా తక్కువగా ఉంది. ఫలితంగా ఉత్పాదక రంగం బలహీనపడి పెట్టుబడుల అవకాశాలను కోల్పోయింది. ఈ విధానం మూడవ ప్రభావం ఏమిటంటే, భారతదేశంలో సృజనాత్మక వాతావరణం అభివృద్ధి చెందలేదు. అటువంటి పరిస్థితిలో, మరిన్ని సృజనాత్మక సంస్థలు ఏర్పడడం గానీ, .ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువగా అందుబాటులోకి రావడం గానీ జరగలేదు. యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడటం ప్రారంభించారు. దేశంలోని చాలా మంది ప్రతిభావంతులు పని వాతావరణం లేకపోవడంతో దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలన్నీ అదే ప్రభుత్వ విధానాల థర్డ్ ఆర్డర్ ప్రభావం ఫలితమే. ఆ విధానాల ప్రభావం దేశ ఆవిష్కరణలు, కృషి, ఎంటర్ ప్రైజ్ సామర్థ్యాన్ని దెబ్బతీసింది.

 

మిత్రులారా,

 

ఇప్పుడు నేను చెప్పబోయేది రిపబ్లిక్ టీవీ వీక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. 2014 తర్వాత మా ప్రభుత్వం ఏ పాలసీని రూపొందించినా ప్రాథమిక ప్రయోజనాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రభావాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది.

2019 రిపబ్లిక్ సమ్మిట్ సందర్భంగా పీఎం ఆవాస్ యోజన కింద ఐదేళ్లలో 1.5 కోట్ల కుటుంబాలకు ఇళ్లు ఇస్తామని నేను చెప్పిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ సంఖ్య 3.75 కోట్లకు చేరింది. వీటిలో చాలా ఇళ్ల యాజమాన్య హక్కులు మన తల్లులు, సోదరీమణుల పేరిట ఉన్నాయి. ఈ రోజు కట్టిన ప్రతి ఇంటి విలువ లక్షల రూపాయలు అని మీకు తెలుసు. కోట్లాది మంది పేద సోదరీమణులు 'లఖ్పతి దీదీ'గా మారారని ఈ రోజు నేను ఎంతో సంతృప్తితో చెబుతున్నాను. బహుశా ఇంతకంటే గొప్ప రక్షా బంధన్ మరొకటి ఉండదేమో! ఇది మొదటి ప్రభావం. దీని రెండవ ప్రభావం ఏమిటంటే, ఈ పథకం కింద గ్రామాల్లో లక్షలాది ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. ఎవరికైనా సొంత ఇల్లు, శాశ్వత ఇల్లు ఉన్నప్పుడు, అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే వారి రిస్క్ తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. వారి కలలు ఆకాశాన్ని తాకడం ప్రారంభిస్తాయి. పీఎం ఆవాస్ యోజన దేశంలోని పేదల ఆత్మవిశ్వాసాన్ని కొత్త ఎత్తుకు పెంచింది.

 

మిత్రులారా,

 

ముద్ర యోజన కొద్ది రోజుల క్రితమే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. సూక్ష్మ, చిన్న పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాము.  ముద్రా పథకం కింద 40 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేయగా, అందులో 70 శాతం మంది మహిళలే ఉన్నారు. స్వయం ఉపాధి పెంపు రూపంలో ఈ పథకం తొలి ప్రభావం మన ముందుంది. ముద్ర యోజన అయినా,  మహిళల జన్ ధన్ ఖాతాల ప్రారంభమైనా,  స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అయినా, ఈ పథకాల ద్వారా నేడు దేశంలో ఒక పెద్ద సామాజిక మార్పును మనం చూడవచ్చు. ఈ పథకాలు నేడు కుటుంబ నిర్ణయ ప్రక్రియలో మహిళల బలమైన పాత్రను స్థాపించాయి. ఇప్పుడు మరింత మంది మహిళలు ఉద్యోగ సృష్టికర్తలుగా మారి దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తున్నారు.

 

మిత్రులారా,

 

పీఎం స్వమిత్వ యోజనలో కూడా మొదటి, రెండో, మూడో ఆర్డర్ ప్రభావాన్ని విడివిడిగా చూడవచ్చు. ఇందులో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేదలకు ప్రాపర్టీ కార్డులు ఇవ్వడంతో వారికి ఆస్తి భద్రతకు భరోసా లభించింది. డిమాండ్, విస్తరణ అవకాశాలు నిరంతరం పెరుగుతున్న డ్రోన్ రంగంపై ఈ పథకం ఒక ప్రభావాన్ని చూడవచ్చు. పీఎం స్వమిత్వ యోజనను ప్రారంభించి దాదాపు రెండున్నర సంవత్సరాలు కావస్తోంది. ఎక్కువ సమయం గడవక ముందే దాని సామాజిక ప్రభావం  కనిపిస్తోంది. ప్రాపర్టీ కార్డు పొందిన తర్వాత పరస్పర వివాదాలకు అవకాశం తగ్గింది. దీనివల్ల పోలీసు, న్యాయ వ్యవస్థపై రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి తగ్గింది. గ్రామాల్లో ఆస్తి పత్రాలు పొందిన వారికి బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందడం ఇప్పుడు సులువైంది. గ్రామాల్లో ఈ ఆస్తుల ధరలు కూడా పెరిగాయి.

 

మిత్రులారా,

 

ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ ఇంపాక్ట్ గురించి నాకు చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి, మీ టీవీ 'రన్ డౌన్' పనిచేయదు ఇంకా దీనిలో చాలా సమయం వెచ్చించబడుతుంది. డీబీటీ కావచ్చు, పేదలకు విద్యుత్, నీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించే పథకాలు కావచ్చు- ఇవన్నీ క్షేత్రస్థాయిలో విప్లవం తీసుకొచ్చాయి. ఈ పథకాలు దేశంలోని నిరుపేదలకు కూడా గౌరవం, భద్రతను కల్పించాయి. దేశంలోనే తొలిసారిగా పేదలకు భద్రతతో పాటు గౌరవం లభించింది. దశాబ్దాలుగా దేశాభివృద్ధికి తామే భారం అని గ్రహించిన వారు నేడు దేశాభివృద్ధిని వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభించినప్పుడు కొందరు మమ్మల్ని ఎగతాళి చేసేవారు. కానీ నేడు ఈ పథకాలు భారతదేశ వేగవంతమైన అభివృద్ధికి మరింత వేగాన్ని ఇచ్చాయి. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రాతిపదికగా మారాయి.

 

మిత్రులారా,

 

పేద, దళిత, అణగారిన, వెనుకబడిన, గిరిజన, సాధారణ, మధ్యతరగతి నుంచి ప్రతి ఒక్కరి జీవితాల్లో గత తొమ్మిదేళ్లుగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నేడు దేశం చాలా క్రమబద్ధమైన విధానంతో, మిషన్ మోడ్ లో ముందుకు సాగుతోంది. అధికారంలో ఉన్నవారి ఆలోచనా ధోరణి కూడా మార్చాం. సేవా దృక్పథాన్ని పరిచయం చేశాం. పేదల సంక్షేమమే మా మాధ్యమం గా చేసుకున్నాం. బుజ్జగింపులకు బదులు సంతృప్తి కలిగించడం ప్రాతిపదికగా చేసుకున్నాం.

ఈ విధానం దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు రక్షణ కవచాన్ని సృష్టించింది. ఈ రక్షణ కవచం దేశంలోని పేదలు మరింత పేదలుగా మారకుండా నిరోధించింది. ఆయుష్మాన్ యోజన వల్ల దేశంలోని పేద లకు రూ.80,000 కోట్లు ఖర్చు తగ్గింది. లేకపోతే వారి జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వచ్చేదని మీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఊహించండి, మేము చాలా మంది పేదలను పేదలుగా మారకుండా కాపాడాము. సంక్షోభ సమయాల్లో ఉపయోగపడే పథకం ఇదొక్కటే కాదు.

 

కోట్లాది కుటుంబాలకు చౌకగా మందులు, ఉచిత టీకాలు, ఉచిత డయాలసిస్, ప్రమాద బీమా, జీవిత బీమా వంటి సౌకర్యాలు తొలిసారిగా లభించాయి. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన దేశంలోని పెద్ద జనాభాకు మరో రక్షణ కవచం. కరోనా సంక్షోభ సమయంలో ఏ పేదవాడు ఆకలితో నిద్రపోవడానికి ఈ పథకం అనుమతించలేదు. నేడు ప్రభుత్వం ఈ ఆహార పథకానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డు' అయినా, మన 'జామ్ ట్రినిటీ' అయినా ఇవన్నీ రక్షణ కవచంలో భాగమే. నేడు నిరుపేదలకు తమకు దక్కాల్సినది కచ్చితంగా దక్కుతుందనే భరోసా కలుగుతోంది. ఇది నిజమైన అర్థంలో సామాజిక న్యాయం అని నేను నమ్ముతున్నాను. భారతదేశంలో పేదరికాన్ని తగ్గించడంలో భారీ ప్రభావాన్ని చూపిన ఇలాంటి పథకాలు అనేకం ఉన్నాయి. మీరు కొంతకాలం క్రితం ఐఎంఎఫ్ నివేదికను చూసి ఉంటారు. ఇలాంటి పథకాల వల్ల, మహమ్మారి ఉన్నప్పటికీ భారత్ లో తీవ్ర పేదరికం అంతమవుతోందని ఈ నివేదిక చెబుతోంది. ఇది మార్పు.. కాదంటే మార్పు అంటే ఏమిటి?

 

మిత్రులారా,

 

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు స్మారక చిహ్నంగా నేను పార్లమెంటులో ఎంఎన్ ఆర్ ఇ జి ఎ ను గుర్తించిన విషయం మీకు తెలుసు. 2014కు ముందు ఎంఎన్ ఆర్ ఇ జి ఎ పై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు మా ప్రభుత్వం అధ్యయనం చేసింది. అనేక సందర్భాల్లో ఒక రోజు పని కంటే 30 రోజుల వరకు హాజరు చూపిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. మరో మాటలో చెప్పాలంటే, వేరొకరు డబ్బును దొంగిలించారు. ఎవరు ఓడిపోయారు? నష్టపోయేది పేదలు, కూలీలే. నేటికీ గ్రామాల్లోకి వెళ్లి 2014కు ముందు ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన ఏ ప్రాజెక్టు ఇంకా పనిచేస్తోందని అడిగితే ఏమీ కనిపించదు. గతంలో ఎం ఎన్ ఆర్ ఇ జి ఎ పై నిధులు వెచ్చించేటప్పుడు స్థిరాస్తుల అభివృద్ధికి పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. . మేము ఈ పరిస్థితిని కూడా మార్చాం. ఉపాధిహామీ బడ్జెట్ తో పాటు పారదర్శకతను పెంచాం. ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపడంతో పాటు గ్రామాలకు వనరులు సమకూర్చాం.

2014 తర్వాత పేదలకు లక్షలాది పక్కా ఇళ్లు, బావులు, మెట్లబావులు, కాలువలు, పశువుల షెడ్లు..

ఎంఎన్ఆర్ఇజిఎ కింద లభ్యం అయ్యాయి. నేడు, చాలా ఎంఎన్ఆర్ఇజిఎ చెల్లింపులు 15 రోజుల్లో నే క్లియర్ అవుతున్నాయి. దీంతో జాబ్ కార్డులలో ఫోర్జరీ తగ్గింది. నేను మీకు మరొక గణాంకాన్ని ఇస్తాను. ఎంఎన్ఆర్ఈజీఏలో మోసాల నివారణ వల్ల సుమారు రూ.40,000 కోట్లు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా ఆదా అయ్యాయి.

కష్టపడి పనిచేస్తూ చెమటలు చిందిస్తున్న ఆ పేద కూలీకి ఇప్పుడు ఎంఎన్ఆర్ఈజీఏ డబ్బులు అందుతున్నాయి. మా ప్రభుత్వం పేదలకు జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడింది.

 

మిత్రులారా,

 

ఈ పరివర్తన ప్రయాణం ఫ్యూచరిస్టిక్ వలె సమకాలీనమైనది. ఈ రోజు రాబోయే అనేక దశాబ్దాల కోసం మేము సన్నద్ధమవుతున్నాము. గతంలో ఏ సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా అది కొన్ని దశాబ్దాలు లేదా సంవత్సరాల తర్వాత భారతదేశానికి చేరేది. గత తొమ్మిదేళ్లలో భారత్ ఈ ధోరణిని కూడా మార్చింది. భారత్ ఒకేసారి మూడు టాస్క్ లు ప్రారంభించింది. మొదటిది, సాంకేతికతకు సంబంధించిన రంగాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసాము.  రెండవది, భారతదేశ అవసరాలకు అనుగుణంగా దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని మేము పట్టుబట్టాము. మూడవది, భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానం కోసం పరిశోధన - అభివృద్ధిపై మేము మిషన్ మోడ్ విధానాన్ని అవలంబించాము. దేశంలో 5జీ ఎంత వేగంగా అందుబాటులోకి వచ్చిందో ఈ రోజు మీరు చూడవచ్చు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగాం. 5జీ విషయంలో భారత్ చూపిన వేగం, భారత్ తనదైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్న తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 

మిత్రులారా,

 

కరోనా యుగంలో వ్యాక్సిన్ల అంశాన్ని ఎవరూ మర్చిపోలేరు. పాత ఆలోచనలు, దృక్పథం ఉన్న వ్యక్తులు 'మేడిన్ ఇండియా' వ్యాక్సిన్ల అవసరాన్ని అనుమానించారు. ఇతర దేశాలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయని, అందువల్ల ఏదో ఒక రోజు వ్యాక్సిన్లు మనకు ఇస్తారని వారి ఉమ్మడి పల్లవి. కానీ సంక్షోభ సమయాల్లో కూడా భారత్ స్వావలంబన మార్గాన్ని ఎంచుకుంది. ఫలితాలు మన ముందు ఉన్నాయి. మిత్రులారా, ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఆ సమయంలో మనం ఎప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఊహించుకోండి.

మన వ్యాక్సిన్లు తీసుకోండి అని ప్రపంచం చెబుతుంటే, వ్యాక్సిన్లు లేకుండా ఇబ్బందులు తప్పవని, చచ్చిపోతామని ప్రజలు చెబుతుంటే మీరు ఆ స్థితిలో ఉన్నారు.

 

మా వ్యాక్సిన్‌లు తీసుకోండి అని ప్రపంచం చెబుతున్నప్పుడు, వ్యాక్సిన్‌లు లేకుండా ఇబ్బంది ఉందని, మేము చనిపోతాము అనే పరిస్థితులలో మీరు ఉన్నారు. సంపాదకీయాలు, టీవీ చర్చలు ప్రమాదాలను ఎత్తి చూపాయి. విదేశాల నుంచి వ్యాక్సిన్లు తీసుకురావాలని డిమాండ్ చేశాయి. చేశారు. మిత్రులారా, నేను నా దేశం కోసం మాత్రమే పెద్ద పొలిటికల్ క్యాపిటల్ రిస్క్ తీసుకున్నాను. లేదంటే ఖజానాను ఉపయోగించి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవాలని కూడా చెప్పగలను. ఒకసారి ప్రజలకు వ్యాక్సిన్ వేసి పత్రికల్లో ప్రచారం చేస్తే అది అయిపోతుంది. కానీ మిత్రులారా, మేము ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ, సమర్థవంతమైన వ్యాక్సిన్లను అతి తక్కువ సమయంలో అభివృద్ధి చేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విజయవంతమైన వ్యాక్సిన్ క్యాంపెయిన్ ను ప్రారంభించాం. జనవరి-ఫిబ్రవరిలో భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి చెందడం, మే నెలలో టీకాల కోసం భారతదేశం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం మీకు గుర్తుండే ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేశాం. 'మేడిన్ ఇండియా' వ్యాక్సిన్ లను కొందరు వదులుకునే పనిలో నిమగ్నమైన సమయం కూడా ఇదే. ఎలాంటి పదాలు వాడారు? ఎవరి ఒత్తిడి ఉందో తెలియదు. విదేశీ వ్యాక్సిన్ల దిగుమతి కోసం వీళ్లు వాదిస్తున్న స్వార్థం ఏమిటో నాకు తెలియదు.

 

మిత్రులారా,

 

మన డిజిటల్ ఇండియా ప్రచారం గురించి కూడా నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జీ-20 సదస్సు కోసం బాలి వెళ్లాను. నా నుంచి డిజిటల్ ఇండియా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించని దేశం లేదు. ఒకానొక సమయంలో డిజిటల్ ఇండియాను పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా జరిగింది. గతంలో డేటా వర్సెస్ అట్టా (పిండి) అనే చర్చలో దేశం చిక్కుకుంది. ఈ టివి మీడియా వారు కూడా దీనిని చాలా ఆనందించారు. వారు - మీకు డేటా కావాలా లేక అట్టా కావాలా అంటూ వ్యంగ్య చర్చలు నడిపారు. జన్ ధన్-ఆధార్-మొబైల్ అనే త్రిమూర్తులను అడ్డుకోవడంలో పార్లమెంటు నుంచి కోర్టు వరకు వారు ప్రయోగించని ఎత్తులు లేవు.

2016లో బ్యాంకు వారి చేతివేళ్లపై ఉంటుందని నేను దేశప్రజలకు చెప్పినప్పుడు వారు నన్ను ఎగతాళి చేసేవారు. కొందరు బూటకపు మేధావులు 'మోదీజీ, చెప్పండి, పేదలు బంగాళాదుంపలు, టమోటాలను డిజిటల్ గా ఎలా కొంటారు?' అని అడిగేవారు. ఆ తర్వాత వీళ్లు ఏం చెప్పారు? 'పేదల అదృష్టంలో బంగాళాదుంపలు, టమోటాలు ఎక్కడున్నాయి?' ఎలాంటి మనుషులు వీళ్ళు? గ్రామాల్లోనే జాతరలు జరుగుతాయని, జాతరలలో ప్రజలు డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ రోజు మీ ఫిల్మ్ సిటీలో టీ దుకాణం నుండి లిట్టి-చోఖా బండి వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయో లేదో మీరే చూస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంతో పోలిస్తే డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిగే దేశాలలో భారత్ ఒకటి.

 

మిత్రులారా,

 

ప్రభుత్వం ఎందుకు ఇంత పని చేస్తోందో లేక క్షేత్రస్థాయిలోని ప్రజలకు కూడా దాని ప్రయోజనాలు అందుతున్నాయా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. అయినా కొందరు మోదీ తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాన్ని మీడియా ఫాలో అవుతోంది. దీనికి గల కారణాలను ఈ రోజు రిపబ్లిక్ టీవీ వీక్షకులకు చెప్పాలనుకుంటున్నాను. కొంతమందికి నల్లధన ఆదాయ మార్గాలను మోదీ శాశ్వతంగా మూసివేయడం వల్లనే ఈ ఆగ్రహావేశాలు, రచ్చ జరుగుతోంది. ఇప్పుడు అవినీతిపై పోరాటంలో చిత్తశుద్ధి లోపం లేదా ఒంటెత్తు పోకడ లేదు. ఇదీ మా నిబద్ధత. ఇప్పుడు చెప్పండి, కళంకిత సంపదను ఆపివేసిన వారు నన్ను తిడతారా లేదా? వారు తమ రాతల్లో కూడా విషాన్ని వెదజల్లుతారు. జామ్ ట్రినిటీ కారణంగా దాదాపు 10 కోట్ల మంది ప్రభుత్వ పథకాల నకిలీ లబ్ధిదారులను బయటకు నెట్టేశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ సంఖ్య చిన్నదేమీ కాదు సార్.. పది కోట్ల నకిలీ లబ్దిదారులను తరిమికొట్టారు. ఈ 10 కోట్ల మంది ప్రభుత్వ పథకాల ఫలాలు పొందేవారు.ఈ 10 కోట్ల మంది పుట్టని వారే. కానీ వారికి ప్రభుత్వ సొమ్ము పంపుతున్నారు.  ఢిల్లీ, పంజాబ్, హరియాణా ఉమ్మడి జనాభా కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద సంఖ్యలో నకిలీ లబ్ధిదారులకు డబ్బు పంపినట్టు మీరు ఊహించండి. మా  ప్రభుత్వం ఈ 10 కోట్ల నకిలీ పేర్లను వ్యవస్థ నుంచి తొలగించకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ ఘనత సాధించడం అంత సులభం కాదు మిత్రులారా. ముందుగా ఆధార్ కు రాజ్యాంగ హోదా ఇచ్చాం.  మిషన్ మోడ్ లో 45 కోట్లకు పైగా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరిచారు. డీబీటీ ద్వారా ఇప్పటి వరకు రూ.28 లక్షల కోట్లను కోట్లాది మంది లబ్ధిదారులకు బదిలీ చేశాం.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ అంటే మధ్యవర్తులు, నల్లధనం సంపాదించే వ్యక్తుల ప్రమేయం ఉండదు. డిబిటి అంటే కమీషన్ ,దొంగతనాలకు ముగింపు అని అర్థం. ఈ ఒక్క ఏర్పాటు డజన్ల కొద్దీ పథకాలు, కార్యక్రమాల్లో పారదర్శకతకు దారితీసింది.

 

మిత్రులారా,

 

మన దేశంలో ప్రభుత్వ సేకరణ కూడా అవినీతికి ప్రధాన వనరుగా ఉండేది. ఇప్పుడు ఇందులో కూడా మార్పు వచ్చింది. ప్రభుత్వ సేకరణ ఇప్పుడు పూర్తిగా జిఈఎమ్ అంటే ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ పై జరుగు తోంది.

పన్ను సమస్యలకు సంబంధించిన సమస్యలపై వార్తాపత్రికలు విపరీతంగా రాసేవి. మేమేం చేశాం? వ్యవస్థను ముఖరహితంగా మార్చాం. పన్ను అధికారి, పన్ను చెల్లింపుదారుడి మధ్య ముఖాముఖి లేకుండా ఏర్పాట్లు జరిగాయి. జిఎస్ టి నల్లధనం మార్గాలను కూడా మూసివేసింది. నిజాయితీగా పని చేసినప్పుడు కొందరికి సమస్యలు రావడం సహజం. సమస్యలు ఉన్నవారు వీధుల్లో ప్రజలను దూషిస్తారా? మిత్రులారా, అందుకే ఈ అవినీతి ప్రతినిధులు కలవరపడుతున్నారు. దేశంలోని నిజాయితీ గల వ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

మిత్రులారా,

 

వారి పోరాటం కేవలం మోదీ తోనే ఉండి ఉంటే ఎప్పుడో విజయం సాధించి ఉండేవారు. కానీ తాము సామాన్య భారతీయుడికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలియకపోవడం వల్ల వారు తమ కుట్రల్లో విజయం సాధించలేకపోతున్నారు. ఈ అవినీతిపరులు ఎంత పెద్ద కూటమిగా ఏర్పడినా, అవినీతిపరులందరూ ఒకే వేదికపైకి వచ్చినా, వంశపారంపర్య సభ్యులందరూ ఒకే చోటకు వచ్చినా మోదీ  వెనక్కి తగ్గడం లేదు. అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుంది మిత్రులారా. ఈ అక్రమాల నుంచి దేశాన్ని విముక్తం చేయాలని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని నేను. నాకు మీ ఆశీస్సులు కావాలి.

 

మిత్రులారా,

 

ఈ స్వాతంత్ర్య  'అమృత్ కాల్' మనందరి కృషికి చెందినది. ప్రతి భారతీయుడి శక్తి, కృషిని వర్తింపజేసినప్పుడు, అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధ్యమైనంత త్వరగా సాకారం చేయగలుగుతాము. రిపబ్లిక్ నెట్వర్క్ ఈ స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను . ఇప్పుడు అర్నబ్ తాను ప్రపంచవ్యాప్తం అవుతున్నానని చెప్పారు, కాబట్టి భారతదేశ గొంతుకు కొత్త బలం లభిస్తుంది. ఆయనకు కూడా నా శుభాకాంక్షలు. ఇప్పుడు నిజాయితీతో నడిచే దేశస్తుల సంఖ్య పెరుగుతోంది, ఇది గొప్ప భారతదేశానికి భరోసా.. నా దేశప్రజలే గొప్ప భారతదేశానికి భరోసా. నేను దానిని నమ్ముతానని నేను మీకు హామీ ఇస్తున్నాను. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు!



(Release ID: 1922463) Visitor Counter : 160