ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ దుర్ఘటనలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం


మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటన

Posted On: 15 APR 2023 6:27PM by PIB Hyderabad

   త్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ప్రమాదం ఫలితంగా ప్రాణనష్టం వాటిల్లడంపై   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం అందిస్తామని శ్రీ మోదీ ప్రకటించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వరుస ట్వీట్లలో పంపిన సందేశాల్లో:  

“ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిన ప్రమాదం నన్నెంతో బాధించింది. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి” అని పేర్కొంది. అలాగే...

 

“షాజహాన్‌పూర్‌ దుర్ఘటన బాధితుల కోసం స్థానిక యంత్రాంగం సంపూర్ణ సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టింది: ప్రధానమంత్రి” అని తెలిపింది. మరోవైపు-

 

“షాజహాన్‌పూర్‌లో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందించబడుతుంది: ప్రధానమంత్రి” అని తెలిపింది.


(Release ID: 1917150) Visitor Counter : 150