పర్యటక మంత్రిత్వ శాఖ

"మిషన్ మోడ్‌లో పర్యాటక రంగం" ప్రచారం అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ రెండు రోజుల చింతన్ శివిర్‌ను నిర్వహించింది


భారతదేశ పర్యాటక రంగ భవిష్యత్తు కోసం భాగస్వామ్య దృష్టిని ఆవిష్కరించడానికి ఇది అత్యంత అనుకూలమైన క్షణం, భారతదేశాన్ని అత్యంత దర్శనీయ పర్యాటక గమ్యస్థానంగా మార్చడానికి రాబోయే 25 సంవత్సరాలలో దాని దిశ దశ ను మార్గనిర్దేశం చేస్తుంది: శ్రీ జి.కె రెడ్డి

Posted On: 29 MAR 2023 4:45PM by PIB Hyderabad

మిషన్ మోడ్‌ లో పర్యాటక రంగం ను ప్రోత్సహించడానికి ఉద్దేశపూర్వకంగా, ఆలోచనాత్మకంగా మరియు వ్యూహాలను రూపొందించడానికి, పర్యాటక మంత్రిత్వ శాఖ మార్చి 28 మరియు మార్చి 29 తేదీలలో న్యూ ఢిల్లీలో రెండు రోజుల చింతన్ శివిర్‌ను నిర్వహించింది, ఇందులో అన్ని రాష్ట్రాలు, పరిశ్రమల సంఘాలు మరియు పరిశ్రమల నాయకులు పాల్గొన్నారు.

 

మొదటి రోజు చర్చల ఎజెండాను పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు మరియు దేశం  స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి పర్యాటకాన్ని ఒక వాహనంగా ఉపయోగించుకోవాలనే ప్రభుత్వ దృక్పథాన్ని ఆయన వివరించారు. 2047లో భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్నప్పుడు, భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక దర్శనీయ గమ్య స్థానం గా మార్చేందుకు వచ్చే 25 సంవత్సరాల పాటు దాని దిశ దశ ను మార్గనిర్దేశం చేస్తూ, భారతదేశ పర్యాటక భవిష్యత్తు కోసం భాగస్వామ్య దార్శనికతను ఆవిష్కరించడానికి ఇది అత్యంత సరైన తరుణమని ఆయన పేర్కొన్నారు.  మిషన్ మోడ్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్రాల క్రియాశీల భాగస్వామ్యం, ప్రభుత్వ కార్యక్రమాల కలయిక మరియు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు అనే మూడు కీలక స్తంభాలని ఆయన అన్నారు . రాష్ట్రాలు తమ పర్యాటక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో మార్గదర్శకాలను అందించడానికి జాతీయ వ్యూహాలు మరియు నమూనాలను అభివృద్ధి చేయడం ఒక ప్రధాన దశ అని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ పర్యాటక రంగం, అడ్వెంచర్ పర్యాటక రంగం, మైస్ పర్యాటక రంగం, హరిత పర్యాటక రంగం, వైద్య పర్యాటక రంగం, సుస్థిర పర్యాటక రంగం వంటి వివిధ పర్యాటక రంగాల అభివృద్ధి కోసం మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ వ్యూహాలను రూపొందించింది.

 

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ మాట్లాడుతూ, 02 రోజుల చింతన్ శివిర్ ఫలవంతమైన పరస్పర చర్యలను నిర్వహించడానికి మరియు దేశవ్యాప్తంగా అనుసరించిన మంచి పద్ధతులను పంచుకోవడానికి మరియు సాంకేతిక పరిష్కారాలతో కూడిన ప్రత్యేకమైన ఆలోచనలను పంచుకోవడానికి పర్యాటక రంగం లో సుస్థిరత మరియు పర్యాటక రంగం ప్రయోజనాలను కింద గ్రామీణ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో బాధ్యతాయుతమైన పర్యాటన లకు ఒక వేదికను అందజేస్తుందని చెప్పారు. 

 

మొదటి రోజు చర్చల ఎజెండా ఇన్‌క్రెడిబుల్ ఇండియా@100పై  6 సెషన్‌లుగా విభజించబడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు మరియు పరిశ్రమల భాగస్వామ్య దృష్టి, విధాన ప్రమాణాలు మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడి పెట్టగల ప్రాజెక్ట్‌లు మరియు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, “ప్రపంచ ఉత్తమ ప్రమాణాలు మరియు యూ ఎన్ డబ్ల్యూ టి ఓ ద్వారా టూరిజం పెట్టుబడుల కోసం సామర్ధ్య నిర్మాణం ”, మైస్ పర్యాటక రంగం, వివాహ పర్యాటక రంగం, ఆవిష్కరణలు మరియు డిజిటలైజేషన్ మరియు పర్యాటక రంగంలో స్టార్టప్‌లను అభివృద్ధి చేయడం పై చర్చలు జరిగాయి. ఫెయిత్, ఇండియా కన్వెన్షన్ ప్రమోషన్ బ్యూరో (ICPB) అలాగే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి అంతర్జాతీయ సంస్థల నుండి పలువురు ముఖ్య వక్తలు పరిశ్రమ లబ్దిదారుల నుండి ప్రతినిధులు ప్రసంగించారు. యూ ఎన్ డబ్ల్యూ టి ఓ సంస్థాగత, ఆకర్షణీయత మరియు ప్రచారం అభివృద్ధి వ్యూహం పై యూ ఎన్ డబ్ల్యూ టి ఓ ఫ్రేమ్‌వర్క్ ద్వారా పర్యాటక పెట్టుబడి వ్యూహం (TIS) అభివృద్ధిని చర్చించింది. ఇది స్థానిక వ్యాపార వాతావరణం, అనుకూలత, సాధ్యత, పర్యాటక పరిశ్రమలో వృద్ధి మరియు ఫైనాన్సింగ్ ఎంపికల అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే సమగ్ర పెట్టుబడి వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి నిర్మాణాత్మక విధానాన్ని అందిస్తుంది. 

 

రాజస్థాన్ రాష్ట్రం పర్యాటక రంగం మరియు ఆతిథ్య రంగానికి పరిశ్రమ హోదాను మంజూరు చేయడంతో పాటు పరిశ్రమకు ఇచ్చిన ప్రయోజనాలపై సమగ్ర ప్రదర్శనను అందించింది.

 

మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకం మరియు ఆతిథ్య రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పెట్టుబడి పెట్టదగిన ప్రాజెక్టులను ప్రదర్శించింది. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ దీవులు కూడా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం యొక్క విజయవంతమైన కేస్ స్టడీలను పంచుకుంది. మైస్ పర్యాటక రంగం మరియు వివాహ పర్యాటక రంగం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, దేశంలో మైస్ పర్యాటక రంగం  మరియు వివాహ పర్యాటక రంగం అభివృద్ధి కోసం వివిధ విధానాలు, చొరవలు మరియు వ్యూహాలపై చర్చించడానికి రెండు సముచిత విభాగాలపై ప్రత్యేక సెషన్ కేటాయించబడింది. మైస్ పర్యాటక రంగం కాలానుగుణతను అధిగమించి గమ్యస్థానానికి అధిక ఆదాయాన్ని మరియు ఏడాది పొడవునా వ్యాపారాన్ని తెస్తుంది. అదే సమయంలో, ఒక ప్రాంతం మైస్ పర్యాటక రంగ గమ్యస్థానంగా విజయవంతం కావడానికి ముందు మైస్ పర్యాటక రంగంకి దాని స్వంత పర్యావరణ వ్యవస్థ అవసరం. భారతదేశంలో వివాహ గమ్యస్థానాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం.

 

ప్రత్యేక హైదరాబాద్ కన్వెన్షన్ విజిటర్స్ బ్యూరో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మైస్ పర్యాటక రంగం అభివృద్ధి మరియు ప్రచారం ఎలా జరుగుతుందో తెలంగాణ రాష్ట్రం ప్రదర్శించింది.

 

ఈ సందర్భంగా, స్వదేశ్ దర్శన్ పథకం కింద ఆరు ప్రధాన విభాగాలలో రాష్ట్రాలు అనుసరించిన ఉత్తమ పద్ధతులను గుర్తించి పర్యాటక మంత్రిత్వ శాఖ వారిని సత్కరించింది.

 

రాష్ట్రాలు చురుకైన భాగస్వామ్యంతో మరియు ప్రభుత్వ పథకాలు మరియు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం రంగం అభివృద్ధిని మిషన్ మోడ్‌లో ప్రోత్సహించాలని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

 

భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ యొక్క చొరవగా, పర్యాటక మంత్రిత్వ శాఖ 1వ ప్రపంచ పర్యాటక రంగం పెట్టుబడిదారుల సదస్సును మే 17-19, 2023న నిర్వహిస్తోంది. చింతన్ శివిర్   1వ ప్రపంచ పర్యాటక రంగం పెట్టుబడిదారుల సదస్సు ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యూహాలు మరియు సన్నాహాల గురించి చర్చించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది

***



(Release ID: 1912049) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Marathi , Hindi