పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

భారతదేశంలో 79.4 మిలియన్ టన్నులకు పెరిగిన కార్బన్ స్టాక్

Posted On: 23 MAR 2023 3:08PM by PIB Hyderabad

చెట్టు ద్వారా కార్బన్ సీక్వెస్ట్రేషన్ యొక్క పరిమాణం.. చెట్ల జాతులతో సహా వివిధ పర్యావరణ మరియు భౌతిక కారకాలపై ఆధారపడి ఉంటుందిఇండియా స్టేట్ ఆఫ్ ది ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్)- 2021 ప్రకారం అడవులలో మొత్తం కార్బన్ స్టాక్ 7,204 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడిందిఇందులో 529.47 మిలియన్ టన్నుల కార్బన్ స్టాక్ ప్లాంటేషన్ /అటవీ వెలుపల చెట్లలో గుర్తించబడింది. 2019 నాటి చివరి అంచనాతో పోలిస్తే దేశంలోని కార్బన్ స్టాక్లో 79.4 మిలియన్ టన్నుల పెరుగుదల ఉందివార్షిక పెరుగుదల 39.7 మిలియన్ టన్నులకు సమానంగా ఉంది. ఇది 145.6 మిలియన్ టన్నుల CO2eqకి సమానం. వాతావరణ మార్పుల విషయమై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ (యుఎన్ఎఫ్సీసీసీ) భారతదేశం ఒక భాగస్వామి. పారిస్ ఒప్పందం (ఎన్.డి.ఎ.ఐ.ఎ.పి.ఎ) లోని ఆర్టికల్ 6 అమలు కోసం జాతీయంగా నియమించబడిన అథారిటీ నోటిఫై చేయబడింది, ఇది కార్బన్ ట్రేడింగ్ కోసం పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6 ప్రకారం ప్రాజెక్ట్‌ల ఆమోదపు ఆదేశాన్ని కలిగి ఉంది. అలాగే, ఒక భారతీయ కార్బన్ మార్కెట్ (ఐసీఎం) ఇంటర్-ఎలియా ఆఫ్‌సెట్ మెకానిజంను కలిగి ఉంటుంది. ఆఫ్‌సెట్ మెకానిజం కింద, రైతులు మరియు గ్రామ పంచాయతీలతో సహా సంస్థలు కార్బన్ క్రెడిట్‌లను ఉత్పత్తి చేయవచ్చు మరియు విక్రయించవచ్చు. ఈ సమాచారాన్ని పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే రాజ్యసభకు ఇచ్చిన  ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***



(Release ID: 1910090) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Gujarati