కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

మహమ్మారి అనంతరం ప్రపంచం మొత్తం కలిసి ఉమ్మడి గా కోలుకోవాలని మరియు రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలని సంకల్పించింది అని శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు.


సార్వత్రిక సామాజిక భద్రత మరియు ప్రపంచవ్యాప్తంగా దాని పోర్టబిలిటీ ఒక ముఖ్యమైన అంశం: శ్రీ యాదవ్

Posted On: 20 MAR 2023 8:52AM by PIB Hyderabad

కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచం కలిసి ఉమ్మడి గా కోలుకోవాలని మరియు రికవరీని మానవ కేంద్రక  ప్రక్రియగా మార్చాలని సంకల్పించిందని అన్నారు.  అమృత్‌సర్‌లో జరుగుతున్న ఎల్ 20 ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ గతిశీల ఆర్థిక వాతావరణంలో వృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగి  విజ్ఞానవంతులు అయ్యేవిధంగా మన కార్మికులు  చూసుకోవాలి.

 

సార్వత్రిక సామాజిక భద్రత మరియు ప్రపంచవ్యాప్తంగా దాని పోర్టబిలిటీ అనేది మనం తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన ముఖ్యమైన అంశం అని శ్రీ యాదవ్ అన్నారు. ముఖ్యంగా అనధికారిక రంగాన్ని సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావాలని ఆయన అన్నారు. సామాజిక భద్రత కోసం సామాజిక బీమా మరియు సామాజిక సహాయ పథకాల యొక్క స్థిరమైన మిశ్రమం ఉండాలి అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి యొక్క 'నారీ శక్తి' లేదా 'మహిళా శక్తి' యొక్క దృక్పథానికి అనుగుణంగా, కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని, తద్వారా సమానమైన, సమగ్రమైన మరియు అభివృద్ధి చెందిన సమాజం ఏర్పడటానికి దారితీస్తుందని శ్రీ యాదవ్  అన్నారు.

 

జీ 20 యొక్క ‘వసుధైవ కుటుంబం’ దార్శనికత ఒకే భూమి, ఒకే కుటుంబం మరియు ఒక భవిష్యత్తు అనే భావనను సూచిస్తుందని మంత్రి అన్నారు. జీ 20ని నిర్ణయాత్మకంగా మరియు కార్యాచరణ ఆధారితంగా మార్చాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, జీ20 సమావేశాలు ఖచ్చితమైన ఫలితాన్ని సాధించేందుకు మనల్ని ప్రేరేపించి, ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.

 

సంవత్సరాలుగా, జీ 20 మరియు ఎల్20 సమావేశాలు విస్తృతంగా అంగీకరించబడిన వివిధ విధాన కార్యక్రమాల ద్వారా కార్మిక మార్కెట్ సవాళ్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాయని శ్రీ యాదవ్ చెప్పారు.  డిజిటల్ సాంకేతికత మరియు సాంకేతిక పరివర్తన యొక్క ఆవిర్భావం ఫలితంగా అదనంగా కొత్త రకాల ఉపాధి, డిజిటలైజేషన్, గిగ్ ఎకానమీ, నైపుణ్య లోపాలు మొదలైన వాటితో సహా  పని ఉపాధి ప్రపంచంలో అపూర్వమైన మార్పులకు దారితీసింది, 

 

జీ 20 ఆధ్వర్యంలో ఎల్20 సార్వత్రిక సామాజిక భద్రత, సామాజిక భద్రతా నిధి యొక్క పోర్టబిలిటీ, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం మరియు పని ఉపాధి యొక్క భవిష్యత్తు వంటి చాలా ఖచ్చితమైన మరియు సంబంధిత థీమ్‌లను ఎంచుకుంది అని శ్రీ యాదవ్ చెప్పారు. జి20 దేశాల్లోని అన్ని ట్రేడ్ యూనియన్‌లు కార్యాచరణ ఫలితాలతో ముందుకు వస్తాయన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. భారతదేశం జీ 20 అధ్యక్ష పదవిని చేపట్టడం ఒక మైలురాయి ఘట్టమని, ప్రపంచంలోని సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి మాకు అవకాశం కల్పిస్తుందని మంత్రి అన్నారు.

***



(Release ID: 1908711) Visitor Counter : 127