రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజా రోడ్డు రవాణాలో మహిళల భద్రత

प्रविष्टि तिथि: 16 MAR 2023 2:15PM by PIB Hyderabad

నిర్భయ ఫ్రేమ్‌వర్క్ కింద రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో, ఏఐఎస్ 140 ప్రమాణాల ప్రకారం భద్రత & భద్రత అమలు కోసం రాష్ట్రాల వారీగా వాహన ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడం, అనుకూలీకరించడం, అమలు చేయడం మరియు నిర్వహించడం కోసం ఒక పథకాన్ని రూపొందించింది. ఈ పథకం మార్గదర్శకాలు 15 జనవరి, 2020న జారీ చేయబడ్డాయి. ఈ పథకం కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఏఐఎస్-140 ప్రమాణాలకు అనుగుణంగా మానిటరింగ్ సెంటర్‌ను (కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్ లేదా బ్యాకెండ్ సిస్టమ్) ఏర్పాటు చేస్తాయి. నిర్భయ ఫ్రేమ్‌వర్క్ కింద మంజూరైన ఇతర ప్రాజెక్టులతో పాటు పథకం పురోగతిని పర్యవేక్షించడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన సాధికార కమిటీ నిరంతరం సమావేశాలను నిర్వహిస్తుంది. మానిటరింగ్ సెంటర్‌లో వెహికల్ ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్ రూపకల్పన, అభివృద్ధి, విస్తరణ కోసం ఏజెన్సీ ఎంపిక మరియు దాని మూల్యాంకనం, మోర్త  జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలకు సంబంధించినది. ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

*****


(रिलीज़ आईडी: 1907809) आगंतुक पटल : 120
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Tamil